ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘జిజ్ఞాస’ క్విజ్ విజేతలకు అభినందనలు తెలిపారు. ఇది ప్రపంచంలోనే భారీ ‘ప్రశ్న-జవాబు’ల కార్యక్రమం. సుసంపన్న-ఉజ్వల నైతిక విలువల సంగమమైన ప్రాచీన భారత నాగరిక విలువలు, సంస్కృతి పరిణామం ప్రధానాంశాలుగా ఈ కార్యక్రమం ఇప్పటిదాకా 17 భాషలలో 10లక్షల దఫాలకుపైగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంపై కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ ట్వీట్ను ప్రజలతో పంచుకుంటూ పంపిన సందేశంలో:
“జిజ్ఞాస విజేతలందరికీ అభినందనలు. మన చరిత్ర, ప్రాచీన సంస్కృతిపై విజ్ఞానం ప్రోది చేసేదిశగా ఇదొక విస్తృత కృషి. ఈ కార్యక్రమానికి ఇంతటి అద్భుత స్పందన రావడం ఎంతో హర్షదాయకం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Congratulations to all the winners of Jigyasa. This was an extensive effort aimed at enhancing knowledge about our history and culture among the youth. Glad to see such a phenomenal response for this quiz. https://t.co/LvZ5TlJuEe
— Narendra Modi (@narendramodi) August 14, 2023