హైదరాబాద్ లోని జనోమ్ వ్యాలీలో జీవ వైద్య పరిశోధనలకు జాతీయ వనరుల వేదిక (నేషనల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్… ఎన్.ఏ.ఆర్.ఎఫ్) ను ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. ఈ ఎన్.ఏ.ఆర్.ఎఫ్ ను వైద్య పరిశోధనల భారతీయ మండలి (ఐ.సి.ఎం.ఆర్) ఆధ్వర్యంలో ఏర్పాటుచేయాలని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖలోని ఆరోగ్య పరిశోధనల విభాగం ప్రతిపాదించింది. ఎన్.ఏ.ఆర్.ఎఫ్ ఏర్పాటుకు 338.58 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ఈ వనరుల కేంద్రం 2018-19 కల్లా పనిచేయడం ప్రారంభించవచ్చు. దేశంలో ప్రయోగశాల వాతావరణంలో దృఢమైన జంతువుల సృష్టికి ఉపయోగపడే బేసిక్, అప్లయిడ్ బయో మెడికల్ రీసెర్చ్ కోసం ఉద్దేశించిన మొట్టమొదటి పరిశోధనా వేదిక ఈ ఎన్.ఏ.ఆర్.ఎఫ్. యే కానుంది. అంతేకాకుండా దీనిని వేరువేరు పరిశోధన, అభివృద్ధి (ఆర్ & డి) ఉత్పత్తులను పరీక్షించడం కోసం అవసరమయ్యే మూషికాలు, వానరాలు తదితర జంతువులను ఉంచడానికి పెంచడానికి అనువైన ఒక ప్రపంచస్థాయి కేంద్రంగా అభివృద్ధి చేస్తారు. ఈ కేంద్రం దేశంలో ప్రధానంగా వైద్య కళాశాలలు, పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, బయోటెక్ / బయో ఫార్మా కంపెనీలలో పరిశోధనలకు దోహదపడేలా లేబరేటరీ యానిమల్స్ను తయారుచేసి అందిస్తుంది. బయో మెడికల్ రీసెర్చ్ రంగంలో కొన్ని ఎంపికచేసిన పరిశోధనల్లో పాలుపంచుకొనే సిబ్బందికి కావలసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను కూడా ఈ కేంద్రం రూపొందిస్తుంది. ఈ కేంద్రం కోసమని రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని జనోమ్ వ్యాలీలో 102.69 ఎకరాల భూమిని కేటాయించింది.
Cabinet approved the setting up of a National Resource Facility for Bio-medical Research (NARF) at Genome Valley in Hyderabad.
— PMO India (@PMOIndia) November 18, 2015
The estimated project cost is Rs. 338.58 crores and the resource center is expected to be functional by 2018-19.
— PMO India (@PMOIndia) November 18, 2015
The institution will be the first of its kind for quality laboratory animals for basic and applied biomedical research in the country.
— PMO India (@PMOIndia) November 18, 2015