శ్రీ శ్రీ హరిచంద్ ఠాకుర్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. సమాజంలో దగాపడ్డ వర్గాల అభ్యున్నతితోపాటు సమానత్వం, కరుణ, న్యాయం.. వంటి విలువలను పెంపొందింపచేయడానికి శ్రీ ఠాకుర్ కృషి చేశారంటూ శ్రీ మోదీ ప్రశంసించారు. ఈ ఏడాది మతువా ధర్మ మహా మేళాకు శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఎక్స్లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఆ సందేశంలో:
‘‘శ్రీ శ్రీ హరిచంద్ ఠాకుర్కు ఆయన జయంతి సందర్భంగా నివాళులు. సేవ చేయడం, ఆధ్యాత్మికత.. వీటి ప్రాముఖ్యాన్ని ఆయన ఉద్బోధించి, అసంఖ్యాక ప్రజల హృదయాల్లో చిరంజీవిగా ఉన్నారు. సమాజంలో మోసానికి గురైన వర్గాల అభ్యున్నతికీ, సమానత్వం, కరుణ, న్యాయం.. ఈ విలువలను పెంపొందింపచేయడానికీ ఆయన తన జీవనాన్ని అంకితం చేశారు. పశ్చిమ బెంగాల్లో ఠాకుర్నగర్ను, బంగ్లాదేశ్లో ఓరకాండీని నేను సందర్శించి, ఆయనకు శ్రద్ధాంజలి ఘటించాను. ఆ సందర్భాలను నేను ఎన్నటికీ మరచిపోను.
మతువా సముదాయ వైభవోపేత సంస్కతిని కళ్లెదుట నిలిపే మతువా ధర్మ మహా మేళా 2025 ( #MatuaDharmaMahaMela2025)కు నా శుభాకాంక్షలు. మతువా సముదాయం సంక్షేమానికి మా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. మరి మేం రాబోయే కాలంలో కూడా వారి శ్రేయం కోసం అలుపెరుగక పని చేస్తూనే ఉంటాం.
జై హరిబోల్. @aimms_org ” అని పేర్కొన్నారు.
Tributes to Shree Shree Harichand Thakur on his Jayanti. He lives on in the hearts of countless people thanks to his emphasis on service and spirituality. He devoted his life to uplifting the marginalised and promoting equality, compassion and justice. I will never forget my…
— Narendra Modi (@narendramodi) March 27, 2025