శ్రీ భవానీ సింహ్ జీ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ బిజెపి సహ్- సంఘటన్ మహామంత్రి శ్రీ భవానీ సింహ్ గారి మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో అత్యంత దు:ఖాన్ని వ్యక్తం చేశారు. శ్రీ భవానీ సింహ్ గారి వినమ్ర వ్యక్తిత్వాన్ని, కష్టించి పనిచేసే తత్వాన్ని ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొన్నారు. సంస్థ కు శ్రీ భవానీ సింహ్ జీ అందించిన తోడ్పాటు ను, ప్రజా సేవ లో ఆయన ప్రయాసల ను కూడా ప్రధాన మంత్రి స్మరించుకొన్నారు. దివంగత ఆత్మ కు ఆ ఈశ్వరుడు శాంతి ని ప్రసాదించు గాక అంటూ శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.
***
उत्तर प्रदेश भाजपा के सह-संगठन महामंत्री भवानी सिंह जी के निधन से अत्यंत दुख हुआ है। उन्होंने राज्य में भाजपा को मजबूत करने में अपना बहुमूल्य योगदान दिया। विनम्र, कर्मठ भवानी सिंह जी का पूरा जीवन जनसेवा में समर्पित रहा है। ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करे। ओम शांति!
— Narendra Modi (@narendramodi) May 5, 2021