శ్రీ దరిపల్లి రామయ్య మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సంతాపం వ్యక్తం చేశారు. లక్షలాది చెట్లను నాటి.. వాటి పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య చిరస్మరణీయులని ప్రశంసించారు.
‘ఎక్స్’ వేదికగా చేసిన ఒక పోస్ట్ లో ఆయన ఇలా పేర్కొన్నారు:
“దరిపల్లి రామయ్య గారు సుస్థిరత ప్రయత్నాలకు నాయకత్వం వహించిన మార్గదర్శిగా చిరస్మరణీయులు. ఆయన లక్షలాది మొక్కలు నాటి.. వాటి పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ప్రకృతి పట్ల ఆయన చేసిన అవిశ్రాంత కృషి, తనకు గల మక్కువ.. భావి తరాల సంరక్షణ పట్ల ఆయన బాధ్యతకు నిదర్శనం. మన భూమిని పచ్చదనంతో నింపే ప్రయత్నంలో మన యువతకు సదా స్ఫూర్తినిస్తుంటారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. ఓం శాంతి”
Daripalli Ramaiah Garu will be remembered as a champion of sustainability. He devoted his life to planting and protecting lakhs of trees. His tireless efforts reflected a deep love for nature and care for future generations. His work will keep motivating our youth in their quest…
— Narendra Modi (@narendramodi) April 12, 2025
దరిపల్లి రామయ్య గారు సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ,భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి మన యువతలో,…
— Narendra Modi (@narendramodi) April 12, 2025