ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు కొలంబోలో శ్రీలంకలోని తమిళ సామాజిక నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమిళ నాయకులు ఆర్.సంపంతన్, మావై సేనతిరాజా మృతి పట్ల ప్రధాని సంతాపం తెలిపారు.
“శ్రీలంకలోని తమిళ సామాజిక నాయకులను కలవడం నాకు ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. నాకు వ్యక్తిగతంగా పరిచయమున్న గౌరవ తమిళ నాయకులు శ్రీ ఆర్.సంపంతన్, శ్రీ మావై సేనతిరాజాల మరణం పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేశాను. సమైక్య శ్రీలంకలోని తమిళ సమాజానికి సమానత్వం, గౌరవం, న్యాయంతో కూడిన జీవితానికి భారత్ అచంచలమైన నిబద్ధతను కలిగివుందని పునరుద్ఘాటించాను. ఈ పర్యటన సందర్భంగా నేను ప్రారంభించిన అనేక ప్రాజెక్టులు, కార్యక్రమాలు తమిళుల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పురోగతికి దోహదపడతాయని విశ్వసిస్తున్నాను” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో వేర్వేరు పోస్టుల్లో పేర్కొన్నారు.
It is always a pleasure to meet the leaders of the Tamil community of Sri Lanka. Conveyed my condolences on the passing of respected Tamil leaders, Thiru R. Sampanthan and Thiru Mavai Senathirajah, both of whom were personally known to me. Reiterated unwavering commitment to a… pic.twitter.com/xCjIcWkSrv
— Narendra Modi (@narendramodi) April 5, 2025
இலங்கையில் உள்ள தமிழ் சமூகத்தினரது தலைவர்களை சந்திக்கின்றமை எப்பொழுதும் மகிழ்ச்சிக்குரிய ஒரு விடயமாகும். பெருமதிப்புக்குரிய தமிழ் தலைவர்களான திரு இரா. சம்பந்தன் மற்றும் திரு மாவை சேனாதிராஜா ஆகியோரது மறைவுக்கு இச்சந்தர்ப்பத்தில் அனுதாபம் தெரிவித்தேன், அவர்கள் இருவருமே தனிப்பட்ட… pic.twitter.com/bRWmY6lXH5
— Narendra Modi (@narendramodi) April 5, 2025