రామ జన్మభూమి మందిర ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మతపరమైన ఆచారాలు, ధార్మిక గ్రంధాల విషయంలో మహంత్ నిష్ణాతులని, తన యావత్ జీవితాన్ని రాముల వారి సేవకే అంకితం చేశారని శ్రీ మోదీ కొనియాడారు.
‘ఎక్స్’ వేదికపై రాస్తూ..
“రామ జన్మభూమి మందిర ప్రధాన అర్చకులు మహంత్ సత్యేంద్ర దాస్ జీ మరణం నాకు తీవ్రమైన ఆవేదనను కలిగించింది. ధార్మిక విధుల్లో నిష్ణాతులు, శాస్త్ర పారంగతులైన మహంత్.. తన జీవితం మొత్తాన్నీ రాముల వారి సేవకే అంకితం చేశారు. దేశ ఆధ్యాత్మిక, సామాజిక రంగానికి వారు చేసిన సేవలను ఎల్లప్పుడూ అత్యంత గౌరవంతో గుర్తు చేసుకుంటాం. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకూ అనుయాయులకు తగిన స్థైర్యాన్ని ప్రదానం చేయమని దేవుడిని వేడుకుంటున్నాను. ఓం శాంతి!” అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
राम जन्मभूमि मंदिर के मुख्य पुजारी महंत सत्येंद्र दास जी के देहावसान से अत्यंत दुख हुआ है। धार्मिक अनुष्ठानों और शास्त्रों के ज्ञाता रहे महंत जी का पूरा जीवन भगवान श्री राम की सेवा में समर्पित रहा। देश के आध्यात्मिक और सामाजिक जीवन में उनके अमूल्य योगदान को हमेशा श्रद्धापूर्वक… pic.twitter.com/eWMVeZnRLQ
— Narendra Modi (@narendramodi) February 12, 2025