రాజస్థాన్ లోని దౌసాలో ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’ ను ‘గాడ్ భరై భ రాయి’ వేడుక గా జరుపుకునే కొత్త
కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు.
రాజస్థాన్ లోని దౌసా పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి జస్కౌర్ మీనా ఒక ట్వీట్ థ్రెడ్ లో, రాజస్థాన్ లోని దౌసాలో ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకాన్ని తాము ‘గాడ్ భరై’ వేడుకగా జరుపుకుంటామని, అక్కడ గర్భిణీ స్త్రీలందరినీ సమావేశపరిచి వారి బిడ్డల ఆరోగ్యం కోసం తాము ‘పోషణ కిట్’ ఇస్తామని తెలియజేశారు.
ఈ పథకం ద్వారా ఒక్క రాజస్థాన్ లోనే 2022-23లో 3.5 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారని ఆమె తెలిపారు.
దౌసా ఎంపీ శ్రీమతి జస్కౌర్ మీనాచేసిన ట్వీట్ థ్రెడ్ పై ప్రధాని స్పందిస్తూ..
“దౌసా యొక్క ఈ ప్రత్యేక చొరవ ప్రధాన మంత్రి మాతృ వందన యోజనకు కొత్త శక్తిని ఇవ్వబోతోంది. ఇది తల్లులు, శిశువుల ఆరోగ్య భద్రతకు భరోసా ఇస్తుంది. ” అని ట్వీట్ చేశారు.
दौसा की यह अनूठी पहल प्रधानमंत्री मातृ वंदना योजना को नई ऊर्जा देने वाली है। इससे माताओं के साथ-साथ शिशुओं की स्वास्थ्य सुरक्षा भी सुनिश्चित हो रही है। https://t.co/A6uxbh7o60
— Narendra Modi (@narendramodi) June 12, 2023
*******
DS/ST
दौसा की यह अनूठी पहल प्रधानमंत्री मातृ वंदना योजना को नई ऊर्जा देने वाली है। इससे माताओं के साथ-साथ शिशुओं की स्वास्थ्य सुरक्षा भी सुनिश्चित हो रही है। https://t.co/A6uxbh7o60
— Narendra Modi (@narendramodi) June 12, 2023