Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రూ.4,406 కోట్ల పెట్టుబడితో 2,280 కి.మీరహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపారు

దేశంలోని ఇతర ప్రాంతాలలో మాదిరిగానే సరిహద్దు ప్రాంతాలలో కూడా సౌకర్యాల కల్పనతో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న విధానానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు.

ఈ నిర్ణయం రోడ్డుటెలీకమ్యూనికేషన్ల అనుసంధానంనీటి సరఫరాఆరోగ్యంవిద్య సౌకర్యాల వృద్ధిపై  ఎంతో ప్రభావం చూపనుందిఇది గ్రామీణ జీవనోపాధిని పెంచడంతోపాటుప్రయాణాన్ని సులభతరం చేస్తుందిఇంకా ఈ ప్రాంతాలను మిగిలిన రహదారుల వ్యవస్థతో అనుసంధానం చేస్తుంది.

 

***