Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మిక్ జాగర్ కు ప్రధానమంత్రి స్వాగతం


పాశ్చాత్య సంగీత దిగ్గజం మిక్ జాగర్ పోస్టుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ స్పందించారు. 

 

భారతదేశాన్ని సందర్శించడం తనకెంతో ఆనందంగా ఉందంటూ జాగర్ ఆ పోస్టులో సంతోషం వెలిబుచ్చారు. దీనిపై స్పందించిన ప్రధానమంత్రి ఆయన గీతాన్ని ఉదాహరిస్తూ ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

 

“మనం ఆశించిన ప్రతి ఒక్కటీ మనకు దక్కదు’ కానీ, ప్రతి అన్వేషకుడికీ భారతదేశమంతటా ఉత్సాహం,  సంతోషం, సంతృప్తి మెండుగా లభిస్తాయి. ఆ మేరకు భారతీయ సంస్కృతి, ప్రజల నుంచి మీకెంతో ఆనందం లభించడం ముదావహం. తరచూ భారతదేశాన్ని సందర్శిస్తూండండి” అని స్వాగతించారు.

 

***

DS/AK