Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాసేలో భారత కాన్సులేట్ జనరల్‌ను సంయుక్తంగా ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు శ్రీ ఇమాన్యుయెల్ మాక్రాన్‌

మాసేలో భారత కాన్సులేట్ జనరల్‌ను సంయుక్తంగా ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు శ్రీ ఇమాన్యుయెల్ మాక్రాన్‌


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు శ్రీ ఇమాన్యుయెల్ మాక్రాన్‌ ఫ్రాన్స్‌లోని మాసేలో భారత కాన్సులేట్ జనరల్‌ (దౌత్య కార్యాలయం) ను సంయుక్తంగా ప్రారంభించారు.

భారత-ఫ్రాన్స్‌ ద్వైపాక్షిక సంబంధాలలో కాన్సులేట్ జనరల్ కార్యాలయ ప్రారంభం కీలకమైనదిగా భావిస్తున్నారు. శ్రీ మాక్రాన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేక గౌరవమంటూ శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు.  ఈ చారిత్రక సందర్భాన్ని వీక్షించడానికి వచ్చిన భారత సమాజ ప్రతినిధులు ఇరువురు నేతలకూ ఘన స్వాగతం పలికారు.

మాసే లో దౌత్య కార్యాలయం ప్రారంభించాలన్న నిర్ణయాన్ని ప్రధాన మంత్రి జూలై 2023 ఫ్రాన్స్‌ పర్యటన సందర్భంగా ప్రకటించారు. ఈ కాన్సులేట్ జనరల్ దౌత్య సేవలు దక్షిణ ఫ్రాన్స్‌లోని ప్రోవెన్స్ అల్ప్స్ కోట్ డేజూర్, కోర్సికా, ఆక్సిటానీ, ఆవెర్న్-రోన్-ఆల్ప్స్ అనే నాలుగు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉంటాయి.

ఫ్రాన్స్ దేశంలోని ఈ ప్రాంతం వ్యాపారం, పరిశ్రమలు, ఇంధనం, లగ్జరీ పర్యాటకాలకు ప్రసిద్ధి చెందింది. అంతేకాక ఈ ప్రాంతానికి భారతదేశంతో గణనీయమైన ఆర్థిక, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు కూడా ఉన్నాయి. ఫ్రాన్స్ లో జనాభా పరంగా రెండో అతి పెద్ద నగరమైన మాసే లో  భారత దౌత్య కార్యాలయ ప్రారంభం భారత-ఫ్రాన్స్‌ బహుముఖీన  సంబంధాలను మరింత బలపరచడంలో సహాయపడగలదని భావిస్తున్నారు.