ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి నెల 6న ఉత్తరాఖండ్లో పర్యటించనున్నారు. ముఖ్వాలో గంగా నదిని సందర్శించే స్థలం వద్ద ఆయన ఉదయం సుమారు తొమ్మిదిన్నర గంటలకు దర్శనం, పూజ కార్యక్రమాలలో పాల్గొంటారు. దాదాపు 10 గంటల 40 నిమిషాలకు మోటార్ సైకిళ్లపై చేసే సాహస యాత్రను ప్రధాని ప్రారంభిస్తారు. హర్సిల్లో నిర్వహించే ఒక కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ సంవత్సరం శీతకాల పర్యాటకం కార్యక్రమాలను ప్రారంభించింది. చలికాలంలో పర్యటించదగ్గ గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్లతోపాటు బద్రీనాథ్ను వేల మంది భక్తులు ఇప్పటికే సందర్శించారు. ధార్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు, హోంస్టేలకు, పర్యాటకంతో ముడిపడ్డ ఇతరత్రా వ్యాపారాలకు ఊతాన్నివ్వాలన్నదే ఈ కార్యక్రమం లక్ష్యం.