మార్చి 1, మధ్యాహ్నం 12.30గంటలకు ప్రారంభమయ్యే ‘వ్యవసాయం, గ్రామీణ సంక్షేమం’ అనే అంశంపై బడ్జెట్ అనంతరం నిర్వహించే వెబినార్లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.
ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించిన అంశాలను సమర్థంగా అమలు చేసే వ్యూహాలపై చర్చించడానికి వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఒకచోట చేర్చడమే ఈ వెబినార్ లక్ష్యం. వ్యవసాయాభివృద్ధి, గ్రామీణ సంక్షేమంపై ప్రధాన దృష్టి సారిస్తూ జరిగే ఈ కార్యక్రమం, బడ్జెట్ లక్ష్యాలను ఆచరణాత్మక ఫలితాలుగా మార్చేందుకు అవసరమైన సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ దిశగా చేపట్టే ప్రయత్నాలను సమన్వయం చేస్తూ, ప్రభావవంతంగా అమలు చేయడానికి ప్రైవేటు రంగంలోని నిపుణులు, పారిశ్రామిక ప్రతినిధులు, విషయ నిపుణులు ఈ వెబినార్లో పాల్గొంటారు.
***