Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మాత అంబ ఆరాధనకు ప్రసిద్ధిగన్న నవరాత్రి పవిత్రత్వాన్ని మననం చేసుకొన్న ప్రధానమంత్రి


మాతా జగదాంబ ఆరాధనకు ప్రసిద్ధిగన్న నవరాత్రుల పవిత్రత్వాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్మరించుకొన్నారు. దేవీ మాత విభిన్న రూపాలకు అంకితం చేసిన ఒక ప్రార్థనగీతాన్ని ఆయన పంచుకొంటూ, ప్రతి ఒక్కరూ ఈ గీతాన్ని  వినవలసిందిగా విజ్ఞ‌ప్తి చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

‘‘నవరాత్రులలో మాత అంబను ఉపాసించడం భక్తజనులందరినీ భక్తిభావంలో ముంచెత్తుతుంది. దేవీ మాత స్వరూపాలకు అంకితం చేసిన ఈ స్తుతి గీతం ఒక అలౌకిక అనుభూతిని ప్రసాదిస్తోంది. మీరూ వినండి..’’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు.

 

 

***

MJPS/SR