Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహారాష్ట్రలోని నాందేడ్‌లో ప్రమాదం.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం


మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఓ ప్రమాద ఘటనలో ప్రాణనష్టం జరిగినందుకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంబంధికులకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున, గాయపడ్డవారికి రూ.50,000 వంతున ఎక్స్‌గ్రేషియాను ఆయన ప్రకటించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా తెలిపింది:

‘‘మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఓ ప్రమాద ఘటనలో ప్రాణనష్టం జరగడం విచారకరం. తమ ప్రియతములను కోల్పోయినవారికి నేను సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఘటనలో ప్రభావితులైన వ్యక్తులకు స్థానిక పాలనయంత్రాంగం అవసరమైన సహాయాన్ని అందిస్తోంది.

పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను మృతుల సంబంధికులకు ఇస్తారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఇస్తారు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ @narendramodi”