Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భూటాన్ ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ


బిమ్స్‌టెక్ 6వ శిఖరాగ్ర సదస్సును థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా భూటాన్ ప్రధాని శ్రీ శెరింగ్ తోబ్‌గేతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఆ సందేశంలో ఇలా తెలిపారు:

‘‘నా మంచి మిత్రుడు, ప్రధాని తోబ్‌గేతో చాలా చక్కటి సంభాషణలో పాల్గొన్నాను. భారత్, భూటాన్‌‌ల మైత్రి ఎంతో బలమైంది. పరస్పరం అనేక రంగాల్లో విస్తృత స్థాయిలో సహకరించుకొంటున్నాం.
@tsheringtobgay’’

 

 

***

MJPS/SR