ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 వ సంవత్సరం లో భారతదేశం యొక్క కార్యసాధనల ను వివరించేటటువంటి ఒక వ్యాసాన్ని ఈ రోజు న శేర్ చేశారు. ఆ వ్యాసం లో భారతదేశం జి-20 కి అధ్యక్షత ను వహించి సాధించినటువంటి సాఫల్యాలు, చంద్ర గ్రహం పైకి జరిపిన సాహస యాత్ర, కోవిడ్-19 అనంతర కాలం లో తిరిగి పుంజుకోవడం తో పాటు గా పటిష్ట వృద్ధి ని సాధించడం గురించి వివరించడం జరిగింది. ఆ వ్యాసాన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయ్ శంకర్ వ్రాశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –
‘‘విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ @DrSJaishankar వ్రాసిన వ్యాసం 2023 లో భారతదేశం యొక్క కార్యసాధనల ను గురించి వివరిస్తున్నది; జి-20 కూటమి కి భారతదేశం అధ్యక్షత వహించిన సందర్భం లో ఒనగూరిన సాఫల్యాలు, చంద్ర గ్రహం పైకి జరిపిన సాహస యాత్ర, కోవిడ్-19 అనంతర కాలం లో తిరిగి పుంజుకోవడం తో పాటు గా పటిష్టమైన వృద్ధి ని సాధించడం వంటి అంశాల ను గురించి ఈ వ్యాసం తెలియజేస్తున్నది.
ఈ వ్యాసం భారత దేశం యొక్క దౌత్య ప్రయాసల ను గురించి, ప్రాంతీయ బంధాన్ని గురించి, ఆత్మవిశ్వాసం తో కూడిన మరియు దక్షత కలిగిన దేశాన్ని గురించి ప్రపంచ రంగస్థలం మీద చాటిచెబుతున్నది.’’ అని పేర్కొన్నారు.
EAM @DrSJaishankar's article outlines India's achievements in 2023, including its successful G20 presidency and lunar mission, emphasizing a post-COVID-19 recovery and robust growth.
— PMO India (@PMOIndia) November 17, 2023
The piece highlights India's diplomatic efforts, regional engagement, portraying a confident and… https://t.co/d3UBCLs8BZ