భారతీయ తీర రక్షక దళం (ఐసీజీ) వ్యవస్థాపక దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా మన విశాల కోస్తాతీరాన్ని కాపాడడంలో ఈ దళం కనబరుస్తున్న సాహసానికీ, అంకితభావానికీ, నిరంతర నిఘాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ దళాన్ని ప్రశంసించారు. నౌకావాణిజ్యానికి భద్రతను అందించడం మొదలు విపత్తు వేళల్లో రంగంలోకి దిగి అవసరమైన సహాయక చర్యలను చేపట్టడం, దొంగ రవాణాను కార్యకలాపాలను అరికట్టడం, పర్యావరణ పరిరక్షణ చర్యలను తీసుకోవడం వరకు.. సాగర జలాలకు రక్షణను అందిస్తూ, సాగర జలాల సరిహద్దులకు, మన ప్రజలకు అభయాన్నిస్తోందని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘ఈ రోజు, భారతీయ తీర రక్షక దళం (ఐసీజీ) వ్యవస్థాపక దినోత్సవ సందర్బంగా, మన విశాల కోస్తాతీరాన్ని కాపాడడంలో ఈ దళం కనబరుస్తున్న సాహసానికీ, అంకితభావానికీ, నిరంతరాయ నిఘాకు గాను మనం ప్రశంసలు అందిద్దాం. నౌకా వాణిజ్యానికి భద్రతను అందించడం మొదలు విపత్తుల వేళల్లో రంగంలోకి దిగి అవసరమైన సహాయక చర్యలను చేపట్టడం, దొంగ రవాణాను అరికట్టే కార్యకలాపాలను, పర్యావరణ పరిరక్షణ చర్యలను తీసుకోవడం వరకు.. మన సముద్రాలకు ఐసీజీ దుర్భేద్య సంరక్షణను అందిస్తూ, మన సాగర జలాల సరిహద్దులకు, మన ప్రజలకు అభయాన్నిస్తోంది’’.@IndiaCoastGuard”
Today, on their Raising Day, we laud the Indian Coast Guard for safeguarding our vast coastline with bravery, dedication and relentless vigilance. From maritime security to disaster response, from anti-smuggling operations to environmental protection, the Indian Coast Guard is a… pic.twitter.com/OIMcqhzV1Y
— Narendra Modi (@narendramodi) February 1, 2025