మహావీర్ జయంతి ఈ రోజు. కలకాలం ప్రేరణాత్మకంగా నిలిచే భగవాన్ మహావీర్ బోధనలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకొన్నారు. ఆయన ప్రబోధాలు తన జీవనాన్ని కూడా విస్తారంగా ప్రభావితం చేశాయని ప్రధాని అన్నారు.
మోదీ ఆర్కైవ్ ‘ఎక్స్’లో పొందుపరచిన ఒక సందేశం, భగవాన్ మహావీర్ ప్రబోధాలతోనూ, జైన సముదాయంతోనూ ప్రధానికి చాలాకాలంగా ఉన్న ఆధ్యాత్మిక బంధానికి అద్దంపట్టింది.
మోదీ ఆర్కైవ్ ‘ఎక్స్’లో పొందుపరచిన సందేశానికి ప్రధాని ప్రతిస్పందిస్తూ:
‘‘భగవాన్ మహావీర్ ఆదర్శాలు నాతో సహా అసంఖ్యాక ప్రజలకు ఎంతో ప్రేరణనందిస్తున్నాయి. ఆయన ఆలోచనలు శాంతియుత, కరుణాభరిత ధరణిని ఆవిష్కరించగలిగే మార్గాన్ని చూపుతున్నాయి’’ అని పేర్కొన్నారు.
The ideals of Bhagwan Mahavir have greatly inspired countless people, including me. His thoughts show the way to build a peaceful and compassionate planet. https://t.co/1yDhKpoyol
— Narendra Modi (@narendramodi) April 10, 2025