Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్-2023లో కాంస్య పతకం సాధించిన హెచ్.ఎస్.ప్రణయ్‌కి ప్రధానమంత్రి అభినందనలు


   ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌-2023లో కాంస్య పతకం సాధించిన భారత షట్లర్‌ హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ పోస్ట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఇది బిడబ్ల్యుఎఫ్‌ చాంపియన్‌ షిప్‌-2023లో ప్రణయ్‌ @PRANNOYHSPRI సాధించిన అత్యంత అద్భుత విజయం! ఆయన కాంస్య పతకం కైవసం చేసుకోవడంపై నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పోటీల్లో ఆయన నైపుణ్యం, కఠోర శ్రమ ఆద్యంతం ప్రస్ఫుటమయ్యాయి. దేశంలోని ఔత్సాహిక బ్యాడ్మింటన్‌ క్రీడాకారులందరికీ ఆయనో స్ఫూర్తి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***

DS