బెల్జియం ప్రధాని గా శ్రీ బార్ట్ డీ వేవర్ పదవీబాధ్యతలను స్వీకరించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు అభినందనలు తెలిపారు. భారత్-బెల్జియం సంబంధాల్ని మరింత బలపర్చుకోవడానికి, ప్రపంచ అంశాలపై సహకారాన్ని పెంపొందింపచేసుకోవడానికి ఇద్దరం కలిసి పనిచేస్తామన్న విశ్వాసం తనకు ఉందని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు :
‘‘ప్రధాని శ్రీ బార్ట్ డీ వేవర్ (@Bart_DeWever) .. మీరు పదవీబాధ్యతల్ని స్వీకరించిన సందర్బంగా మీకు నా హృదయపూర్వక అభినందనలు. భారత్-బెల్జియం సంబంధాల్ని మరింత పటిష్టపర్చుకోవడంతోపాటు ప్రపంచ అంశాల్లో మన సహకారాన్ని పెంపొందింపచేసుకోవడానికి మనం కలిసి పనిచేయాలని నేను ఆశిస్తున్నాను. మీ భావి పదవీకాలం ఫలప్రదం కావాలని కోరుకుంటూ, మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.’’
Heartiest congratulations to Prime Minister @Bart_DeWever on assuming office. I look forward to working together to further strengthen India-Belgium ties and enhance our collaboration on global matters. Wishing you a successful tenure ahead.
— Narendra Modi (@narendramodi) February 4, 2025