‘ప్రధాన్మంత్రీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్’ (పీఎమ్–ఏబీహెచ్ఐఎమ్)ను అమలుచేస్తున్నందుకూ, ‘ప్రధాన్మంత్రీ జన్ ఆరోగ్య యోజన’ (పీఎమ్–జేఏవై)లో భాగంగా ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీని మొదలు పెట్టినందుకూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి ఎక్స్లో పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘ఢిల్లీ ఆరోగ్య రంగంతో ముడిపడ్డ ఒక విప్లవాత్మక నిర్ణయం! డబల్ ఇంజన్ ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ మిషన్ ఇక్కడి నా లక్షలాది సోదర, సోదరీమణులకు ఎంతో ప్రయోజనకరం కానుంది. ఢిల్లీ వాసులు సైతం ఇక ఆయుష్మాన్ యోజనలో భాగంగా చికిత్సలు చేయించుకోగలుగుతారు.’’
दिल्ली के हेल्थ सेक्टर से जुड़ा एक क्रांतिकारी कदम! डबल इंजन सरकार का यह मिशन यहां के मेरे लाखों भाई-बहनों के लिए बेहद फायदेमंद होने वाला है। मुझे बहुत खुशी है कि दिल्लीवासी भी अब आयुष्मान योजना के तहत अपना इलाज करा पाएंगे। https://t.co/8QjzdBqcNe
— Narendra Modi (@narendramodi) April 11, 2025