Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో యూకే పూర్వ ప్రధాని శ్రీ రిషి సునాక్, ఆయన కుటుంబం భేటీ


బ్రిటన్ పూర్వ ప్రధాని శ్రీ రిషి సునాక్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో న్యూ ఢిల్లీలో ఈ రోజు భేటీ అయ్యారు.

ప్రముఖులిద్దరూ అనేక అంశాలపై అరమరికలు లేకుండా మాట్లాడుకున్నారు.

శ్రీ సునాక్ భారత్‌కు ఒక గొప్ప మిత్రుడని, భారత్-యునైటెడ్ కింగ్‌డమ్ సంబంధాలను  దృఢతరం చేసుకోవాలనే విషయంలో ఆయన ఉత్సాహాన్ని కనబరిచారని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:

‘‘యూకే పూర్వ ప్రధాని శ్రీ రిషి సునాక్‌ను, ఆయన కుటుంబసభ్యులను కలుసుకోవడం  సంతోషం కలిగించింది. మేం అనేక అంశాలపై చాలా చక్కగా మాట్లాడుకున్నాం.

శ్రీ సునాక్ భారతదేశానికి ఒక గొప్ప స్నేహితుడు. ఇండియా-యూకే సంబంధాలను మరింత బలపరచుకోవాలనే విషయంలో ఆయన ఎంతో ఉత్సాహాన్ని కనబరిచారు.

@RishiSunak @SmtSudhaMurty”