బ్రిటన్ పూర్వ ప్రధాని శ్రీ రిషి సునాక్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో న్యూ ఢిల్లీలో ఈ రోజు భేటీ అయ్యారు.
ప్రముఖులిద్దరూ అనేక అంశాలపై అరమరికలు లేకుండా మాట్లాడుకున్నారు.
శ్రీ సునాక్ భారత్కు ఒక గొప్ప మిత్రుడని, భారత్-యునైటెడ్ కింగ్డమ్ సంబంధాలను దృఢతరం చేసుకోవాలనే విషయంలో ఆయన ఉత్సాహాన్ని కనబరిచారని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:
‘‘యూకే పూర్వ ప్రధాని శ్రీ రిషి సునాక్ను, ఆయన కుటుంబసభ్యులను కలుసుకోవడం సంతోషం కలిగించింది. మేం అనేక అంశాలపై చాలా చక్కగా మాట్లాడుకున్నాం.
శ్రీ సునాక్ భారతదేశానికి ఒక గొప్ప స్నేహితుడు. ఇండియా-యూకే సంబంధాలను మరింత బలపరచుకోవాలనే విషయంలో ఆయన ఎంతో ఉత్సాహాన్ని కనబరిచారు.
@RishiSunak @SmtSudhaMurty”
It was a delight to meet former UK PM, Mr. Rishi Sunak and his family! We had a wonderful conversation on many subjects.
— Narendra Modi (@narendramodi) February 18, 2025
Mr. Sunak is a great friend of India and is passionate about even stronger India-UK ties.@RishiSunak @SmtSudhaMurty pic.twitter.com/dwTrXeHOAp