ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్-కటక్ బెంచ్ కార్యాలయ-నివాస సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- ఈ బెంచ్ ఇకపై ఒడిషాకు మాత్రమేగాక తూర్పు-ఈశాన్య భారతంలోని లక్షలాది పన్ను చెల్లింపుదారుల కోసం అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు. దీంతోపాటు ఈ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో అపరిష్కృత కేసులన్నిటికి సత్వర పరిష్కారం చూపడంలో తోడ్పడుతుందని తెలిపారు.
దేశం నేడు పన్ను-ఉగ్రవాదం నుంచి పన్ను-పారదర్శకత దిశగా పయనిస్తున్నదని ప్రధానమంత్రి నేడు గుర్తుచేశారు. సంస్కరణ-పనితీరు-పరివర్తన విధానం అనుసరణ ద్వారానే ఈ మార్పు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం తోడ్పాటుతో వివిధ నిబంధనలు, ప్రక్రియలను సంస్కరిస్తున్నట్లు ఆయన చెప్పారు. “మేం సుస్పష్ట సంకల్పంతో పనిచేస్తున్నాం… అదే సమయంలో పన్ను యంత్రాంగం ధోరణిని కూడా పరివర్తన దిశగా నడిపిస్తున్నాం” అని ఆయన అన్నారు.
దేశ సంపద సృష్టికర్తలకు ఇబ్బందులు తగ్గితే వారికి రక్షణ లభిస్తుందని, తద్వారా దేశంలోని వ్యవస్థలపై వారిలో విశ్వాసం పెరుగుతుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ పెరుగుతున్న విశ్వాసంవల్ల దేశాభివృద్ధి దిశగా పన్ను వ్యవస్థలో కలిసేందుకు మరింతమంది భాగస్వాములు ముందుకొస్తున్నారని పేర్కొన్నారు. నిజాయితీగల పన్ను చెల్లింపుదారులను కష్టాలనుంచి రక్షించడం, వారిని గౌరవించడంకోసమే పన్ను తగ్గింపు, ప్రక్రియల్లో సరళతసహా అతిపెద్ద సంస్కరణలు తెచ్చినట్లు ప్రధాని వివరించారు.
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేశాక మొట్టమొదట దాన్ని సంపూర్ణంగా విశ్వసించడమే ప్రభుత్వ ఆలోచనా విధానమని ప్రధాని ప్రకటించారు. ఆ మేరకు నేడు దేశవ్యాప్తంగా దాఖలైన రిటర్నులలో 99.75 శాతం ఎలాంటి అభ్యంతరాలూ లేకుండా ఆమోదించబడినట్లు చెప్పారు. దేశ పన్ను వ్యవస్థలో ఇదో పెనుమార్పుగా ఆయన పేర్కొన్నారు. సుదీర్ఘ బానిసత్వ పాలన ఫలితంగా పన్ను చెల్లింపుదారు-వసూలు యంత్రాంగాల మధ్య దోపిడీ-దోపిడీదారుల వంటి సంబంధం ఏర్పడిందని శ్రీ మోదీ అన్నారు. ఈ సందర్భంగా గోస్వామి తులసీదాస్ను ఉటంకిస్తూ- “మేఘాలు వర్షిస్తున్నపుడు ప్రయోజనం మనకు గోచరమవుతుంది. అయితే, మేఘాలు ఏర్పడినపుడు సూర్యుడు కొంత నీటిని గ్రహిస్తాడు. కానీ, దానివల్ల ఎవరికీ అసౌకర్యం కలగదు” అన్నారు. ఇదే తరహాలో సామాన్యుల నుంచి పన్ను వసూలు వేళ పాలన అసౌకర్యానికి గురికారాదని ప్రధానమంత్రి అన్నారు. అదే సమయంలో ఆ సొమ్ము పౌరులకు చేరినప్పుడు, ప్రజలు తమ జీవితాల్లో దాని ప్రయోజన అనుభూతిని పొందాలన్నారు.
ప్రభుత్వం కొన్నేళ్లుగా ఇదే దార్శనికతతో ముందుకు వెళ్తున్నదని, మొత్తం పన్ను వ్యవస్థలో ఆ పెనుమార్పులతోపాటు పారదర్శకతను నేడు పన్ను చెల్లింపుదారులు స్పష్టంగా చూడగలుగుతున్నారని ఆయన అన్నారు. పన్ను వాపసు కోసం చెల్లింపుదారులు నెలల తరబడి వేచిఉండాల్సిన అవసరం లేనప్పుడు, కేవలం కొన్ని వారాల్లోనే తిరిగి పొందినపుడు సదరు పారదర్శకతను వారు అనుభూతి చెందుతారని తెలిపారు. “అదేవిధంగా అతి పురాతన వివాదాన్ని పన్ను విభాగం తనంతట తానుగా పరిష్కరించడం చూసినప్పుడు పారదర్శకత వారి అనుభవంలోకి వస్తుంది. అలాగే నేరుగా హాజరుతో పనిలేకుండా అప్పీలు చేయగలిగితే పన్ను పారదర్శకతను ఆస్వాదిస్తాడు. ఆదాయపు పన్ను నిరంతరం తగ్గుతుండటం గమనించినప్పుడు మరింత పన్ను పారదర్శకతను అతను అనుభవిస్తాడు” అని ప్రధాని విశదీకరించారు.
దేశంలో రూ.5 లక్షలవరకూ ఆదాయంపై పన్ను విధించకపోవడం మన దిగువ మధ్యతరగతి యువతకు నేడు ఎంతో లబ్ధి చేకూర్చిన అంశమని ప్రధాని అన్నారు. ఈ అలాగే ఆదాయపు పన్నుకు సంబంధించి ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించిన కొత్త ఎంపిక పన్ను చెల్లింపుదారుల జీవితాలను సరళం చేసిందన్నారు. ప్రగతి వేగాన్ని మరింత పెంచడంతోపాటు భారత్ను పెట్టుబడులకు మరింత స్నేహపూర్వకంగా మార్చడానికి కార్పొరేట్ పన్నులో కోత విధిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు గుర్తుచేశారు. తయారీ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించే దిశగా కొత్త దేశీయ తయారీ సంస్థలకు పన్నును 15శాతంగా నిర్ణయించామని ఆయన చెప్పారు. అదేవిధంగా భారత ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులను పెంచడానికి డివిడెండ్ పంపిణీ పన్నును కూడా రద్దుచేసినట్లు తెలిపారు. జీఎస్టీని ప్రవేశపెట్టడంతో పన్ను పరిధి తగ్గిందని, చాలా వస్తువులు, సేవలపై పన్ను శాతం కూడా తగ్గిందని చెప్పారు. వివాదాల భారం తగ్గింపు దిశగా ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్(ITAT)లో అప్పీళ్ల పరిమితి మొత్తాన్ని రూ.3 లక్షల నుంచి రూ.50 లక్షలకు, సుప్రీంకోర్టులో రూ.2కోట్ల స్థాయికి పెంచినట్లు వివరించారు. ఈ సంస్కరణలవల్ల దేశంలో వాణిజ్య సౌలభ్యం పెరిగిందని ఆయన అన్నారు.
వివాదాలపై అప్పీళ్లను డిజిటల్ మాధ్యమంద్వారా విచారించడం కోసం ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ దేశంలోని ధర్మాసనాల(బెంచ్)ను ఉన్నతీకరిస్తుండటంపై ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు. అలాగే ప్రస్తుత సాంకేతిక యుగంలో మొత్తం వ్యవస్థను ఉన్నతీకరించడం చాలా ముఖ్యమన్నారు. ప్రత్యేకించి మన న్యాయవ్యవస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత ఎక్కువగా వాడుతూ దేశ పౌరులకు కొత్త సౌలభ్యం కల్పించడం మొదలుపెట్టిందని ఆయన నొక్కి చెప్పారు.
***
गुलामी के लंबे कालखंड ने Tax Payer और Tax Collector, दोनों के रिश्तों को शोषित और शोषक के रूप में ही विकसित किया।
— PMO India (@PMOIndia) November 11, 2020
दुर्भाग्य से आज़ादी के बाद हमारी जो टैक्स व्यवस्था रही उसमें इस छवि को बदलने के लिए जो प्रयास होने चाहिए थे, वो उतने नहीं किए गए: PM#TransparencyInTaxation
जब बादल बरसते हैं, तो उसका लाभ हम सभी को दिखाई देता है। लेकिन जब बादल बनते हैं, सूर्य पानी को सोखता है, तो उससे किसी को तकलीफ नहीं होती।
— PMO India (@PMOIndia) November 11, 2020
इसी तरह शासन को भी होना चाहिए: PM
जब आम जन से वो टैक्स ले तो किसी को तकलीफ न हो, लेकिन जब देश का वही पैसा नागरिकों तक पहुंचे, तो लोगों को उसका इस्तेमाल अपने जीवन में महसूस होना चाहिए: PM
— PMO India (@PMOIndia) November 11, 2020
आज का टैक्सपेयर पूरी टैक्स व्यवस्था में बहुत बड़े बदलाव और पारदर्शिता का साक्षी बन रहा है।
— PMO India (@PMOIndia) November 11, 2020
जब उसे Refund के लिए महीनों इंतजार नहीं करना पड़ता, कुछ ही सप्ताह में उसे Refund मिल जाता है, तो उसे पारदर्शिता का अनुभव होता है: PM
जब वो देखता है कि विभाग ने खुद पुराने विवाद को सुलझा दिया है, तो उसे पारदर्शिता का अनुभव होता है।
— PMO India (@PMOIndia) November 11, 2020
जब उसे faceless appeal की सुविधा मिलती है, तब वो tax transparency को और ज्यादा महसूस करता है।
जब वो देखता है कि income tax कम हो रहा है, तब उसे tax transparency अनुभव होती है: PM
पहले की सरकारों के समय शिकायतें होती थीं Tax Terrorism की।
— PMO India (@PMOIndia) November 11, 2020
आज देश उसे पीछे छोड़कर Tax Transparency की तरफ बढ़ रहा है।
Tax Terrorism से Tax transparency का ये बदलाव इसलिए आया है क्योंकि हम Reform, Perform और Transform की अप्रोच के साथ आगे बढ़ रहे हैं: PM
हम Reform कर रहे हैं rules में, procedures में और इसमें technology की भरपूर मदद ले रहे हैं।
— PMO India (@PMOIndia) November 11, 2020
हम Perform कर रहे हैं साफ नीयत के साथ, स्पष्ट इरादों के साथ।
और
साथ ही साथ हम Tax Administration के mindset को भी Transform कर रहे हैं: PM
आज भारत दुनिया के उन चुनिंदा देशों में है जहां टैक्सपेयर के अधिकारों और कर्तव्यों दोनों को codify किया गया है, उनको कानूनी मान्यता दी गई है।
— PMO India (@PMOIndia) November 11, 2020
टैक्सपेयर और टैक्स कलेक्ट करने वाले के बीच विश्वास बहाली के लिए, पारदर्शिता के लिए, ये बहुत बड़ा कदम रहा है: PM
देश के Wealth Creator की जब मुश्किलें कम होती हैं, उसे सुरक्षा मिलती है, तो उसका विश्वास देश की व्यवस्थाओं पर और ज्यादा बढ़ता है।
— PMO India (@PMOIndia) November 11, 2020
इसी बढ़ते विश्वास का परिणाम है कि अब ज्यादा से ज्यादा साथी देश के विकास के लिए टैक्स व्यवस्था से जुड़ने के लिए आगे आ रहे हैं: PM
अब सरकार की सोच ये है कि जो इनकम टैक्स रिटर्न फाइल हो रहा है, उस पर पहले पूरी तरह विश्वास करो।
— PMO India (@PMOIndia) November 11, 2020
इसी का नतीजा है कि आज देश में जो रिटर्न फाइल होते हैं, उनमें से 99.75 प्रतिशत बिना किसी आपत्ति के स्वीकार कर लिए जाते हैं।
ये बहुत बड़ा बदलाव है जो देश के टैक्स सिस्टम में आया है: PM