న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనలో ప్రాణనష్టం జరిగినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ అందులో –
‘‘న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరగడం బాధాకరం. ఈ విషాద ఘటనలో తమ ప్రియతముల్ని కోల్పోయిన వారికి నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. తొక్కిసలాటకు గురి అయిన వారందరికీ అవసరమైన సహాయ సహకారాలను అధికార యంత్రాంగం అందిస్తోంది’’ అని పేర్కొన్నారు.
Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.
— Narendra Modi (@narendramodi) February 15, 2025