Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నవ్‌రోజ్ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు


ఈ రోజే ‘నవ్‌రోజ్’. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేకమైన రోజు అందరికీ అమిత సంతోషాన్ని, సమృద్ధిని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని శ్రీ మోదీ అభిలషించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ..

‘‘నవ్‌రోజ్ సందర్భంగా ఇవే శుభాకాంక్షలు.

ఈ ప్రత్యేకమైన రోజు అందరికీ అమిత సంతోషం, సమృద్ధిలతోపాటు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. రాబోయే సంవత్సరంలో విజయం, ప్రగతి సిద్ధించుగాక.. సద్భావన బంధం బలపడుగాక.

రానున్న ఏడాది ఉల్లాస భరితమైందిగా ఉండాలని, మన ఆశలను నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

MJPS/ST