Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దీపావళి కిముందు రోజు అక్టోబరు 23న అయోధ్య నుసందర్శించనున్న ప్రధాన మంత్రి


దీపావళి పూర్వ సంధ్య సందర్భం లో అక్టోబర్ 23వ తేదీ నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య ను సందర్శించనున్నారు. సాయంత్రం పూట దాదాపు 5 గంటల వేళ లో భగవాన్ శ్రీ రామ్ లాలా విరాజ్ మాన్ దర్శనం, మరియు పూజా కార్యక్రమాల లో ప్రధాన మంత్రి పాలుపంచుకొంటారు. ఆ తరువాత శ్రీ రామ్ జన్మ్ భూమి తీర్థ్ క్షేత్రం స్థలాన్ని పరిశీలిస్తారు. సుమారు 5 గంటల 45 నిమిషాల కు శ్రీరాముని కి ప్రతీకాత్మక రాజ్యాభిషేకాన్ని ఆయన నిర్వహిస్తారు. సాయంత్రం 6గంటల 30 నిమిషాల సమయం లో సరయు నది న్యూ ఘాట్ వద్ద జరిగే హారతి కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి వీక్షిస్తారు.

 

అటు తరువాత ప్రధాన మంత్రి, వైభవోపేతమైనటువంటి ‘దీపోత్సవ్’ ఆరంభం అయినట్లు గా ప్రకటన చేస్తారు. ఈ సంవత్సరం దీపోత్సవ్ తాలూకు ఆరో సంచిక ను నిర్వహించడం జరుగుతున్నది. మరి తొలి సారి గా ప్రధాన మంత్రి ఈ సంబరాల లో స్వయం గా పాలుపంచుకోనున్నారు. ఈ సందర్భం లో 15 లక్షల కు పైగా ప్రమిదల ను వెలిగించనున్నారు. దీపోత్సవ్ లో భాగం గా వివిధ రాష్ట్రాల నుండి వేరు వేరు నృత్య రీతుల ను ప్రదర్శించేటటువంటి పదకొండు రామ్ లీల శకటాల తో పాటు గా మరో అయిదు చైతన్యవంతమైన శకటాల ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సరయు నది తీరం లో గల రామ్ కీ పైడి ప్రాంతం లో ఒక గొప్ప సంగీత సహిత లేజర్ షో తో పాటు ఒక 3-డి హోలోగ్రాఫిక్ ప్రజెక్శన్ మేపింగ్ శో ను కూడా ప్రధాన మంత్రి చూస్తారు.

 

***