Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘డిజిటల్ అభివృద్ధి పురస్కారం 2025’ను గెలిచినందుకు భారతీయ రిజర్వు బ్యాంకుకు ప్రధానమంత్రి ప్రశంసలు


‘డిజిటల్ అభివృద్ధి పురస్కారం 2025’ను భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) గెలిచినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆర్‌బీఐని ప్రశంసించారు. బ్రిటన్ లోని లండన్‌లో సెంట్రల్ బ్యాంకింగ్ ఈ పురస్కారంతో ఆర్‌బీఐని సత్కరించింది. ఆర్‌బీఐ సంస్థాగత డెవలపర్ టీం రూపొందించగా, అమలులోకి తెచ్చిన వినూత్న డిజిటల్ కార్యక్రమాలు ‘ప్రవాహ్’, ‘సారథి’లకు సెంట్రల్ బ్యాంకింగ్ గుర్తింపు లభించింది.

ఈ విజయాన్ని ప్రధాని ప్రశంసిస్తూ, సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశంలో

‘‘ప్రశంసించదగిన విజయం ఇది.. పాలనలో నవకల్పనకు, సామర్థ్యానికి  అద్దంపడుతోంది.

డిజిటల్ నవకల్పనలు భారత్‌లో ఆర్థిక విస్తారిత అనుబంధ వ్యవస్థ (ఫైనాన్షియల్ ఇకోసిస్టమ్)ను బలపరుస్తూ, ఈ క్రమంలో ఎంతో మందికి సాధికారతను కల్పిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.

 

 

***

MJPS/ST