Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్టర్ శంకర్ రావు తత్వవాది మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం


డాక్టర్ శంకర్ రావు తత్వవాది మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారుజాతి నిర్మాణంలోనూభారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవనంలోనూ చేసిన విశేష కృషి ద్వారా డాక్టర్ శంకర్ రావు తత్వవాది ఎప్పటికీ గుర్తుండిపోతారని శ్రీ మోదీ నివాళలర్పించారు. “భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆయనతో అనేక సందర్భాల్లో సంభాషించే అవకాశం పొందడం నా అదృష్టంగా భావిస్తున్నానుఆయన సైద్ధాంతిక స్పష్టతనిశిత దృష్టితో  కూడిన పనితీరు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండేవి” అని శ్రీ మోదీ అన్నారు.

డాక్టర్ శంకర్ రావు తత్వవాది ఇక లేరన్న వార్త నాకు బాధ కలిగించిందిదేశ నిర్మాణంభారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఆయన చేసిన విస్తృతమైన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయిఆయన తన జీవితాన్ని ఆర్ఎస్ఎస్‌కు అంకితం చేసిప్రపంచవ్యాప్తంగా దాని విస్తరణలో కీలక పాత్ర పోషించారుఆయన ఒక విశిష్ట పండితుడు కూడాఎల్లప్పుడూ యువతలో పరిశోధనాత్మక దృక్పథాన్ని ప్రోత్సహించేవారుబెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్‌యుతో ఆయనకు గల అనుబంధాన్ని విద్యార్థులుమేధావులు  ప్రేమగా గుర్తుచేసుకుంటారుఇతర అభిరుచులతో పాటు ఆయనకు సైన్స్సంస్కృతంఆధ్యాత్మికతపై అపారమైన ఆసక్తి ఉండేదిభారత్ లోనూవిదేశాల్లోనూ ఆయనతో పలు సందర్భాల్లో సంభాషించడం నా అదృష్టంగా భావిస్తున్నానుఆయన సైద్ధాంతిక స్పష్టతసునిశితమైన వ్యవహార శైలి ఎల్లప్పుడూ ప్రత్యేకంగా నిలిచాయిఓం శాంతి” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పోస్ట్ చేశారు

***