వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ నూతన ప్రాంగణం – ‘‘వాణిజ్య భవన్’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో జూన్ 23వ తేదీ నాడు ఉదయం 10:30 గంటల కు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం లో భాగం గా ఒక కొత్త పోర్టల్ ‘‘నిర్యాత్’’ (నేశనల్ ఇంపోర్ట్-ఎక్స్ పోర్ట్ రెకార్డ్ ఫార్ ఇయర్లీ ఎనాలిసిస్ ఆఫ్ ట్రేడ్ కు సక్షిప్త రూపం ఇది)ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. భారతదేశం యొక్క విదేశీ వ్యాపారానికి సంబంధించిన అవసరమైన సమాచారాన్ని అంతటినీ సంబంధిత వర్గాల కు అందించడం కోసం ఒక వన్ స్టాప్ ప్లాట్ ఫార్మ్ గా ఈ పోర్టల్ ను అభివృద్ధి పరచడం జరిగింది. ఈ సందర్భం లో సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.
ఇండియా గేట్ కు సమీపం లో నిర్మించినటువంటి ఈ వాణిజ్య భవనాన్ని శక్తి ని ఆదా చేయడం కోసం ప్రత్యేకమైన శ్రద్ధ ను తీసుకొని మరియు మన్నికయినటువంటి వాస్తుకళ సిద్ధాంతాల ను అనుసరిస్తూ ఒక స్మార్ట్ బిల్డింగ్ గా తీర్చిదిద్దడం జరిగింది. ఏకీకృతమైనటువంటి మరియు ఆధునికమైనటువంటి కార్యాలయ భవన సముదాయం గా ఇది సేవల ను అందించనుంది. మంత్రిత్వ శాఖ పరిధి లోని రెండు విభాగాలు.. వాణిజ్య విభాగం మరియు డిపార్ట్ మెంట్ ఫార్ ప్రమోశన్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) లు ఈ కార్యాలయ భవన సముదాయం యొక్క సేవల ను ఉపయోగించుకోనున్నాయి.
***
At 10:30 AM tomorrow, 23rd June, will inaugurate Vanijya Bhawan, the new premises of the Departments of Commerce and Industry. Will also launch a new portal NIRYAT, which would be a one stop place for all info needed on India’s foreign trade. https://t.co/0ZzHaGb5yf
— Narendra Modi (@narendramodi) June 22, 2022