Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జమ్ము- కశ్మీర్ లోని డోడా లో బస్సు దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి


జమ్ము కశ్మీర్ లోని డోడా లో జరిగిన ఒక బస్సు దుర్ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలియజేశారు. ఈ బస్సు ప్రమాదం లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతున మరియు ఈ బస్సు ప్రమాదం లో గాయపడిన వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి ప్రకటించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో

‘‘జమ్ము కశ్మీర్ లోని డోడా లో జరిగిన బస్సు దుర్ఘటన దు:ఖదాయకం గా ఉంది. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే నా సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు సాధ్యమైనంత త్వరలో పున:స్వస్థులు కావాలని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.

ఈ బస్సు ప్రమాదం లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతున మరియు ఈ బస్సు ప్రమాదం లో గాయపడిన వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది’’ అని తెలిపింది.

***

DS/TS