Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జ‌న‌వ‌రి 27న కరియ‌ప్పా గ్రౌండ్‌లో ఎన్‌సీసీ పీఎం ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్ర‌ధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 27 జనవరి, 2024న సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో వార్షిక  ఎన్‌సీసీ పీఎం ర్యాలీలో ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమంలో అమృత్ పీడీ సహకారం, సాధికారతను ప్రదర్శించే ‘అమృత్ కాల్ కి  ఎన్‌సీసీ ’ అనే అంశంపై సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. వసుధైవ కుటుంబం నిజమైన భారతీయ స్ఫూర్తితో, 24 విదేశీ దేశాల నుండి 2,200 మందికి పైగా  ఎన్‌సీసీ  క్యాడెట్లు, యువ క్యాడెట్లు ఈ సంవత్సరం ర్యాలీలో భాగం కానున్నారు.

ప్రత్యేక అతిథులుగా, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 400 మందికి పైగా వైబ్రంట్ గ్రామాల సర్పంచ్‌లు, 100 మందికి పైగా వివిధ స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు కూడా  ఎన్‌సీసీ పీఎం ర్యాలీకి హాజరవుతారు.