Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గోవాలోని పంజిమ్-వాస్కో మధ్య జాతీయ జలమార్గం 68 ని నిర్మించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి.


గోవాలోని పంజిమ్-వాస్కో మధ్య  జాతీయ జలమార్గం 68 ని నిర్మించడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

దీనివల్ల పంజిమ్ నుంచి వాస్కో మధ్య 9 కిలో మీటర్ల దూరం  తగ్గుతుందని,   కేవలం 20 నిమిషాల సమయం లో ప్రయాణించవచ్చని తెలిపారు. గతంలో పంజిమ్ వాస్కో మధ్య దూరం సుమారు 32 కిలోమీటర్లు ఉండేదని ప్రయాణ సమయం సుమారు 45 నిమిసాలు పట్టేదని తెలిపారు.

కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్, టూరిజం శాఖ సహాయమంత్రి శ్రీ శ్రీపాద యశో నాయక్ పంపిన ఒక ట్వీట్ కు స్పందిస్తూ ప్రధానమంత్రి తమ హర్షం వ్యక్తం చేశారు.

ఈ అనుసంధానత వల్ల పాంజిమ్, గోవాలోని వాస్కో  ప్రజలకు  ఎంతో ఉపశమనం  లభించిందని పర్యాటక రంగం  కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు

*****

DS/ST