Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క్షయవ్యాధిపై పోరాటాన్ని పటిష్టపరచడానికి క్షేత్ర స్థాయిలో చేస్తున్న ప్రయత్నాలకు ప్రధానమంత్రి ప్రశంసలు


క్షయవ్యాధిని నిర్మూలించాలన్న భారతదేశ లక్ష్యానికి తోడ్పాటును అందిస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వకంగా అభినందించారు. క్షేత్ర స్థాయిలో చేస్తున్న ప్రయత్నాలు వేగంపుంజుకుంటున్నాయనీ, ఈ కృషి ఆరోగ్యప్రదమైన, క్షయవ్యాధికి తావులేని భారత్‌కు బాట పరుస్తోందనీ ఆయన స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రి శ్రీ జె.పి. నడ్డా ‘ఎక్స్’లో పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధాని ప్రతిస్పందిస్తూ..

‘‘క్షయవ్యాధిపై పోరాటాన్ని బలపరచడంతోపాటు టీబీ రహిత భారత్ (#TBMuktBharat) కోసం తోడ్పాటును అందిస్తున్న వారందరినీ నేను అభినందిస్తున్నాను. ఈ ప్రయత్నం క్షేత్ర స్థాయిలో జోరందుకుంటూ, ఆరోగ్యభరితమైన భారత్‌ ఆవిష్కారానికి ఎలా పూచీపడుతోందనేది గమనించదగ్గ విషయం’’ అని రాశారు.