Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కోయంబ‌త్తూరు లో వివిధ అభివృద్ధి ప‌థ‌కాల ను ప్రారంభించి, మ‌రికొన్ని ప‌థకాల‌ కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన మంత్రి

కోయంబ‌త్తూరు లో వివిధ అభివృద్ధి ప‌థ‌కాల ను ప్రారంభించి, మ‌రికొన్ని ప‌థకాల‌ కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 1000 మెగా వాట్ల సామ‌ర్ధ్యం క‌లిగిన నైవేలీ  నూత‌న  థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్రాజెక్టు ను ఎన్ఎల్‌సిఐఎల్ కు చెందిన 709 ఎండ‌బ్ల్యు సామ‌ర్ధ్యం క‌లిగిన సౌర విద్యుత్తు ప‌థ‌కాన్ని దేశానికి అంకితం చేశారు.  లోయ‌ర్ భ‌వానీ ప్రాజెక్టు సిస్ట‌మ్ విస్త‌ర‌ణ‌, పున‌ర్ న‌వీక‌ర‌ణ‌, ఆధునీక‌ర‌ణ ప‌నుల‌కు, అలాగే వి.ఒ. చిదంబరనార్ పోర్టు లో 5 ఎండబ్ల్యు సామ‌ర్ధ్యం క‌లిగిన గ్రిడ్ సంధానిత సౌర విద్యుత్తు ప్లాంటు  రూప‌క‌ల్ప‌న‌, స్థాప‌న‌, ప్రారంభం తాలూకు ప‌నుల‌ కు కూడా ఆయ‌న శంకుస్థాప‌న చేశారు.  

ఈ కార్య‌క్ర‌మం లో తమిళ నాడు గ‌వ‌ర్న‌రు, త‌మిళ నాడు ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి ల‌తో పాటు, కేంద్ర మంత్రి శ్రీ ప్ర‌హ్లాద్ జోషీ కూడా పాల్గొన్నారు.  

ఈ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగిస్తూ, కోయంబ‌త్తూరు ప‌రిశ్ర‌మ‌ల, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల నగ‌రం అని అభివ‌ర్ణించారు.  ఈ రోజున ప్రారంభించిన అభివృద్ధి ప‌నులు కోయంబ‌త్తూరు కు, యావ‌త్తు త‌మిళ నాడుకు  ల‌బ్ధిని చేకూరుస్తాయ‌ని ఆయ‌న అన్నారు.  

భ‌వానీ సాగ‌ర్ ఆన‌క‌ట్ట ఆధునీక‌ర‌ణ ద్వారా అనేక జిల్లాల లో 2 ల‌క్ష‌ల ఎక‌రాల‌ కు పైగా భూములు సాగునీటిని అందుకొంటాయ‌ని, త‌ద్వారా రైతులు లాభప‌డ‌తార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. భార‌త‌దేశ పారిశ్రామిక వృద్ధి ప్ర‌ధాన‌మైన‌టువంటి తోడ్పాటును అందిస్తున్నందుకుగాను త‌మిళ నాడు ను ఆయ‌న ప్ర‌శంసించారు.  పారిశ్రామిక వృద్ధి తాలూకు మౌలిక అవ‌స‌రాల లో విద్యుత్తు స‌ర‌ఫ‌రా అనేది ఒక‌టి అయినందువ‌ల్ల అనేక పెద్ద విద్యుత్తు ప్రాజెక్టుల ను ప్రారంభించ‌డం ప‌ట్ల ఆయ‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.  709 ఎండ‌బ్ల్యు సామ‌ర్ధ్యం క‌లిగిన సౌర విద్యుత్తు ప‌థ‌కం పూర్తిగా దేశీయంగా రూపొందింద‌ని, ఈ ప్రాజెక్టు వ్య‌యం 3,000 కోట్ల రూపాయ‌ల కు పైగానే ఉంద‌ని ఆయ‌న అన్నారు.  7,800 కోట్ల రూపాయ‌ల వ్య‌యం తో నిర్మించిన మ‌రొక 1000 ఎండ‌బ్ల్యు థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్రాజెక్టు ద్వారా త‌మిళ నాడు కు ఎంతో ఉప‌యోగం ఉంటుంద‌ని కూడా ఆయ‌న తెలిపారు.  ఉత్ప‌త్తి అయ్యే విద్యుత్తు లో 65 శాతానికి పైగా విద్యుత్తు ను త‌మిళ‌ నాడు కు ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

వి.ఒ. చిదంబర‌నార్ పోర్టు , తూత్తుకూడి ల‌కు సంబంధించిన వివిధ ప్రాజెక్టుల‌ ను ప్ర‌ధాన మంత్రి ప్రారంభించిన క్ర‌మం లో మాట్లాడుతూ, త‌మిళ నాడు కు స‌ముద్ర సంబంధిత వ్యాపారం లో, నౌకాశ్ర‌యాలు ప్ర‌ధాన పాత్ర‌ ను పోషిస్తున్న అభివృద్ధి ప్ర‌క్రియ‌ లో ఒక గొప్ప చ‌రిత్ర అంటూ ఉంది అని ఆయ‌న‌ పేర్కొన్నారు.  ఈ రోజున ప్రారంభించిన ప‌థ‌కాలు ఈ నౌకాశ్ర‌యం లో ఓడ నుంచి స‌రుకుల ను దింపే, ఓడ‌లోకి స‌రుకుల ను నింపే సామ‌ర్ధ్యం మ‌రింత అధికం కానుంద‌ని, అంతేకాకుండా, ప‌ర్యావ‌ర‌ణానికి మైత్రీపూర్వ‌కంగా ఈ కార్య‌క్ర‌మం రూపుదాల్చింద‌ని ఆయ‌న‌ అన్నారు.  త‌గిన వ‌న‌రులు ఉన్న‌టువంటి నౌకాశ్ర‌యాలు భార‌త‌దేశం ‘ఆత్మ‌నిర్భ‌ర్’ గా మార‌డానికి తోడ్ప‌డుతాయ‌ని, అంతేకాకుండా లాజిస్టిక్స్ ప‌రంగా, వ్యాపార ప‌రంగా భార‌త్ ఒక గ్లోబ‌ల్ హ‌బ్ గా ఎదిగేందుకు అవి దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని ఆయ‌న అన్నారు.  మ‌హా స్వాతంత్య్ర సేనాని విఒసి కి శ్రీ మోదీ శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.  ‘‘ఒక హుషారైన భార‌త‌దేశ శిప్పింగ్ ప‌రిశ్ర‌మ తో పాటు, స‌ముద్ర సంబంధిత అభివృద్ధి చోటు చేసుకోవాల‌ని ఆయ‌న క‌న్న క‌ల‌లు మ‌న‌కు గొప్ప ప్రేర‌ణ‌ ను అందిస్తున్నాయి’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  వి.ఒ.సి పోర్టు గ్రిడ్ కు సంధానం అయిన 5 ఎండ‌బ్ల్యు సామ‌ర్ధ్యం క‌లిగిన క్షే‌త్ర ఆధారిత సౌర విద్యుత్తు ప్లాంటు ను 20 కోట్ల రూపాయ‌ల వ్య‌యం తో  చేప‌ట్టినందుకు ఆయ‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.  140 కెడబ్ల్యు సామ‌ర్ధ్యం క‌లిగిన రూఫ్ టాప్ సోల‌ర్ ప్రాజెక్టు ప‌నులు పురోగ‌మిస్తున్నాయ‌ని తెలిపారు.  దీనిని ‘ఊర్జా ఆత్మ‌నిర్భ‌ర‌త’ (శ‌క్తి రంగం లో స్వ‌యం స‌మృద్ధి) కి ఒక ఉదాహ‌ర‌ణ గా ఆయ‌న పేర్కొన్నారు.  

‘సాగ‌ర మాల ప‌థ‌కం’ ద్వారా నౌకాశ్ర‌యాల‌ కు పెద్ద‌పీట వేస్తూ అభివృద్ధి ని సాధించాల‌న్న భార‌త ప్ర‌భుత్వ వ‌చ‌న బ‌ద్ధ‌త ను గ‌మ‌నించ‌వ‌చ్చున‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.  2015-2035 సంవ‌త్స‌రాల మ‌ధ్య కాలం లో అమ‌లు చేయ‌డానికి గాను దాదాపు 575 ప్రాజెక్టుల‌ ను గుర్తించ‌డం జ‌రిగింద‌ని, వీటికి మొత్తం 6 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ కు పైగా వ్య‌య‌మ‌వుతుంద‌ని వివ‌రించారు.  ఈ ప‌నుల లో నౌక‌శ్ర‌యాల‌ ఆధునీక‌ర‌ణ కొత్త నౌకాశ్ర‌యాల అభివృద్ధి, నౌకాశ్ర‌యాల సంధానాన్ని మెరుగు ప‌ర‌చ‌డం, నౌకాశ్ర‌యాల‌ కు పెద్ద పీట వేస్తూ, పారిశ్రామీక‌ర‌ణ ను చేప‌ట్ట‌డం, కోస్ట‌ల్ క‌మ్యూనిటీ డెవ‌ల‌ప్‌మెంట్ వంటివి భాగం గా ఉన్నాయ‌న్నారు.  చెన్నై లోని శ్రీ పెరంబ‌దూర్ స‌మీపం లో మాప్పేడు వ‌ద్ద ఒక కొత్త బ‌హుళ విధ లాజిస్టిక్స్ పార్కును త్వ‌ర‌లోనే ప్రారంభించ‌నున్న సంగ‌తిని ఆయ‌న తెలిపారు.  ‘సాగ‌ర్ మాల కార్య‌క్ర‌మం’ లో భాగంగా కోర‌మ్ ప‌ల్ల‌మ్ బ్రిడ్జి ని 8-దోవ‌లు క‌లిగిన‌దిగా విస్త‌రించే ప‌నిని సైతం చేప‌ట్ట‌డ‌మైంద‌ని కూడా ఆయ‌న వివ‌రించారు.  ఈ ప్రాజెక్టు నౌకాశ్ర‌యం నుంచి ఎలాంటి ర‌ద్దీకి తావు ఉండ‌ని విధంగా నిరంత‌రాయ రాక పోక‌ల‌కు మార్గాన్ని సుగ‌మం చేయ‌డం ఒక్క‌టే కాకుండా, ఓడ స‌రుకుల‌ ను త‌ర‌లించేందుకు ప‌ట్టే కాలాన్ని మ‌రింత‌గా త‌గ్గించ‌గ‌ల‌ద‌ని శ్రీ మోదీ వివ‌రించారు.

 

****