Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కొలంబోలో ఐపీకేఎఫ్‌ స్మారకాన్ని సందర్శించిన ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కొలంబోలోని ‘భారత శాంతి పరిరక్షక దళం’ (ఐపీకేఎఫ్) స్మారకాన్ని సందర్శించి, పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. శ్రీలంకలో శాంతి, ఐక్యత, ప్రాదేశిక సమగ్రత పరిరక్షణలో ప్రాణత్యాగం భారత శాంతి పరిరక్షక దళ వీరుల ధైర్యసాహసాలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

   “ఇవాళ నేను కొలంబోలోని ఐపీకేఎఫ్ స్మారకం సందర్శించాను. శ్రీలంకలో శాంతి, ఐక్యత, ప్రాదేశిక సమగ్రత పరిరక్షణలో ప్రాణాలు అర్పించిన భారత శాంతి పరిరక్షక దళ సిబ్బందిని స్మరిస్తూ పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించాను. పరాయి గడ్డపై శాంతి, సుస్థిరతల కోసం అంకిత భావంతో వారు చేసిన త్యాగం సదా స్మరణీయం. వారి అకుంఠిత దీక్ష, ధైర్యసాహసాలు, నిబద్ధత మనందరికీ స్ఫూర్తిదాయకం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.