Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కొత్త టెక్నాలజీని వాడుకోవటంలో భారతీయులను మించినవారు లేరు: ప్రధాని


ఎప్పటికప్పుడు కొత్త విషయాలు కనిపెట్టటానికి, వినియోగంలో పెట్టటానికి ఉత్సాహం చూపటంలో భారతీయులని మించిన వారు  లేరని ప్రధాని వ్యాఖ్యానించారు. ముందు ముందు కూడా ఈ ధోరణి కొనసాగటానికి ప్రభుత్వం తనవంతు  సహకారం కొనసాగిస్తుందని ప్రకటించారు.  డిజిటల్ చెల్లింపులలో దేశం దేశం వేస్తున్న ముందడుగును ప్రస్తావిస్తూ ఒక పౌరుడు చేసిన ట్వీట్ కు ప్రధాని ఇలా స్పందించారు:

“సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకొని వాడుకోవటం విషయానికొస్తే, భారతీయులు తిరుగులేని విజేతలు!  కొత్త ఆవిష్కరణాల విషయంలోనూ, పరిజ్ఞానాన్ని వాడుకోవటంలోనూ ముందుంటామని నిరూపించారు. ఈ మార్పు దేశమంతటా స్పష్టంగా కనబడుతోంది. ఈ వేగాన్ని ముందు ముందు కూడా కొనసాగిద్దాం. “