Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేరళ అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ


కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

“దేశాభివృద్ధిలో ఎల్లప్పుడూ చెరగని ముద్ర వేస్తున్న కేరళ ప్రజలకు, కేరళ పిరవి దినోత్సవ శుభాకాంక్షలు. కేరళ ప్రకృతి అందాలు, ఆ రాష్ట్రాన్ని ప్రఖ్యాత పర్యాటక గమ్యస్థానంగా మార్చాయి. ప్రపంచ ప్రజలను అక్కడకు రప్పిస్తున్నాయి. కేరళ ఎప్పుడూ ప్రగతి పథంలో పయనిస్తుండాలని ప్రార్థిస్తున్నా”.

 

 

 

***