ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తో కలసి కేదార్ నాథ్ పునర్ నిర్మాణ పథకం పై సమీక్ష సమావేశాన్ని ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా నిర్వహించారు.
ఈ పుణ్యక్షేత్రం యొక్క పునర్ నిర్మాణం పట్ల తన దృష్టికోణాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, కేదార్ నాథ్ మరియు బద్రీనాథ్ ల వంటి పవిత్ర స్థలాల లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పథకాలు ఒక విధం గా కాల పరీక్ష కు తట్టుకొని నిలచేవి గా ఉంటూనే, పర్యావరణమిత్రపూర్వకం గా కూడా ఉండేటట్లు మరియు ప్రకృతి తో, పరిసర ప్రాంతాల తో సామరస్యాన్ని నెలకొల్పుకొనేదిగా కూడా ఉండాలన్నారు.
వర్తమాన స్థితి ని గమనించినప్పుడు మరియు పవిత్ర స్థలాల కు తైర్థికుల, పర్యటకుల రాక పోక ల పరం గా చూసినప్పుడు ఇది సాపేక్షం గా గడ్డు కాలం కావడాన్ని దృష్టి లో పెట్టుకొని పెండింగు పడ్డ పనుల ను పూర్తి చేయడం కోసం ప్రస్తుత నిర్మాణ యుక్త సమయాన్ని వినియోగించుకోవచ్చని, అయితే సామాజిక దూరం తాలూకు నియమాల ను పరిగణన లోకి తీసుకొంటూను మరియు శ్రామిక సమూహాల కు సముచిత పని వితరణ కు పూనుకోవడం ద్వారాను ఈ కార్యాన్ని నెరవేర్చాలని ప్రధాన మంత్రి సూచించారు. రాబోయే సంవత్సరాల లో పర్యటకుల తాకిడి ని తట్టుకోగలిగిన విధం గా మౌలిక సదుపాయాల కల్పన లో మరియు సౌకర్యాల స్థాపన లో ఈ కార్యం సహాయకారి కాగలదని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి తన యొక్క నిర్దిష్ట సలహాల లో భాగం గా, రామ్ బన్ నుండి కేదార్ నాథ్ వరకు విస్తరించిన మార్గం లోని ఇతర ధార్మిక కేంద్రాలు మరియు వారసత్వ స్థలాల ను మరింతగా అభివృద్ధిపరచడం కోసం కూడా ఆదేశాల ను ఇచ్చారు. ఇవి కేదార్ నాథ్ లోని ప్రధాన పుణ్యక్షేత్రం యొక్క పునర్ నిర్మాణాని కి అదనం గా ఉంటాయి.
బ్రహ్మ కమల్ వాటిక (ఉద్యానవనం) యొక్క అభివృద్ధి పనుల లో పురోగతి తో పాటు వాసుకి తాళ్ కు వెళ్లే మార్గం లో యాత్రికుల కోసం (వస్తు) ప్రదర్శనశాల ను ఏర్పాటు చేసే పనులు, పాత బస్తీ విడిది ఇళ్ల ను పునర్ నిర్మించే పనుల ను, చారిత్రిక ప్రాముఖ్యం కలిగిన ఇతర సంపత్తుల ను వాటి యొక్క మూల వాస్తు ముఖతలాన్ని పదిలం గా ఉంచుతూనే పునర్ నిర్మాణ పనుల ను చేపట్టడం, వాటి తో పాటు నియమిత వ్యవధుల తో వాహనాల ను నిలిపి ఉంచేందుకు పుణ్యక్షేత్రాని కి తగినంత దూరం లో ఉద్దేశించిన చోటుల ను పర్యావరణమైత్రిపూర్వకం గా మలచడం తదితర విషయాల పైనా సమావేశం లో సమగ్ర చర్చ లు జరిగాయి.
చర్చల లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ త్రివేంద్ర సింహ్ రావత్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాలుపంచుకొన్నారు.
**
केदारनाथ के पुनर्निर्माण प्रोजेक्ट से जुड़े विभिन्न पहलुओं की समीक्षा की। यहां के पुनर्विकास में इस बात पर जोर है कि वो इको-फ्रेंडली हो और तीर्थयात्रियों के साथ ही पर्यटकों के लिए भी सुविधाजनक हो। https://t.co/Xgp7DWMXbc
— Narendra Modi (@narendramodi) June 10, 2020
केदारनाथ में पुनर्विकास के अलावा रामबन से लेकर केदारनाथ तक अन्य हेरिटेज सेंटर विकसित करने पर भी चर्चा हुई । ब्रह्म कमल वाटिका समेत दूसरी जगहों के विकास पर भी विचार-विमर्श किया गया।
— Narendra Modi (@narendramodi) June 10, 2020
इन प्रयासों से जहां हमारा सांस्कृतिक जुड़ाव गहरा होगा, वहीं पर्यटन को भी बढ़ावा मिलेगा।
Reviewed various aspects relating to the Kedarnath Reconstruction project. Emphasised on redevelopment that is eco-friendly and ensures convenience to pilgrims as well as tourists. https://t.co/Xgp7DWMXbc
— Narendra Modi (@narendramodi) June 10, 2020
In addition to the redevelopment at Kedarnath, we discussed ways to develop other heritage centres from Ramban to Kedarnath. Development of centres such as Brahma Kamal Vatika were also discussed.
— Narendra Modi (@narendramodi) June 10, 2020
These efforts will deepen our cultural connect and boost tourism.