కృత్రిమ మేధలో భారత్ గణనీయమైన ప్రగతిని సాధిస్తూ నూతన సాంకేతికతను ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తోందన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ… భారత్ లో పెట్టుబడులు పెట్టాలనీ, తిరుగులేని దేశ యువశక్తి పై నమ్మకం ఉంచమని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.
గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థల సీఈఓ శ్రీ సుందర్ పిచెయ్ తో సమావేశం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని, సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ పై శ్రీ పిచెయ్ చేసిన పోస్టుకు ఇలా స్పందించారు:
“@sundarpichai మిమ్మల్ని కలిసినందుకు ఆనందిస్తున్నాను. ఎఐ రంగంలో భారత్ గొప్ప ప్రగతిని సాధిస్తూ నూతన సాంకేతికతను ప్రజా సంక్షేమానికై వినియోగిస్తోంది. మా దేశంలో పెట్టుబడులు పెట్టాలనీ, మా యువశక్తిపై నమ్మకం ఉంచాలనీ ప్రపంచ దేశాలకి విజ్ఞప్తి చేస్తున్నాం!”
Glad to have met you @sundarpichai. India is making remarkable strides in AI, leveraging it for public good. We urge the world to come and invest in our nation and bet on our Yuva Shakti! https://t.co/VHMUj0eUGs
— Narendra Modi (@narendramodi) February 12, 2025