భారతదేశం లోని ఎగుమతిదారు సంస్థ లు ఇండియా-యుఎఇ కాంప్రిహెన్సివ్ ఇకానామిక్ పార్ట్ నర్ శిప్ అగ్రీమెంట్ (సిఇపిఎ) ను సద్వినియోగపరచుకొన్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంస ను వ్యక్తం చేశారు.
వాణిజ్యం మరియు పరిశ్రమ శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చేసిన ఒక ట్వీట్ ను శేర్ చేస్తూ ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘భారతదేశం లోని వాణిజ్య సంస్థల కు ఒక గొప్ప సంకేతం ఇది, దీని ద్వారా భారతదేశం ఉత్పత్తులు ప్రపంచ స్థాయి లో లోకప్రియత్వాన్ని సంపాదించుకొంటాయి.’’ అని పేర్కొన్నారు.
A great sign for Indian enterprise, it will make Indian products popular globally. https://t.co/21oJAfXDsv
— Narendra Modi (@narendramodi) January 31, 2023