Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారాగేమ్స్‌ ‘చదరంగం బి-2’లో కాంస్య విజేత కిషన్ గంగూలీకి ప్రధానమంత్రి అభినందనలు


   చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్‌ ‘చదరంగం బి-2’ (వ్యక్తిగత) విభాగంలో కాంస్య పతకం సాధించిన కిషన్ గంగూలీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారాగేమ్స్‌ పురుషుల చదరంగం బి-2 (వ్యక్తిగత) విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న కిషన్ గంగూలీకి హృదయపూర్వక అభినందనలు. అతని అద్భుత క్రీడా స్ఫూర్తి, దృఢ సంకల్పం భారత్ గర్వించే విజయానికి తోడ్పడ్డాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.