Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆంగ్ల అనువాదం: లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం…. ప్రధాని సమాధానం


గౌరవ అధ్యక్షా,

గౌరవనీయులైన రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఇక్కడ ఉన్నానునిన్నఈ రోజు అర్థరాత్రి వరకు గౌరవ ఎంపీలందరూ ఈ ధన్యవాద తీర్మానంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారుచాలా  అనుభవజ్ఞులైన ఎంపీలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారుసహజంగానే ప్రజాస్వామ్య సంప్రదాయం ప్రకారం అవసరం ఉన్న చోట ప్రశంసలు ఉంటాయిఎక్కడ సమస్య వచ్చినా అక్కడ కొన్ని ప్రతికూల విషయాలు ఉంటాయిఇది చాలా సహజంఅధ్యక్షా.. దేశ ప్రజలు నాకు 14వసారి ఇక్కడ కూర్చొని రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం కల్పించారుఇది నా అదృష్టంకాబట్టి ఈ రోజు నేను ప్రజలకు ఎంతో గౌరవంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నానుచర్చలో పాల్గొని చర్చను గొప్పగా చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు.

గౌరవ అధ్యక్షా,

మనం 2025 లో ఉన్నాంఒక రకంగా చెప్పాలంటే 21వ శతాబ్దంలో ఇప్పటికే 25 శాతం గడిచిపోయిందిస్వాతంత్య్రానంతరం 20వ శతాబ్దంలో, 21వ శతాబ్దపు మొదటి 25 ఏళ్లలో ఏం జరిగిందోఎలా జరిగిందో కాలమే నిర్ణయిస్తుందిఅయితే ఈ రాష్ట్రపతి ప్రసంగాన్ని నిశితంగా పరిశీలిస్తే.. రాబోయే 25 ఏళ్ల గురించిఅభివృద్ధి చెందిన భారత్‌ కోసం కొత్త ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ప్రసంగం ఇచ్చారని స్పష్టంగా తెలుస్తోందిమరో విధంగా చెప్పాలంటే గౌరవ రాష్ట్రపతి ప్రసంగం అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మన సంకల్పాన్ని బలోపేతం చేస్తుందిఅంతేకాకుండా కొత్త విశ్వాసాన్ని అందించటమే కాకుండా సాధారణ ప్రజలకు స్ఫూర్తినిస్తుంది.

గౌరవ అధ్యక్షా,

గత పదేళ్లలో దేశ ప్రజలు తమకు సేవ చేసే అవకాశం ఇచ్చారని అన్ని అధ్యయనాలు పదేపదే చెబుతున్నాయిపేదరికాన్ని జయించి 25 కోట్ల మంది ప్రజలు బయటపడ్డారు.

గౌరవ అధ్యక్షా,

ఐదు దశాబ్దాలుగా పేదరిక నిర్మూలన నినాదాలను విన్నాంఇప్పుడు 25 కోట్ల మంది పేదలు పేదరికాన్ని జయించి బయటకు వచ్చారుఇది అలా ఊరికే జరిగిపోదుఅంకితభావంసమస్యపైన పూర్తి అవగాహనతో కూడిన ఆలోచనతో ప్రణాళికాబద్ధంగా పేదల కోసం జీవితాన్ని గడిపినప్పుడు ఇది సాధ్యం అవుతుంది.  

గౌరవ అధ్యక్షా,

ఒక ప్రాంతంతో సంబంధం ఉన్న వ్యక్తులుఆ ప్రాంతం గురించి నిజానిజాలు తెలుసుకుంటూ అక్కడ తమ జీవితాలను గడిపినట్లయితేనే అక్కడ మార్పు కచ్చితంగా వస్తుంది

గౌరవ అధ్యక్షా,

పేదలకు మేం ఎప్పుడు తప్పుడు నినాదాలు ఇవ్వలేదువారికి నిజమైన అభివృద్ధిని అందించాంపేదలసామాన్యుల బాధలు.. మధ్యతరగతి కలలు అలా ఊరికే అర్థం కావుదీనికి అభిరుచి అవసరం అధ్యక్షాకొంతమందికి అది లేదని నేను విచారంతో చెప్పాల్సి వస్తోంది

గౌరవ అధ్యక్షా,

వర్షాకాలంలో ప్లాస్టిక్ షీట్లతో కూడిన పైకప్పు కింద జీవించడం ఎంత కష్టం!. ప్రతి క్షణం కలలు నలిగిపోయే పరిస్థితులు ఉంటాయిఇది అందరికీ అర్థం కాదు.

గౌరవ అధ్యక్షా,

ఇప్పటి వరకు కోట్ల ఇళ్లు పేదలకు అందాయిఆ జీవితం గడిపిన వారికి కాంక్రీట్ పైకప్పు ఉన్న ఇల్లు అంటే ఏంటో అర్థం కాదు.

గౌరవ అధ్యక్షా,

ఆడవాళ్లు బహిరంగ మలవిసర్జన చేయాల్సి వచ్చినప్పుడువాళ్లు సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత బయటకు వెళ్లాల్సి వస్తుందిఈ రోజువారీ చిన్న కాలకృత్యాన్ని తీర్చుకునేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందివాళ్లు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వీళ్లు అర్థం చేసుకోలేరు అధ్యక్షా

గౌరవ అధ్యక్షా,

12 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించడం ద్వారా సోదరీమణుల సమస్యలను పరిష్కరించాంఅధ్యక్షా.. ఈ రోజుల్లో మీడియాలో చాలా చర్చ జరుగుతోందిసామాజిక మాద్యమాల్లో ఎక్కువగా ఇది జరుగుతోందిదీని ప్రకారం కొందరు నాయకులు జకూజీఇళ్లలో స్టైల్‌గా ఉండే షవర్లపై దృష్టి పెడుతున్నారుకానీ ప్రతి ఇంటికీ నీరు అందించడంపైన మేం దృష్టి సారించాందేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా దేశ జనాభాలో 70-75 శాతం అంటే 16 కోట్ల కుటుంబాలకు కుళాయి నీటి సదుపాయం లేదుమా ప్రభుత్వం ఐదేళ్లలో 12 కోట్ల కుటుంబాలకు నల్లా నీటిని అందించిందిపనులు శరవేగంగా జరుగుతున్నాయి

గౌరవ అధ్యక్షా,

పేదల కోసం మనం ఎన్నో పనులు చేశాం కాబట్టే వాటిని గౌరవ రాష్ట్రపతి ప్రసంగంలో సవివరంగా పేర్కొన్నారుపేదల గుడిసెల్లో ఫోటోలు దిగే కార్యక్రమాలు చేపట్టి అలరించే వారికి పార్లమెంట్‌లో పేదల గురించి మాట్లాడటం బోర్ కొడుతుంది.

గౌరవ అధ్యక్షా,

వాళ్ల కోపాన్ని నేను అర్థం చేసుకోగలనుఅధ్యక్షా.. సమస్యను గుర్తించడం ఒక విషయం అయితే బాధ్యత ఉంటే ఆ సమస్యను గుర్తించిన తరువాత దానిని విడిచిపెట్టలేరుదానిని పరిష్కరించడానికి అంకితభావంతో కృషి చేయాలిగత 10 సంవత్సరాల్లో మనం చేసిన పనిని చూశాంమీరు కూడా చూసే ఉంటారుసమస్యను పరిష్కరించేందుకు మా ప్రయత్నం రాష్ట్రపతి ప్రసంగంలో కూడా కనిపిస్తోందిఅంతేకాకుండా మేం అంకితభావంతో పని చేస్తున్నాం.

గౌరవ అధ్యక్షా,

ఒకప్పుడు మన దేశంలో ఒక ప్రధాని ఉండేవారుఆయనను మిస్టర్ క్లీన్ అని పిలవడం ఒక ప్యాషన్‌గా మారిందిప్రధానిని మిస్టర్ క్లీన్ అని పిలవడం ఫ్యాషన్‌గా తయారైందిఆయన ఒక సమస్యను గుర్తించారుదిల్లీ నుంచి ఒక్క రూపాయి వెళ్తే 15 పైసలు మాత్రమే గ్రామానికి చేరుతాయని ఆయన చెప్పారుఅప్పుడు పంచాయితీ నుంచి పార్లమెంటు వరకు ఒకే పార్టీ పాలన ఉండేదిఆ సమయంలోనే రూపాయి బయటకు వస్తుందని, 15 పైసలు మాత్రమే అర్హులకు అందుతున్నాయని బహిరంగంగానే చెప్పారుచేతులకు మురికి అంటకుండా చేసుకునే అద్భుతమైన పని ఇదిఆ 15 పైసలు ఎవరికి వెళ్తున్నాయో దేశంలోని సామాన్యుడికి కూడా సులభంగా అర్థం అవుతుంది.

గౌరవ అధ్యక్షా,

ఈ దేశం మాకు అవకాశం ఇచ్చిందిమేం పరిష్కారాలను కనుగొనేందుకు ప్రయత్నించాంపొదుపుతో పాటు అభివృద్ధిప్రజల కోసమే ప్రజాధనం అనేది మా నమూనామేం జన్ ధన్ఆధార్మొబైల్ ఫోన్ అనే గొప్ప త్రయాన్ని సృష్టించి డీబీటీ ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ ప్రయోజనాన్ని అందించటం ప్రారంభించాం.

గౌరవ అధ్యక్షా,

మా హయాంలో రూ.40 లక్షల కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశాం.

గౌరవ అధ్యక్షా,

ఈ దేశ దుస్థితిని చూడండిప్రభుత్వాలు ఎలా నడిచాయోఎవరి కోసం నడిచాయోచూడండి.

గౌరవ అధ్యక్షా,

ఆరోగ్యం బాలేనప్పుడు జనాలు ఏదైనా అంటుంటారుకానీ దానితో పాటు నిరాశ వ్యాప్తి చెందినప్పుడు కూడా వారు చాలా మాట్లాడుతుంటారు

గౌరవ అధ్యక్షా,

ఇంకా జన్మించనిఈ దేశ గడ్డపైకి రాని 10 కోట్ల మంది నకిలీ వ్యక్తులు ప్రభుత్వం నుంచి వివిధ పథకాల ద్వారా లబ్ది పొందారు.

గౌరవ అధ్యక్షా,

సరైన వ్యక్తులకు అన్యాయం జరగకూడదనిరాజకీయ లాభనష్టాల గురించి ఆలోచించకుండా ఈ 10 కోట్ల నకిలీ పేర్లను తొలగించినిజమైన లబ్దిదారులను కనుగొని వారికి సహాయం అందించే పని ప్రారంభించాం.

గౌరవ అధ్యక్షా,

ఈ 10 కోట్ల నకిలీ వ్యక్తులను తొలగించివివిధ పథకాల ఖాతాలను లెక్కించినప్పుడు దాదాపు లక్షల కోట్ల రూపాయలు తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా ఆదా అయ్యాయిఎవరి ప్రమేయం ఉందో నేను చెప్పడం లేదు కానీ తప్పుడు వ్యక్తులు అని చెబుతున్నాను

గౌరవ అధ్యక్షా,

మేం ప్రభుత్వ కొనుగోళ్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి పారదర్శకత తీసుకొచ్చాంనేడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జెమ్ పోర్టల్‌ను ఉపయోగించుకుంటున్నాయిజెమ్ పోర్టల్ ద్వారా చేసిన కొనుగోళ్ల ద్వారా ఖర్చు సాధారణ వ్యయం కంటే తక్కువ కావటంతో ప్రభుత్వానికి రూ.1,15,000 కోట్లు ఆదా అయ్యాయి.

గౌరవ అధ్యక్షా,

మన స్వచ్ఛభారత్ పథకాన్ని చాలా హేళన చేశారుమనం ఏదో పాపంతప్పు చేశాం అన్నట్లు మాట్లాడారుఇంకా ఏమన్నారో తెలియదు కానీ పరిశుభ్రతకు సంబంధించిన ఈ కార్యక్రమం వల్ల ఇటీవలి కాలంలో ఒక్క ప్రభుత్వ కార్యాలయాల నుంచి విక్రయించే చెత్త ద్వారానే ప్రభుత్వానికి రూ.2300 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పటం ఎంతో సంతృప్తి‌కరంగా ఉందిమహాత్మాగాంధీ ధర్మకర్తృత్వ సూత్రం గురించి మాట్లాడేవారుమనం ధర్మకర్తలమనిఈ ఆస్తి ప్రజలదేనని ఆయన చెప్పారుఅందువల్ల ఈ ధర్మకర్తృత్వ సూత్రం ఆధారంగా ప్రతి పైసాను పొదుపు చేసి సరైన చోట ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నాందీనివల్లనే స్వచ్ఛభారత్ పథకం నుంచి చెత్తను అమ్మడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.2300 కోట్లు వచ్చాయి

గౌరవ అధ్యక్షా,

ఇథనాల్‌ను ఇంధనంలో కలపటానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాంమనం ఇంధనం విషయంలో స్వతంత్రులం కాదనిబయటి నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని మాకు తెలుసుఇథనాల్‌ను ఇంధనంలో కలిపే ఆ ఒక్క నిర్ణయం వల్ల పెట్రోల్డీజిల్ నుంచి రూ.1,00,000 కోట్ల వ్యయ వ్యత్యాసం వచ్చిందిఈ రూ.లక్ష కోట్ల మొత్తం సొమ్ము రైతుల జేబుల్లోకి వెళ్లింది

గౌరవ అధ్యక్షా,

నేను పొదుపు గురించి మాట్లాడుతున్నానుకానీ ఇంతకు ముందు వార్తాపత్రికల పతాక శీర్షికలు లక్షల రూపాయల కుంభకోణాల గురించి ఉండేవిలక్షల కోట్ల విలువైన కుంభకోణాలు.. లక్షల కోట్ల కుంభకోణాలు.. పదేళ్లు కావస్తున్నా ఈ కుంభకోణాలు జరగక‌పోవడం గమనార్హంకుంభకోణాలు జరగకుండా చూడటం వల్ల లక్షల కోట్ల రూపాయలను కాపాడివాటిని ప్రజా సేవకు వినియోగిస్తున్నాం

 

గౌరవ అధ్యక్షా,

మేం తీసుకున్న వివిధ చర్యలతో నేడు లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయికానీ మేం ఆ డబ్బును అద్దాల రాజభవనాలు నిర్మించడానికి ఉపయోగించలేదుదేశ నిర్మాణం కోసం ఉపయోగించాంమేం అధికారంలోకి రాకముందుఅంటే 10 ఏళ్ల క్రితం మౌలిక సదుపాయాల బడ్జెట్ రూఒక లక్షా ఎనబై వేల కోట్లుగా ఉంటేనేడు అది 11 లక్షల కోట్లకు చేరిందిఅందుకే దేశ పునాదులు బలపడుతున్న తీరును రాష్ట్రపతి వారి ప్రసంగంలో వివరించారురహదారులుహైవేలురైల్వేలుగ్రామాల్లోని రహదారులు ఇలా పనులేవైనావాటి ద్వారా దేశ అభివృద్ధికి బలమైన పునాది వేశాం.
గౌరవ అధ్యక్షా,
ప్రభుత్వ ఖజానాలో ఆదా అనేది  ప్రధానమైనదిఅయితే ఇలా ఆదా చేసిన సొమ్ము తాలూకు ప్రయోజనాన్ని సాధారణ ప్రజలు కూడా పొందాలిప్రభుత్వ పథకాలు ప్రజలు కూడా పొదుపు చేసేలా ప్రోత్సహించేవిగా ఉండాలిఅప్పుడే తగిన ఫలితాలు దక్కుతాయిఅనారోగ్యం కారణంగా సామాన్యులు చేసే ఖర్చులు ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా ఆదా అవడం మీరు చూసే ఉంటారుఇప్పటివరకు ఆయుష్మాన్ యోజన ప్రయోజనాన్ని పొందడం ద్వారా దేశప్రజలు వైద్యం కోసం చేసే ఖర్చులో 1లక్షా 20వేల కోట్లు ఆదా చేసుకున్నారుమధ్యతరగతి కుటుంబాల్లో దాదాపుగా 60-70 ఏళ్ల వృద్ధులు ఏదో ఒక జబ్బుతో ఉన్నవారు ఉండడం సాధారణంఅయితే వారి మందుల ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుందిమేం జన ఔషధి కేంద్రాలను ప్రారంభించిన క్రమంలో, 80% తగ్గింపు ధరలకే వారికి మందులు అందుబాటులోకి వచ్చాయిఈ కారణంగాప్రజలు మందుల కోసం చేసే ఖర్చులో దాదాపు రూ.30వేల కోట్లు ఆదా అయ్యాయి.
గౌరవ అధ్యక్షా,
పారిశుధ్యంమరుగుదొడ్ల సౌకర్యం ఉన్న ఇళ్ళలో  నివసించే కుటుంబాలు ఏడాదికి దాదాపు రూ. 70వేలు ఆదా చేస్తున్నట్లు యునిసెఫ్ ఇటీవల నిర్వహించిన ఒక సర్వే అంచనా వేసిందిస్వచ్ఛతా అభియాన్ అయినామరుగుదొడ్ల నిర్మాణం అయినాస్వచ్ఛమైన తాగునీటిని అందించే పని అయినావాటి ద్వారా మన మధ్యతరగతి కుటుంబాలు భారీ ప్రయోజనాలను పొందుతున్నాయిస్వచ్ఛమైన తాగునీటిని పొందడం వల్లసగటు కుటుంబం నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల కోసం చేసే ఖర్చులో రూ. 40వేలు ఆదా చేస్తున్నట్లు డబ్ల్యుహెచ్ఓ నివేదిక స్పష్టం చేసిందిఇలా సామాన్యుల ఖర్చులను ఆదా చేసిన పథకాలు చాలానే ఉన్నాయి.
గౌరవ అధ్యక్షా,
దేశంలో కోట్లాది మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తున్న క్రమంలో వారికి వేల రూపాయలు ఆదా అవుతున్నాయిప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం ద్వారా అనేక కుటుంబాలు ప్రతియేటా సగటున 25 నుంచి 30 వేల రూపాయలు విద్యుత్తుపై ఆదా చేస్తున్నారుఅలాగే మిగులు విద్యుత్ విక్రయం ద్వారా వారు డబ్బు సంపాదిస్తున్నారుఅంటేసామాన్యులకు ఆదాతో పాటు ఆదాయం కూడా లభిస్తోందిగతంలో ఎల్ఈడీ బల్బులు ఒక్కొక్కటి రూ. 400కి అమ్ముడయ్యేవని మీకు తెలుసుమేం నిర్వహించిన ప్రచారంతోదాని ధర నేడు రూ.40కి పడిపోయిందిఎల్ఈడీ బల్బుల కారణంగా విద్యుత్ ఆదా అవడంతో పాటుఎక్కువ కాంతి కూడా లభిస్తుందిదీని ద్వారా దేశవాసులకు దాదాపు 20వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి.
గౌరవ అధ్యక్షా,
సాయిల్ హెల్త్ కార్డులను శాస్త్రీయంగా ఉపయోగించిన రైతులు వాటి ద్వారా ఎకరానికి రూ. 30వేల వరకు ఆదా చేశారుగత పదేళ్లలోఆదాయపు పన్నును తగ్గించడం ద్వారామధ్యతరగతి ప్రజల పొదుపులను పెంచడానికి కూడా మేం కృషి చేశాం. 2014కి ముందుదేశ ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసిన పరిస్థితులను సరిచేస్తూ మేం ముందుకు సాగుతున్నాం. 2013-14లోకేవలం 2లక్షల రూపాయల వరకే ఆదాయపు పన్ను మినహాయింపు ఉందినేడు ఏకంగా 12 లక్షల వరకు మినహాయింపునిచ్చాంస్టాండర్డ్ డిడక్షన్ 75వేలు కూడా కలిపితేఏప్రిల్ తర్వాతదేశంలో వేతనదారులు వారి ఆదాయంలో 12.75 లక్షల రూపాయల వరకు ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
గౌరవ అధ్యక్షా,
మీరు యువ మోర్చాలో పనిచేస్తున్న కాలంలో,  21వ శతాబ్దం అంటూ అదేపనిగా మాట్లాడే ఒక ప్రధానమంత్రి గురించి మీకు తెలిసే ఉంటుందిఆయన అలా అదే మాట చెబుతున్న క్రమంలో అదో ఊతపదంలా మారిందిఆ సమయంలోటైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ఆర్ కె లక్ష్మణ్ ఒక ఆసక్తికరమైన కార్టూన్ వేశారుఆ కార్టూన్‌లోఒక విమానంపైలట్ ఉన్నారుకొంతమంది ప్రయాణీకులు కూర్చుని ఉన్న విమానాన్ని ఒక బండిపై ఉంచి కార్మికులు ఆ బండిని తోస్తున్నారుదానిపై 21వ శతాబ్దం అని వ్రాశారుఆ కార్టూన్ ఆ సమయంలో ఒక జోక్‌లాగా అనిపించిందికానీ తరువాతి కాలంలో అదే నిజమని నిరూపితమైందిఇది వ్యంగ్యంగానే చెప్పినాఅప్పటి ప్రధానమంత్రి నిరాధారమైన మాటలువాస్తవ దూరంగా ఉన్న ఆయన వ్యాఖ్యలను అది స్పష్టంగా తెలియజేసిందిఅయితే అప్పుడు 21వ శతాబ్దం గురించి మాట్లాడిన వారు 20వ శతాబ్దంలోని అవసరాలను మాత్రం తీర్చలేకపోయారు.
గౌరవ అధ్యక్షా,
గత పదేళ్లలో జరిగిన అన్ని విషయాలను నిశితంగా పరిశీలించినప్పుడుమనం 40-50 ఏళ్లు వెనకబడి పోయామనిపించిందిఇదంతా అప్పుడే జరగాల్సిందిఅందుకే దేశ ప్రజలు 2014 నుంచి మాకు సేవ చేసే అవకాశం ఇచ్చినప్పుడుమేం యువతపైవారి ఆకాంక్షలపై మరింత దృష్టి పెట్టాంవారికోసం అనేక రంగాల్లో మరిన్ని అవకాశాలను కల్పించాందీని కారణంగా దేశ యువత వారి సామర్థ్యాలను విజయవంతంగా ప్రదర్శించడం మనం నేడు చూస్తున్నాంమేం దేశంలో అంతరిక్షరక్షణ రంగాల్లో ఎన్నో అవకాశాలను కల్పించడమే గాకుండాసెమీకండక్టర్ మిషన్‌ను తీసుకువచ్చాంఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అనేక కొత్త పథకాలకు రూపం ఇచ్చాంభారత అంకురసంస్థల రంగాన్ని పూర్తిగా అభివృద్ధి చేసాంఈ బడ్జెట్‌లో కూడా చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాంరూ. 12 లక్షల ఆదాయంపై ఆదాయపు పన్ను మినహాయింపు చాలా మంది మన్నన పొందిందిఅయితే చాలా ముఖ్యమైన నిర్ణయాలను ఇప్పటికీ కొంతమంది గమనించలేదుఅణు విద్యుత్ రంగాన్ని ప్రోత్సహించడం వంటి ఎన్నో ముఖ్య నిర్ణయాలు మేం తీసుకున్నాంవీటి వల్ల దేశం ఎన్నో సానుకూల ప్రభావాలనుఫలితాలను చూడబోతోంది.
గౌరవ అధ్యక్షా,
ఏఐ, 3డి ప్రింటింగ్రోబోటిక్స్వర్చువల్ రియాలిటీగేమింగ్ ప్రాముఖ్యతను చర్చించడానికి ప్రయత్నాలు చేస్తున్నాంమన దేశం ప్రపంచ గేమింగ్ రాజధానిగాసృజనాత్మకత రాజధానిగా ఎందుకు మారకూడదో ఆలోచించాలని నేను దేశ యువతకు చెప్పానువారు ఈ దిశగా చాలా వేగంగా పనిచేస్తున్నారునా లక్ష్యాల్లో ఒకే ఏఐ కాదుడబుల్ ఏఐ ఉందిభారత్ ఈ రంగంలో రెండు బలాలను కలిగి ఉందిఒక ఏఐ అంటే కృత్రిమ మేధ అయితేమరొక ఏఐ అంటే ఆకాంక్షాత్మక భారత్ (ఆస్పిరేషనల్ ఇండియా). మేం పాఠశాలల్లో పదివేల టింకరింగ్ ల్యాబ్‌లను ప్రారంభించాంనేడు ఆ టింకరింగ్ ల్యాబ్‌ల నుంచి బయటకు వస్తున్న పిల్లలు రోబోలను తయారు చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నారుఈ బడ్జెట్‌లోమరో 50వేల కొత్త టింకరింగ్ ల్యాబ్‌ల ఏర్పాటు కోసం కేటాయింపులు చేశాంభారత ఏఐ మిషన్ గురించి ప్రపంచం మొత్తం చాలా ఆశాజనకంగా ఉందిమన దేశ ఉనికి ప్రపంచ ఏఐ వేదికల్లో ఒక ముఖ్యమైన స్థానాన్ని పొందింది.

ఈ సంవత్సరం బడ్జెట్‌లోమనం డీప్ టెక్ రంగంలో పెట్టుబడుల గురించి ప్రస్తావించాం, 21వ శతాబ్దం పూర్తిగా టెక్నాలజీ ఆధారిత శతాబ్దంగా మారడానికిభారత్ ఈ రంగంలో చాలా వేగంగా ముందుకు సాగడం అవసరమని నేను నమ్ముతున్నానుయువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మేం నిరంతరం పని చేస్తున్నాంకానీ కొన్ని పార్టీలు నిరంతరం యువతను మోసం చేస్తూనే ఉన్నాయిఈ పార్టీలు ఎన్నికల సమయంలో ఈ భత్యం.. ఆ భత్యం.. ఇస్తామంటూ వారికి ఆశచూపుతాయిఅయితే అవి వాగ్దానాలు మాత్రమే చేస్తాయి కానీ వాటిని నెరవేర్చవుఈ పార్టీలు యువత భవిష్యత్తుకు విపత్తుగా మారాయి.
గౌరవ అధ్యక్షా,
హర్యానాలో మా పనితీరును ఇటీవలే దేశమంతా చూసిందిఎటువంటి ఖర్చు లేకుండాఎలాంటి స్లిప్స్ లేకుండా ఉద్యోగాలు ఇస్తామని మేం హామీ ఇచ్చాంమా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే యువతకు ఉద్యోగాలు వచ్చాయిమేం చెప్పిన దాని ఫలితమే ఇది.

గౌరవ అధ్యక్షా,

హర్యానాలో ముచ్చటగా మూడోసారి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాందాంతో రాష్ట్ర చరిత్రలో మనకి మూడోసారి విజయం దక్కింది..  ఇదో చారిత్రాత్మక ఘట్టం.

గౌరవ అధ్యక్షా,

మహారాష్ట్ర విజయం కూడా చారిత్రాత్మకమైనదే. అధికార పార్టీ ఇంత భారీ మొత్తంలో సీట్లు దక్కించుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇది తొలిసారి.. ప్రజల ఆశీస్సుల వల్లే ఇది సాధ్యపడింది.

గౌరవ అధ్యక్షా,

రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్ళు పూర్తయిన సందర్భాన్ని రాష్ట్రపతి తమ ప్రసంగంలో విపులంగా చర్చించారు.

గౌరవ అధ్యక్షా,

రాజ్యాంగాన్ని  కేవలం నిబంధనలుప్రకరణాలు గల పత్రంగా భావించలేం. రాజ్యాంగ స్ఫూర్తి కూడా ఎంతో ముఖ్యమైనదిఆ స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు దానిని పాటించడం ఆవశ్యకంఈ అంశాన్ని ఉదాహరణాలతో సహా వివరిస్తానుమనమంతా రాజ్యాంగాన్ని సభక్తికంగా పాటించేవారం .

గౌరవ అధ్యక్షా,

మన దేశంలో రాష్ట్రపతి చట్టసభని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ఆ ఏడాదికి సంబంధించి ప్రభుత్వ పనితీరును చర్చించడం పరిపాటిఅదే విధంగా గవర్నర్లు రాష్ట్ర చట్టసభలని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సందర్భాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల కార్యకలాపాల గురించి మాట్లాడటం ఆనవాయితీగా వస్తోందిరాజ్యాంగంప్రజాస్వామ్యాల స్ఫూర్తి అంటే ఏమిటి అని ప్రశ్నించుకుందాం.. ఒక ఉదాహరణ తీసుకుందాం.. గుజరాత్ రాష్ట్రం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్న సందర్భమది.. ఆ సమయంలో అదృష్టవశాన నేను గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నానుప్రభుత్వం అప్పుడో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర స్వర్ణోత్సవాల సందర్భంగా గత 50 ఏళ్ళలో సభనుద్దేశించి గవర్నర్లు చేసిన అన్ని ప్రసంగాలతో కూడిన పొత్తం వెలువరించాలని నిర్ణయించాంఈ ప్రసంగాల్లో గవర్నర్లు అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశంసించారుఈ రోజున ఆ ప్రమాణ గ్రంథాలు ప్రతి గ్రంథాలయంలో లభ్యమవుతున్నాయినేను బీజేపీ వాడినైనప్పటికీఅప్పటికి గుజరాత్ ను కాంగ్రెస్ ప్రభుత్వాలే ఎక్కువగా పాలించాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలని ప్రశంసిస్తూ సాగిన గవర్నర్ల ప్రసంగాలకు బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి ప్రాచుర్యం కల్పించారు.. ఎందువల్ల?  రాజ్యాంగాన్ని గౌరవించడం మాకు తెలుసు కనుక.. మేము రాజ్యాంగానికి బద్ధులం. రాజ్యాంగ స్ఫూర్తి పట్ల మాకు చక్కని అవగాహన ఉంది.

గౌరవ అధ్యక్షా,

2014 లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు లెక్కించదగ్గ విపక్షమనేదే లేదుగుర్తింపు పొందిన విపక్షం అప్పటికి లేదువిపక్షంగా అధికార హోదా దక్కించుకునేందుకు అవసరమైనన్ని సీట్లు గల పార్టీ అప్పటికి లేనేలేదుమన దేశంలో గల అనేక చట్టాలు అనేక వెసులుబాట్లను కల్పిస్తాయిపూర్తి స్వేచ్చనిస్తాయి. ఇటువంటి కొన్ని చట్టాల ప్రకారం కొన్ని కమిటీల్లో విపక్ష అధినేత పాల్గొనడం అనివార్యం అని లిఖించి ఉందిఅయితేవిపక్షమనేదే లేని పరిస్థితి. గుర్తింపు పొందిన విపక్షం అప్పటికి లేదుఅయినప్పటికీరాజ్యాంగ పరిధికి లోబడి పార్లమెంటులో గల అతి పెద్ద విపక్ష పార్టీ నేతను ఆయా కమిటీల సమావేశాలకు ఆహ్వానించాంరాజ్యాంగాన్నిరాజ్యాంగ స్ఫూర్తిని ఆ విధంగా మేము ఆచరించాం. ప్రజాస్వామ్య స్పూర్తిని ఆ విధంగా గౌరవించాంఇక ఎన్నికల సంఘానికి సంబంధించి కమిటీల విషయానికి వస్తేగతంలో ప్రధానమంత్రి మాత్రమే ఆ కమిటీని కూర్చేవారుప్రకటించేవారుమేము ఆ పద్ధతిని మార్చివేశాం..ఆ కమిటీలో సైతం విపక్షాధినేత ఉండాలని నిర్ణయించితదనుగుణంగా చట్టాన్ని తీసుకొచ్చాం ఈ రోజున ఎన్నికల సంఘం కూర్పు జరిగినప్పుడువిపక్షాధినేత కూడా విధాన నిర్ణయాల్లో పాల్గొంటున్నారు.. మేము ఇటువంటి ఎన్నో పనులు చేపట్టాంనేను ఇటువంటి చర్యలను ఇప్పటికే తీసుకున్నాను.. రాజ్యాంగాన్ని మేము అర్ధం చేసుకుని ఆచరించే తీరు ఇది.

 గౌరవ అధ్యక్షా,

ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో కొన్ని కుటుంబాల వారు తమ సొంత మ్యూజియంలను ఏర్పాటు చేసుకోవడం మనకి తెలుసుఇవి ప్రజాధనంతో ఏర్పాటయ్యాయి. మరి ప్రజాస్వామ్యంరాజ్యాంగం మాటేమిటిమేము ప్రధానమంత్రి మ్యూజియంను ఏర్పాటు చేశాం – ఇందులో తొలి ప్రధాని నుంచీ నాకు ముందు అ పదవిలో సేవలందించినవారి వరకూ ప్రతి ప్రధానమంత్రి జీవిత విశేషాలు సహా వారు చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల గురించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచాం. పీఎం మ్యూజియంలో గల మహామహుల కుటుంబ సభ్యులు మ్యూజియంను సందర్శించిమరేదైనా జోడించదలుచుకుంటేఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నానుతద్వారా మ్యూజియం మరింత ఆసక్తిదాయంగా మారిఈ దేశ బాలలకు మరింత స్ఫూర్తిదాయకంగా నిలువగలదుఇదీ రాజ్యాంగ స్ఫూర్తిని అవగాహన చేసుకుని అమలు చేయడం. ఏ కాలంలోనైనా తమ స్వార్థం మాత్రమే చూసుకునే వారి సంఖ్య తక్కువేం కాదువీరు తమ గురించి మాత్రమే పాటుపడతారుఅయితేరాజ్యాంగం కోసమే జీవించేవారూ ఇక్కడ ఆశీనులై ఉన్నారు.

గౌరవ అధ్యక్షా,

అధికారం సేవగా మారిన సందర్భాల్లో జాతి నిర్మాణం సాధ్యపడుతుందిఅదే అధికారం ఆనువంశికంగా మారితేఅది ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడుతుంది.

గౌరవ అధ్యక్షా,

మేం రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తున్నాం.. రాజకీయం పేరుతో విషాన్ని చిమ్మే పద్ధతి కాదు మాదిదేశ ఐక్యతకి అత్యంత ప్రాముఖ్యాన్నిస్తాంఅందుకే దేశాన్ని ఒక్క తాటి పైకి తెచ్చేందుకు అహరహం శ్రమించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని సంస్మరించుకుంటూప్రపంచ అతి ఎత్తైన విగ్రహాన్నిస్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరిట నెలకొల్పాంసర్దార్… బీజేపీ వారూ కారుజనసంఘ్ కి చెందిన వారూ కారుమేం రాజ్యాంగ స్ఫూర్తిని పాటిస్తాం కాబట్టే మా ఆలోచన ఈ దిశగా సాగింది.

గౌరవ అధ్యక్షా,

ఈ రోజుల్లో కొందరు బాహాటంగానే  అర్బన్ నక్సల్స్ భాషను వినియోగించడం శోచనీయ పరిణామంవీరు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ సొంత దేశంపైనే యుద్ధం ప్రకటిస్తున్న ప్రబుద్ధులుఇటువంటి వారు రాజ్యాంగాన్ని కానీ దేశ ఐక్యతని కానీ  అర్ధం చేసుకోరు.

గౌరవ అధ్యక్షా,

జమ్ము కాశ్మీర్లద్దాక్ లు ఏడు దశాబ్దాల పాటు రాజ్యాంగ హక్కులకి నోచుకోలేదుఈ పరిణామం అటు రాజ్యాంగానికీఇటు జమ్ము కాశ్మీర్లద్దాక్ ప్రజలకూ జరిగిన అన్యాయమనే చెప్పాలిమేం  370 అధికరణం అడ్డుగోడను తొలగించినందువల్ల నేడు జమ్ము కాశ్మీర్లద్దాక్ ప్రజలు మిగతా దేశవాసులు అనుభవిస్తున్న రాజ్యాంగ హక్కులను చవిచూస్తున్నారుమాకు రాజ్యాంగం విలువ తెలుసురాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తాం కాబట్టే ఇటువంటి గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం.

గౌరవ అధ్యక్షా,

రాజ్యాంగం మనకు వివక్ష చూపే హక్కునివ్వదురాజ్యాంగం ప్రతిని జేబులో పెట్టుకుని తిరిగేవారు ముస్లిం మహిళలు ఎటువంటి సమస్యల వలయంలో జీవించేందుకు తాము కారణమయ్యారో తెలుసుకోరుముమ్మారు తలాక్ పద్ధతిని రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలకి కూడా రాజ్యాంగ హక్కులను అందించగలిగాం. వారికి సమానత్వ హక్కుని కల్పించాంఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిసారీ దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంది.  దేశాన్ని విడగొట్టేందుకు కొందరు వాడే భాష ఏమిటోవారి నిరాశా నిస్పృహలు వారిని ఏ తీరానికి చేరుస్తాయో నాకు తెలియదు కానీమా ఆలోచనలుఆశయాలుఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆలోచనల తీరుతెన్నుల గురించి మాత్రం పూర్తి స్పష్టత ఉంది. గతంలో జరిగిన విషయాలకు ప్రాముఖ్యాన్నిస్తాంచివరగా జరిగిన సంఘటనలను నెమరు వేసుకుంటాం. మహాత్మా గాంధీ అన్న మాటలను మరువంఅందువల్లే కొత్తగా ఎటువంటి మంత్రిత్వశాఖలను ప్రారంభించాలో మాకు అవగాహన ఉంది. ఇటువంటి ఆలోచనల నుంచీ ఉద్భవించిందే ఈశాన్య భారతదేశం గురించి ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖ. మా పార్టీ అనేక దశాబ్దాలబట్టి ఆస్తిత్వంలో ఉంది. అటల్ జీ వచ్చి ప్రసంగాలు ఇచ్చేంత వరకూ ఎవరికీ ఆ ప్రాంతానికి గల ప్రత్యేక అవసరాల గురించిన ఆలోచన లేకపోయిందిఎన్డీఏ గిరిజనుల కోసం కూడా ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది.

గౌరవ అధ్యక్షా,

మన దక్షిణాది రాష్ట్రాలుతూర్పు దిశలోని అనేక రాష్ట్రాలూ సముద్ర తీరాన్ని కలిగి ఉన్నాయిదాంతోమత్స్య సంబంధ కార్యకలాపాలూగంగపుత్రులూ ఆయా రాష్ట్రాల సమాజాలలో ముఖ్యమైన భాగాలుగా కనపడతాయి.  మరికొన్ని ప్రాంతాల్లో చిన్న నీటి వనరులు ఉన్నప్పటికీ సమాజంలోని అట్టడుగు వర్గాలు చేపల వేట కార్యకలాపాలలో మునిగి ఉంటారువీరందరి సంక్షేమం ఎంతో ముఖ్యమైందిఅందుకే మా ప్రభుత్వం ప్రత్యేకంగా మత్స్యశాఖను ఏర్పాటు చేసింది.

గౌరవ అధ్యక్షా,

సమాజంలోని బడుగుబలహీన వర్గాల ప్రజల్లో కూడా ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం దాగి ఉండవచ్చునైపుణ్యాభివృద్ధికి ప్రాముఖ్యాన్నిస్తేవారికి తగిన కొత్త అవకాశాలను కల్పించగలుగుతాంవారి ఆశలూ కోరికలూ వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించగలవుఇదే ఆశయంతో నైపుణ్యాభివృద్ధి కోసం కొత్తగా ఒక మంత్రిత్వశాఖను ప్రారంభించాం.  

గౌరవ అధ్యక్షా,

సామాన్య పౌరుడికి అధికారాన్ని అందించడం ప్రజాస్వామ్యం తొలి బాధ్యతఈ దిశగా దేశ సహకార రంగాన్ని మరింత బలంగా తయారు చేసేందుకుకోట్లాది భారతీయులను ఈ రంగం ద్వారా అనుసంధానించేందుకు గొప్ప అవకాశం ఉందిఅనేక రంగాలకు సహకార స్ఫూర్తిని విస్తరించే అవకాశాన్ని మేము గమనించగలిగాంఅందువల్లే సహకార మంత్రిత్వశాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాంప్రభుత్వ దూరదృష్టికి ఇదొక నిదర్శనం.

గౌరవ అధ్యక్షా,

చేపట్టిన ప్రతి పథకం కోసం 100 శాతం కృషి, 100 శాతం అమలు అనే సూత్రాలతో ముందుకు సాగుతున్నాం. 100 శాతం లబ్ధిదారులకు పథకాలను చేర్చే ప్రయత్నం చేస్తున్నాం.  అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం అందవలసిందే. రూపాయి 15 పైసల ఆట చెల్లదుకానీ కొందరు బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా పథకాలనైతే తయారు చేశారు కానీ ఆ ప్రయోజనాలను కొందరికే పరిమితం చేసిమిగతా వారిని వంచితులను చేశారు.  దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ఈ బుజ్జగింపు ధోరణికి తిలోదకాలు ఇవ్వవలసిందే!  మేము బుజ్జగింపు బాటకు బదులు నిజమైన సంతృప్తి మార్గాన్ని ఎంచుకున్నాం. ప్రతి రోజూ ఆ బాటలో ముందుకు సాగుతున్నాం.  వివక్షకు తావు లేకుండా ప్రతి సమాజానికీసమూహానికీ తమ హక్కులు అందవలసిందే. అదే తృప్తికి దారి తీస్తుంది. 100 శాతం సంతృప్తి అంటేనా దృష్టిలో సామాజిక న్యాయమేఇదే నిజమైన లౌకికవాదం..రాజ్యాంగాన్ని సంపూర్ణంగా గౌరవించడం 

గౌరవ అధ్యక్షా,
కులాన్ని గురించి మాట్లాడుతూ ఉండడం కొంత మందికి ఫ్యాషనైపోయిందిగత 30 ఏళ్లుగాసభకు వస్తున్న ఓబీసీ సముదాయానికి చెందిన ఎంపీలు పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తూ ఒక్కటై ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తిని ఇవ్వాలంటూ 30-35 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నారు.  ప్రస్తుతం కులవాదంతో ప్రయోజనాల్ని రాబట్టుకోవచ్చనే భావనతో ఉన్నవారుఆ కాలంలో ఓబీసీ సముదాయాన్ని పట్టించుకోలేదుఓబీసీ సముదాయానికి రాజ్యాంగ ప్రతిపత్తినిచ్చిందే మేంవెనుకబడిన తరగతుల (బీసీకమిషన్‌ ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలో భాగమైంది.

 

గౌరవ అధ్యక్షా,
ప్రతి రంగంలో ఎస్‌సీఎస్‌టీఓబీసీలకు గరిష్ఠ స్థాయిలో అవకాశాల్ని అందించే దిశగా మేం చాలా పక్కాగా పనిచేశాం.  ఈ రోజుఈ  సభాముఖంగానేను దేశ ప్రజల సమక్షంలో ఒక ప్రధాన ప్రశ్న వేయదలచుకొన్నాస్పీకర్ గారునా ఈ ప్రశ్న గురించి దేశ ప్రజలు తప్పక ఆలోచిస్తారనిదీని గురించి నలుగురూ కలిసి చర్చించుకొంటారని కూడా నేననుకొంటున్నానుఎవరైనా దయచేసి నాకు చెబుతారాఒకే కుటుంబంలో నుంచి ముగ్గురు ఎస్‌సీ ఎంపీలు ఏక కాలంలో పార్లమెంటులో ఉన్నారాఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఎస్‌సీ ఎంపీలంటూ ఎప్పుడైనా అసలు ఉన్నారంటారా?   నేను మరో ప్రశ్న కూడా అడగాలనుకుంటున్నాదయచేసి ఎవరైనా నాతో చెబుతారా.. ఒకే కాలంలోఅదే సమయంలో ఎస్‌టీ ఎంపీలు అది కూడా ఒకే కుటుంబంలోని వారు పార్లమెంట్లో ఉన్నారంటారా?

గౌరవ అధ్యక్షా,
కొంతమంది మాట్లాడే మాటలకుప్రవర్తనకు మధ్య ఎంత తేడా ఉంటుందో.  నేను అడిగిన ఒక ప్రశ్నకు ఇచ్చిన జవాబులో తెలిసిపోయిందితేడా నేలకునింగికి మధ్య ఉన్నంత ఉంటుందిరాత్రికిపగలుకు మధ్య ఉన్నంత తేడా ఉంటుంది.

గౌరవ అధ్యక్షా,
మేం ఎస్‌సీఎస్‌టీ సమాజానికి ఏ విధంగా సాధికారతను  కల్పిస్తున్నామంటేగౌరవ అధ్యక్షాసమాజంలో ఉద్రిక్తతను సృష్టించకుండాఐక్యతాస్ఫూర్తిని నిలబెడుతూ ఈ పనిని చేస్తున్నాంసమాజంలో ఆదరణకు నోచుకోకుండా ఉండిపోయిన వర్గాల వారి సంక్షేమానికి ఎలా పాటుపడవచ్చో అనే విషయంలో ఒక ఉదాహరణను నేను మీ దృష్టికి తీసుకువస్తాను. 2014కుముందుమన దేశంలో 387 వైద్య కళాశాలలుంటేఇవాళ 780 వైద్య కళాశాలలు నడుస్తున్నాయిప్రస్తుతం వైద్య కళాశాలల సంఖ్యతోపాటు  సీట్లు కూడా పెరిగాయిగౌరవ అధ్యక్షాఇది చాలా ముఖ్యమైన కోణం,  ఈ కారణంగానే కళాశాలలు పెరిగాయి కాబట్టి సీట్లు కూడా ఎక్కువయ్యాయి. 2014కు ముందుమన దేశంలో ఎస్‌సీ విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు 7,700 ఉన్నాయిమేం అధికారంలోకి రావడాని కన్నా ముందుదళిత సమాజానికి చెందిన 7,700 మంది యువతీయువకులకు వైద్యులయ్యేందుకు అవకాశం ఉండిందిమేం 10 ఏళ్ల పాటు కృషిచేశాం.. ఈ రోజు ఈ సంఖ్య పెరిగిఎస్‌సీ సమాజంలో 17,000 మంది ఎంబీబీఎస్ డాక్టర్లుగా ఎదగడానికి తగిన ఏర్పాట్లు చేశాంఎక్కడ 7,700, ఎక్కడ 17,000; అదీనూ దళిత సమాజంలోదళితులకు ఏదైనా సంక్షేమచర్యల్ని చేపట్టాలంటేసమాజంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండాఒకరంటే మరొకరికి గౌరవాన్ని పెంచుతూ వెళ్ళాలి.  

గౌరవ అధ్యక్షా,
2014 
కు ముందు ఎస్‌టీ విద్యార్థుల కోసం ఎంబీబీఎస్ సీట్లు 3,800 ఉండేవిప్రస్తుతం వీటి సంఖ్య సుమారు 9,000కు చేరుకొంది. 2014 కన్నా వెనుకటి కాలంలో ఓబీసీ విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఎంబీబీఎస్ సీట్లు 14,000 కన్నా తక్కువ– నేను మరోసారి చెబుతున్నా– 14,000 కన్నా తక్కువగా ఉన్నాయిఈ రోజు ఈ సీట్ల సంఖ్య దాదాపుగా 32,000 కి చేరిందిఓబీసీ సమాజానికి చెందినవారు 32,000 మంది ఎంబీబీఎస్ డాక్టర్లవుతారు.

గౌరవ అధ్యక్షా,
గడచిన 10 సంవత్సరాల్లో ప్రతి వారం ఒక కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటైందిప్రతి రోజూ ఒక కొత్త ఐటీఐ వెలిసిందిప్రతి రెండు రోజులలో ఒక కొత్త కాలేజీ వచ్చిందిఆలోచించండిఎస్‌సీఎస్‌టీఓబీసీ.. ఈ వర్గాల యువతను దృష్టిలో పెట్టుకొని ఎంతటి వృద్ధి చోటుచేసుకొందో మీరు ఇట్టే అంచనా వేయగలుగుతారు.

గౌరవ అధ్యక్షా,
మేం ప్రతి పథకాన్నీ శ్రద్ధతో అమలుచేస్తున్నాంఆ పథకం లాభాలు 100 శాతం మేర అందించే దిశలో వాటిని అమలు చేయడంలో వాటి లబ్ధిదారుల్లో ఏ ఒక్కరినీ వదలిపెట్టకుండా ఉండాలి.. ఈ దిశలో  మేం పనిచేస్తున్నాంఎవరికైతే హక్కు ఉందో వారికి ఆ హక్కు లభించాలిపథకమంటూ ఉంటే– ఆ పథకం ప్రయోజనాన్ని పొందే హక్కుదారయితే– అలాంటి వ్యక్తికి ప్రయోజనం లభించాల్సిందేఒక రూపాయిలో 15 పైసలు అనే ఆట ఇక సాగబోదుఅయితే కొంతమంది ఏం చేశారంటేనమూనానే అలా తయారు చేశారు.. కొందరికే ఇవ్వడమూఇతరులు బాధపడేటట్టు చేయడమూనుఅలా చేసి తృప్తిపరిచే రాజకీయాల్ని నడపడం అన్నమాటదేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దాలంటేఈ తరహా తృప్తిపరిచే రాజకీయాలను వదిలించుకోవాలిమేం ఒక మార్గాన్ని ఎంచుకొన్నాంఅదే– సంతృప్తి పరచే విధానంఅంతేగాని తృప్తిపరచేది కాదుమరి ఈ దోవలో,  ముందుకు సాగుతున్నాం మేంప్రతి ఒక్క సముదాయానికి చెందిన వారికిప్రతి ఒక్క వర్గానికి చెందిన వారికిఎలాంటి భేదభావాలకు తావివ్వకుండాహక్కును కలిగి ఉన్నవారికి ఆ హక్కు లభించాలిఇదే సంతృప్తిపరచే విధానంమరి నా లెక్కల్లో ఎప్పుడైతే నేను 100 శాతం ప్రయోజనాల్ని గురించి ప్రస్తావిస్తున్నానోదానికి అర్థం సిసలైన సామాజిక న్యాయాన్ని అందించడమన్నమాటఇదే నిజానికి సెక్యులరిజంనిజమైన అర్థంలో రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే ఇదీ.

గౌరవ అధ్యక్షా,
ప్రతి ఒక్కరికీ మంచి ఆరోగ్యం దక్కాలి అనేదే రాజ్యాంగంలో పొందుపర్చుకున్న భావనఈ రోజు కేన్సర్ డేఇవాళఆరోగ్యాన్ని గురించి దేశంలోనూప్రపంచ వ్యాప్తంగానూ చాలా చర్చలు జరుగుతున్నాయిఅయితే పేదలకువయోవృద్ధులకు ఆరోగ్య సేవలను అందించడంలో కొంత మంది అడ్డంకుల్ని సృష్టిస్తున్నారుఅది కూడా తమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనిఇవాళ దేశంలో 30,000 ఆసుపత్రులుచక్కటి ప్రత్యేక సేవల్ని అందిస్తున్న ఆసుపత్రులూ ‘ఆయుష్మాన్ భారత్’తో ముడిపడ్డాయికానీ కొన్ని రాజకీయ పక్షాలువాటి సంకుచిత మానసిక దృక్పథం కారణంగాచెడు రాజకీయాల కారణంగా– పేదలుకేన్సర్ రోగులు ఈ ఆసుపత్రుల్లోకి వెళ్లకుండా– ఈ ఆసుపత్రుల తలుపుల్ని మూసేయించాయిఇటీవలప్రజారోగ్య పత్రిక లాన్సెట్ నిర్వహించిన ఒక అధ్యయనం ఆయుష్మాన్ పథకంలో కేన్సర్‌ చికిత్స సకాలంలో మొదలవుతోందని తేల్చి చెప్పిందికేన్సర్‌ను గుర్తించే విషయంలో ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉందిఎందుకు అంటే– గుర్తించడం ఎంత త్వరగా జరిగితే అంత త్వరగానూ– చికిత్సను మొదలుపెట్టవచ్చుకేన్సర్ బారిన పడే రోగిని మనం కాపాడవచ్చుఈ ఖ్యాతి ఆయుష్మాన్ పథకానిదని లాన్సెట్ చెప్పింది.  ఈ దిశగా భారత్‌లో చాలా కృషి జరిగిందని కూడా లాన్సెట్ పేర్కొంది.

గౌరవ అధ్యక్షా,
ఈసారి బడ్జెటులోనూ కేన్సర్ మందులు చౌకగా దొరికేటట్లుగా ఒక చాలా ముఖ్యమైన నిర్ణయాన్ని మేం తీసుకున్నాంఇదొక్కటే కాదురాబోయే కాలంలో మరో ముఖ్య నిర్ణయాన్ని తీసుకొంటాంమరి ఈ రోజు కేన్సర్ డే కాబట్టి ఈ నిర్ణయంతో కలిగే లాభాన్ని గౌరవనీయ ఎంపీలు వారి ప్రాంతాల్లోని ఈ తరహా రోగుల్ని దృష్టిలో పెట్టుకొని  వినియోగించుకోవాల్సిందిగా (ఎంపీలకునేను చెప్పి తీరాలనుకొంటున్నానుసరిపడా  ఆసుపత్రులు లేవు కాబట్టి బయటి నుంచి వచ్చే రోగులకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయిఈ విషయంలో 200 డే కేర్ సెంటర్లను నిర్మించాలని ఈ బడ్జెటులో ఓ నిర్ణయం తీసుకొన్నాంఈ డే కేర్ సెంటర్లు రోగితోపాటు ఆ రోగి కుటుంబానికి సైతం ఎంతో ఊరటను కలిగిస్తాయి.

గౌరవ అధ్యక్షా,
రాష్ట్రపతి ప్రసంగాన్ని చర్చించేటప్పుడువిదేశాంగ విధానాన్ని గురించి కూడా చర్చించాం.  కొంతమంది అనుకుంటారు.. వారు విదేశాంగ విధానాన్ని గురించి చర్చించలేదూ అంటే గనక తాము పరిణతి చెందిన వారం కాదన్నట్లుగా భావించుకొంటారుఅందుకనివారు విదేశాంగ విధానాన్ని గురించి మాట్లాడాల్సిందే– అది దేశానికి నష్టం కలిగించేది అయినా సరే– అని ఆలోచిస్తారుఅలాంటి వారికి నేను చెప్పాలనుకుంటున్నావారికి విదేశాంగ విధానం అంశంపైన నిజంగానే ఆసక్తి ఉంటేవారు దాన్ని అర్థం చేసుకోవాలని అనుకున్నట్లయితేరాబోయే కాలంలో ఏదయినా చేయాలి అని అనుకుంటూ ఉంటే– నేనీ మాటల్ని శశి గారి కోసం చెప్పడం లేదు–  మరి ఈ కారణంగా ఆ తరహా వ్యక్తులకు నేను చెప్పదలుచుకొన్నాను.. వారు తప్పక ఒక పుస్తకాన్ని చదవాలి అనిఆ పనిని చేశారంటేబహుశా వారు ఎప్పుడు ఏం మాట్లాడాలో గ్రహించగలరుఆ పుస్తకం పేరు జేఎఫ్‌కేస్ ఫర్గాటెన్ క్రైసిస్దీనిలో జేఎఫ్ కెన్నెడీని గురించి రాశారుఈ పుస్తకాన్ని రాసింది ఓ ప్రఖ్యాత విదేశాంగ విధాన పండితుడుదీనిలో ముఖ్య సంఘటనలను గురించిన ప్రస్తావన ఉందిఈ గ్రంథం భారత్ తొలి ప్రధానిని గురించి కూడా వివరిస్తుందిఆయన విదేశాంగ విధానానికి సైతం సారథ్యం వహించారు.  పండిత్ నెహ్రూకుఅప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్కేన్‌కు మధ్య జరిగిన చర్చల్నితీసుకున్న నిర్ణయాల్ని గురించిన ప్రతి ఒక్క విషయాన్నీ ఈ పుస్తకం సమగ్రంగా తెలియజేసిందిదేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న కాలంలోఆ సమయంలో విదేశాంగ విధానం పేరిట ఏ తరహా ఆట సాగిందో ప్రస్తుతం ఈ పుస్తకం ద్వారా వెలుగులోకి వస్తోందిఅందుకనే నేను చెబుతున్నాదయచేసి ఈ పుస్తకాన్ని చదవండని.  

గౌరవ అధ్యక్షా,
రాష్ట్రపతి గారి ప్రసంగం ముగిసిన తరువాతఒక మహిళా రాష్ట్రపతి గారుఓ పేద కుటుంబాన్నుంచి వచ్చిన పుత్రిక.. ఆమెను గౌరవించ లేం అంటే అది మీ ఇష్టంకానీఆమెను ఏమేం మాటలంటూ అగౌరవం పాల్జేస్తున్నారోనేను రాజకీయాల్లో ఆశాభంగాన్నినిరుత్సాహాన్ని అర్థం చేసుకోగలనుఅయితే ఒక రాష్ట్రపతికి వ్యతిరేకంగా నడుచుకోవడానికి ఏమిటి కారణందీనికి కారణమేంటి.

గౌరవ అధ్యక్షా,
ఈ తరహా వికృత మానసిక భావననుఆలోచన విధానాన్ని వెనుకపట్టుననే విడిచిపెడుతూమహిళల నాయకత్వంలో అభివృద్ధిని సాధిస్తూ ఆధునిక భారత్ ముందుకు సాగిపోతోందిజనాభాలో సగం మందికి పూర్తి అవకాశాలు చిక్కితే మన దేశం రెట్టింపు వేగంతో పురోగమించగలుగుతుందిఇది నా నమ్మకం.  ఈ రంగంలో 25 సంవత్సరాల పాటు పనిచేసిన తరువాత నా ఈ నమ్మకం మరింతగా బలపడింది.

గౌరవ అధ్యక్షా,
గత పదేళ్లలో, 10 కోట్ల మంది మహిళలు కొత్తగా స్వయంసహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీస్)లో చేరారుఈ మహిళలు ఆదరణకు నోచుకోని వర్గాలకు చెందిన వారుఈ మహిళలు గ్రామీణ నేపథ్యాల నుంచి వచ్చిన వారుసమాజంలో కింది స్థాయిలో ఉన్న ఈ మహిళల బలం పెరిగివారి సామాజిక హోదా కూడా మెరుగైందిప్రభుత్వం వారికి అందిస్తున్న సహాయాన్ని రూ.20 లక్షలకు పెంచిందిదీనిని అందుకొని వారు ముందంజ వేయగలగాలివారికిచ్చే పని పరిధినివారు నిర్వహించే కార్యకలాపాల స్థాయిని పెంచే దిశగా మేం కృషి చేస్తున్నాంమరి ప్రస్తుతం ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపిస్తోంది.

గౌరవ అధ్యక్షా,
రాష్ట్రపతి తమ ప్రసంగంలో లఖ్‌పతి దీదీ అభియాన్‌ను గురించి చర్చించారుమూడో సారి మా ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇంతవరకు నమోదు చేసిన సమాచారాన్ని బట్టి చూస్తేసుమారు 50 లక్షల మందికి పైగా ‘లఖ్‌పతి దీదీస్’ (లక్షాధికారి సోదరీమణుల)ను గురించిన సమాచారాన్ని మేం అందుకొన్నాంనేను ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోవడాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి ఇంతవరకు దాదాపు 1.25 కోట్ల మంది మహిళలు లఖ్‌పతి దీదీలుగా మారారుమేం కోట్ల మంది మహిళలను లఖ్‌పతి దీదీలుగా ఎదిగేటట్టు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నాందీనిని సాధించడానికితగిన ఆర్థిక కార్యక్రమాలకు ప్రాధాన్యాన్నిస్తాం.

గౌరవ అధ్యక్షా,
ప్రస్తుతందేశంలో చాలా గ్రామాల్లో డ్రోన్ దీదీ (డ్రోన్ సోదరీమణిఅంశాన్ని చర్చించుకొంటున్నారుపల్లెల్లో మనస్తత్వం పరంగా ఒక మార్పు వచ్చిందిఒక మహిళ డ్రోన్‌ను పట్టుకొని దానిని నడుపుతున్నారుఆ పనిని చేస్తున్న మహిళల విషయంలో పల్లెవాసుల ఆలోచనల్లోనూ మార్పు వస్తోందిఇవాళ నమో డ్రోన్ దీదీ పొలాల్లో పనిచేస్తూలక్షల రూపాయల్ని సంపాదించడం మొదలుపెట్టిందిముద్ర యోజన కూడా మహిళలకు సాధికారతను కల్పించడంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తోందికోట్ల కొద్దీ మహిళలు మొట్టమొదటిసారి ముద్ర యోజన సాయంతో పరిశ్రమలో అడుగుపెట్టిపారిశ్రామికవేత్తల పాత్రను పోషిస్తున్నారు.

గౌరవ అధ్యక్షా,
కోట్ల కుటుంబాలకు ఇచ్చిన ఇళ్లలో దాదాపుగా 75 శాతం ఇళ్ల యాజమాన్య హక్కు మహిళల చేతుల్లోనే ఉంది.

గౌరవ అధ్యక్షా,
ఈ మార్పు 21వ శతాబ్దంలో ఒక బలమైన భారత్‌కు పునాదిని వేస్తోందిగౌరవనీయులైన సభాపతి గారూఅభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం గ్రామీణ ఆర్థిక వ్యవస్థేగ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయకుండా అభివృద్ధి చెందిన భారత్‌ దిశగా మనం అడుగులు వేయలేంఈ కారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోని ప్రతి ఒక్క రంగాన్ని బాగుపరిచే ప్రయత్నాలు మేం చేశాంగ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం కీలకం అనే విషయం మాకు తెలిసిన విషయమేఅభివృద్ధి చెందిన భారత్‌కు నాలుగు మూలస్తంభాల్లోనూ మన రైతులు ఒక స్తంభంగా ఉంటున్నారుగత పది సంవత్సరాల్లోవ్యవసాయానికి బడ్జెటును పది రెట్లు పెంచాం. 2014 తరువాతి కాలాన్ని గురించి మీకు తెలియజేయనివ్వండి నన్ను..  ఇది చాలా విశేషమైన పురోగతే.

గౌరవ అధ్యక్షా,

2014కి ముందు యూరియా అడిగినందుకు లాఠీచార్జీ చేసిన వారుఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారుఆ సమయంలో ఎరువుల కోసం రాత్రంతా క్యూలో నిలబడాల్సిన పరిస్థితులు ఉండేవిరైతుల పేరు మీద ఎరువులు విడుదలైనా అవి పొలాల వరకు చేరుకొనేవి కావుమరెక్కడో నల్లబజారులో రూపాయి 15 పైసల చేతివాటం ఆటలు సాగుతూ ఉండేవిప్రస్తుతం రైతులందరికీ అవసరమైనంత మేర ఎరువులు అందుతున్నాయికొవిడ్ సంక్షోభం సమయంలో మొత్తం సరఫరా వ్యవస్థ అంతా దెబ్బతిందిఅంతర్జాతీయంగా వాటి ధరలు అసమంజసమైన రీతిలో పెరిగిపోయాయిమనం యూరియూ దిగుమతులపైనే ఆధారపడి ఉండటం వల్ల దాని ప్రభావం మనపై ఎక్కువగా పడిందిఇప్పుడు యూరియా బస్తా ధర రూ.3,000. కానీ భారత ప్రభుత్వం రైతులకు రూ.300 కంటే తక్కువకే యూరియా బస్తాను అందిస్తోందిమిగిలిన మొత్తాన్ని కేంద్రమే భరిస్తోందిరైతులకు గరిష్ట ప్రయోజనాలు దక్కేలా మేం నిరంతరాయంగా పనిచేస్తున్నాం.

గౌరవ అధ్యక్షా,

రైతులకు తక్కువ ధరలకే ఎరువులు అందించేందుకు గాను గత పదేళ్లలో రూ.12 లక్షల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందిపీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా సుమారుగా రూ.3.5 లక్షల కోట్లను నేరుగా రైతుల ఖాతాలకు బదిలీ చేశాంఅలాగే గతంలో మునుపెన్నడూ లేని విధంగా దశాబ్ధకాలంలోనే పంటలకు కనీస మద్ధతు ధర (ఎంఎస్‌పీ)ను రికార్డు స్థాయిలో పెంచి మూడు రెట్లు ఎక్కువగా సేకరించాంరైతులు తక్కువ వడ్డీకే సులభంగా రుణాలు పొందుతున్నారుఇవి మూడు రెట్లు ఎక్కువగా పెరిగాయిగతంలో ప్రకృతి వైపరీత్యాలు ఎదురైతే ఆ నష్టాన్ని పూర్తిగా రైతులే భరించాల్సి వచ్చేదిమా ప్రభుత్వ హయాంలో పీఎం ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు రెండు లక్షల కోట్ల రూపాయలు అందించాం.

గౌరవ అధ్యక్షా,

గడచిన దశాబ్దంలో నీటిపారుదల రంగంలో మునుపెన్నడూ లేని విధంగా అసాధారణ రీతిలో చర్యలు తీసుకున్నాందురద‌ృష్టవశాత్తూ రాజ్యాంగం గురించి మాట్లాడేవారికి దీనిపై అంతగా అవగాహన లేదునీటి ప్రాజెక్టులపై డాబాబాసాహెబ్ అంబేద్కర్‌కు స్పష్టమైనసమగ్రమైనసమ్మిళితమైన ఆలోచనలను ఉన్నాయని మన దేశంలో అతి కొద్ది మందికి మాత్రమే తెలుసుఆయన ఆలోచనలు ఈనాటికీ మనల్ని చైతన్యం చేస్తున్నాయిదశాబ్దాలుగా నిలిచిపోయిన 100 నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పనులను పూర్తి చేసేందుకు మేం ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించాంతద్వారా పొలాలకు నీరు అందుతుందినదుల అనుసంధానం బాబా సాహెబ్ అంబేద్కర్ కలఈ విధానాన్ని ఆయన సమర్థించేవారుఏళ్లుదశాబ్దాలు గడిచిపోయినా ఈ విషయంలో ఏమీ జరగలేదుఈ రోజు మేం కెన్బెత్వాపార్వతికాలీసింధ్చంబల్ అనుసంధాన ప్రాజెక్టులను ప్రారంభించాంగుజరాత్‌లో ఇలా నదుల అనుసంధానం ద్వారా అంతరించిపోయిన అనేక నదులను విజయవంతంగా పునరుద్ధరించిన అనుభవం నాకు ఉంది.

గౌరవ అధ్యక్షా,

ఇది దేశంలోని ప్రతి పౌరుడి కలగా మారాలిప్రపంచంలోని ప్రతి డైనింగ్ టేబుల్ మీద మేడ్ ఇన్ ఇండియా ఆహారపు పొట్లాలు ఉండటం మన అందరి లక్ష్యం కావాలిఇప్పుడు భారత్‌లో తయారైన టీతో పాటు కాఫీ సైతం తన పరిమళాలను ప్రపంచవ్యాప్తంగా వెదజల్లుతోందిఈ విషయంలో నేను చాలా సంతోషిస్తున్నానుఇది మార్కెట్లో సంచలనం సృష్టిస్తోందికొవిడ్ తర్వాత మన పసుపునకు సైతం డిమాండ్ బాగా పెరిగింది.

గౌరవ అధ్యక్షా,

శుద్ధి చేసిన సముద్రఆహారంబీహార్ మఖానాను భవిష్యత్తులో ప్రపంచం మొత్తం చేరుకోవడం మీరు చూస్తారుఇది ఎప్పుడుఎలా జరుగుతుందో తెలియక కొంతమంది కలత చెందుతున్నారుమన చిరుధాన్యం శ్రీఅన్న కూడా ప్రపంచ మార్కెట్లో భారత్ ప్రతిష్ఠను మరింత పెంచుతుంది.

గౌరవ అధ్యక్షా,

అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణం కోసం భవిష్యత్తుకు తగినట్టుగా రూపుదిద్దుకున్న నగరాలు చాలా అవసరంమన దేశం పట్టణీకరణ దిశగా వేగంగా ముందుకు సాగుతోందిదీన్ని మనం సవాలుగా పరిగణించాలి కానీ సంక్షోభంలా కాదుదీన్ని అవకాశంగా స్వీకరించి ఆ దిశగా మనం పనిచేయాలిమౌలిక వసతుల అభివృద్ధి అవకాశాల విస్తరణకు దారి తీస్తుందిరవాణా అనుసంధానం ఎక్కడ పెరుగుతుందో అక్కడ అవకాశాలు విస్తరిస్తాయిఢిల్లీయూపీని కలుపుతున్న మొట్ట మొదటి నమో రైలును ప్రారంభించి అందులో ప్రయాణించే అవకాశం నాకు దక్కిందిఇలాంటి సదుపాయాలు దేశంలో అన్ని ప్రధాన నగరాలకు విస్తరించాలిఇదే రాబోయే రోజుల్లో మన అవసరంమన నడవాల్సిన మార్గం కానుంది.

గౌరవ అధ్యక్షా,

ఢిల్లీలో మెట్రో వ్యవస్థ రెట్టింపు స్థాయిలో పెరిగిందిద్వితీయతృతీయ శ్రేణి నగరాలకు సైతం మెట్రో వ్యవస్థ విస్తరించిందిప్రస్తుతం మన దేశంలో మెట్రో వ్యవస్థ 1000 కి.మీ మేర విస్తరించడం మనందరికీ గర్వకారణంమరో వెయ్యి కి.మీ.ల పనులు జరుగుతున్నాయిఅంటే మనం చాలా వేగంగా అభివృద్ధి సాధిస్తున్నామని అర్థం.

గౌరవ అధ్యక్షా,

కాలుష్యాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందిదేశంలో 12వేల విద్యుత్ బస్సులను నడపడం ప్రారంభించాంఢిల్లీకి కూడా మేం వాటిని అందించాం.

గౌరవ అధ్యక్షా,

మన దేశంలో కాలానుగుణంగా ఒక నూతన ఆర్థికవ వ్యవస్థ విస్తరిస్తోందిప్రస్తుతం ప్రధాన నగరాల్లో గిగ్ ఎకానమీ బాగా విస్తరిస్తోందిలక్షల మంది యువకులు వాటిలో చేరుతున్నారుఈ తరహా కార్మికులుగిగ్ వర్కర్లు ఈశ్రామ్ పోర్టల్లో నమోదు చేసుకుని ధ్రువీకరణ పొందాలిఈ కొత్తతరం సేవా ఆర్థిక వ్యవస్థలో వారికి ఏవిధమైన సాయం చేయాలన్నా వారు ఈ–శ్రామ్ పోర్టల్ ద్వారా వారు గుర్తింపు కార్డు పొందాలిఅలాగే గిగ్ వర్కర్లకు ఆయుష్మాన్ యోజన ప్రయోజనాలు కూడా లభిస్తాయితద్వారా గిగ్ వర్కర్లు సరైన దిశలో ప్రయాణించగలుగుతారుప్రస్తుత అంచనాల ప్రకారం దేశంలో సుమారు కోటి మంది గిగ్ వర్కర్లు ఉన్నారువారి సంక్షేమం కోసం మేం పనిచేస్తున్నాం.

గౌరవ అధ్యక్షా,

ఎంఎస్ఎంఈ రంగం అపారమైన ఉద్యోగావకాశాలు తీసుకువస్తుందిఈ రంగానికి విస్తృత స్థాయిలోఉపాధి కల్పించే సామర్థ్యం ఉందిఈ చిన్నతరహా పరిశ్రమలు స్వయం సమృద్ధి సాధించిన భారత్‌కు ప్రతీకలుదేశ ఆర్థికవ్యవస్థకు ఎంఎస్ఎంఈ రంగం బృహత్ స్థాయిలో సహకారం అందిస్తోందిమా విధానం చాలా స్పష్టంగాసరళంగాసులభంగాఉద్యోగ కల్పన చేసే ఎంఎంస్ఎంఈ రంగాన్ని ప్రోత్సాహించేలా ఉందిఅందుకే ఈ సారి మేం తయారీ రంగంపై దృష్టి సారించాంమొత్తం తయారీ రంగాన్ని అంటే ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయబోతున్నాంవాటిని అభివృద్ధి చేయడం ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తాంయువతలో నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగాలకు తగినట్టుగా సిద్ధం చేస్తాంఎంఎస్ఎంఈ రంగాన్ని మెరుగుపరిచేందుకు మేం అనేక అంశాలపై పనిచేయడం ప్రారంభించాంఎంఎస్ఎంఈల ఏర్పాటుకు అవసరమైన నిబంధనలను 2006లో రూపొందించారుకానీ వాటిని సవరించలేదుగత పదేళ్లలో వీటిని రెండు సార్లు సవరించడానికి మేం ప్రయత్నించాంఈసారి ఈ విషయంలో మేం చాలా పెద్ద మార్పులు తీసుకొచ్చాంమొదటిసారి 2020లోరెండోసారి ఈ బడ్జెట్లో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నాంవాటికి అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాం.

సరైన ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవడమే ఎంఎస్ఎంఈల ముందు ప్రస్తుతం ఉన్న సవాలుకొవిడ్ సంక్షోభంలోఎంఎస్ఎంఈలపై ప్రత్యేక దృష్టి సారించాంబొమ్మల పరిశ్రమకు సైతం మేం ప్రత్యేక ప్రాధాన్యమిచ్చాంవస్త్ర పరిశ్రమపై కూడా ప్రత్యేక దృష్టి సారించి నగదు కొరత లేకుండా ఎలాంటి హామీ లేకుండా రుణాలు అందించాంవేలాది సంస్థల్లో లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు సృష్టించిఉద్యోగ భరోసా కల్పించాం.

సులభతర వ్యాపారాలను ప్రోత్సహించేలా చిన్న పరిశ్రమలకు అందించే కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డులుక్రెడిట్ గ్యారంటీ కవరేజీల అంశంలో మేం చర్యలు తీసుకున్నాంఅనవసరమైన నియమాలను తొలగించి వారిపై పరిపాలనా భారాన్ని తగ్గించాంగతంలో పని పూర్తి చేసుకోవడం కోసం ఒకరిద్దరికి డబ్బులు చెల్లించాల్సి వచ్చేదిఇప్పుడు అది కూడా ఆగిపోయిందిఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడానికి కొత్త విధానాలు రూపొందించామని తెలిస్తే మీరు సంతోషిస్తారు. 2014కు ముందు మనం ఆటబొమ్మలను దిగుమతి చేసుకొనేవాళ్లంకానీ ఇప్పుడు నా దేశంలోని బొమ్మలు తయారుచేసే చిన్న పరిశ్రమలు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయిదీంతో దిగుమతుల్లో భారీ తగ్గుదల కనిపించిందిఈ విషయాన్ని నేను గర్వంగా చెప్పగలనుఈ ఎగుమతులు దాదాపుగా 239 శాతం మేర పెరిగాయిఎంఎస్ఎంఈలు నిర్వహిస్తున్న అనేక రంగాలు ప్రపంచవ్యాప్తంగా తమదైన ముద్ర వేస్తున్నాయిమేడిన్ ఇండియా దుస్తులుఎలక్ట్రానిక్స్ఎలక్ట్రికల్ వస్తులు ఇతర దేశాల జీవితాల్లో భాగమవుతున్నాయి.

గౌరవ అధ్యక్షా,

అభివృద్ధి చెందిన భారత్ అనే కలను సాకారం చేసే దిశగా గొప్ప ఆత్మ విశ్వాసంతో భారత్ ముందుకు సాగుతోందిఅభివృద్ధి చెందిన భారత్ అనేది కేవలం ప్రభుత్వ లక్ష్యం మాత్రమే కాదుఈ దేశంలోని 140 కోట్ల మంది ప్రజల కలఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ తమ శక్తిని ధారపోయాలిదీనికి ప్రపంచంలో ఎన్నో ఉదాహరణలున్నాయి. 20-25 ఏళ్ల వ్యవధిలో అభివృద్ధి సాధించవచ్చని ఈ ప్రపంచంలోని చాలా దేశాలు నిరూపించాయిభారత్‌కు చాలా శక్తి ఉందిమనకు జనాభాప్రజాస్వామ్యండిమాండ్ ఉన్నాయిమరి మనం ఎందుకు దాన్ని సాధించలేంమన దేశం స్వాతంత్ర్యం పొంది 100 ఏళ్లు పూర్తి చేసుకునే 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందనే ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు సాగాలి.

గౌరవ అధ్యక్షా,

మనం చాలా పెద్ద లక్ష్యాలను సాధించాల్సి ఉందివాటిని సాధిస్తాం కూడాఅధ్యక్షా ఇది మా మూడో విడత పాలన మాత్రమేదేశం అవసరానికి అనుగుణంగా ఆధునిక భారతాన్నిసామర్థ్యమున్న భారతాన్ని నిర్మించడానికిఅభివృద్ధి చెందిన భారత్ అనే కలను సాకారం చేయడానికి రానున్న కాలంలో మేం అంకిత భావంతో పనిచేస్తాం.

గౌరవ అధ్యక్షా,

అన్ని పార్టీలకునాయకులకుదేశ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నారుప్రతి ఒక్కరికీ సొంత రాజకీయ సిద్ధాంతాలు ఉంటాయిసొంత రాజకీయ కార్యక్రమాలు ఉంటాయికానీ ఏదీ దేశం కంటే పెద్దది కాదుఅన్నింటి కంటే దేశమే ప్రధానంఇది 140 కోట్ల మంది దేశ పౌరుల కలఈ సభలో కూర్చున్న ప్రతి పార్లమెంటు సభ్యుడి కల అయిన అభివృద్ధి చెందిన భారత్‌ను అందరూ కలసి సాకారం చేసుకుందాం.

గౌరవ అధ్యక్షా,

రాష్ట్రపతి ప్రసంగానికి నా క‌ృతజ్ఞతలు తెలియజేస్తూనే మీకుఈ సభకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానుధన్యవాదాలు!

 సూచనపీఎం హిందీలో చేసిన ప్రసంగానికి ఇంచుమించుగా చేసిన తెలుగు అనువాదం.

 

***