ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , అహ్మదాబాద్లోని నవభారత్ సాహిత్య మందిర్ ఏర్పాటుచేసిన కలామ్ నో కార్నివాల్ పుస్తక ప్రదర్శన ఉత్సవాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారినుద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి కలం నో కార్నివాల్ పుస్తక మహోత్సవ ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలుతెలిపారరు.అహ్మదాబాద్ నవభారత్ సాహిత్య మందిర్ ప్రారంభించిన పుస్తకమహోత్సవ సంస్కృతి పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాలు ఏటికేడాది అద్భుతంగా సాగుతుండడంపట్ల ఆనందం వ్యక్తం చేశారు.పుస్తక మహోత్సవం కొత్త, యువ రచయితలకు ఒక అద్భుత వేదికగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. అంతేకాకుండా ఇది గుజరాత్ సాహిత్యాన్ని విజ్ఞానాన్ని మరింత ముందుకు తీసుకువెళుతున్నదన్నారు. ఈ గొప్ప సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న నవభారత్ సాహిత్య మందిర్ సభ్యులను అభినందించారు.
కలం నో కార్నివాల్ అనేది భారీ పుస్తకమహోత్సవమని ఇందులో హిందీ , ఇంగ్లీషు, గుజరాతి భాషలకు చెందిన గ్రంథాలు ఉన్నాయన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు , రాష్ట్రప్రభుత్వం వాంచే గుజరాత్ ప్రచారాన్ని ప్రారంభించిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారరు. ఇవాళ కలం నో కార్నివాల్ గుజరాత్ సంకల్పాన్ని మరింత ముందుకు తీసుకుపోతున్నదని అన్నారు.పుస్తకాలు, గ్రంథాలు మన విద్యాఉపాసనకు మౌలిక అంశాలని ప్రధానమంత్రి గుర్తుచేస్తూ, గుజరాత్లో అత్యంత ప్రాచీన గ్రంథాలయ సంస్కృతి విలసిల్లింది అని అన్నారు. వడొదరా మహారాజ శాయాజీరావు గైక్వాడ్ జి ఈప్రాంతంలోని అన్ని గ్రామాలలో లైబ్రరీలను ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. గొండాల్ కు చెందిన మహారాజ భగవత్ సింగ్జి భగవత్ గోమండల్ పేరుతో బృహత్ పదకోశాన్ని రూపొందించారనిప్రధానమంత్రి గుర్తుచేశారరు. అలాగే వీరుల కవిత్వం నర్మద్ను నార్మ కోష్ పేరుతో ఎడిట్ చేశారన్నారు. గుజరాత్ వారసత్వం చరిత్ర, పుస్తకాలు, రచయితలు,సాహిత్యసృజనతో సుసంపన్నమైనదని ప్రధానమంత్రి అన్నారు. ఇలాంటి పుస్తక ప్రదర్శనులు గుజరాత్ లోని మారుమూల ప్రాంతాలకు చేరాలని, ప్రత్యేకించి యువతకు చేరాలని తద్వారా వారు గొప్ప చరిత్రను తెలుసుకుని ప్రేరణ పొందడానికి వీలు కలుగుతుందని ప్రధానమంత్రి చెప్పారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా పుస్తక ప్రదర్శన జరుగుతున్న విషయాన్ని ప్రధానమంత్రి అందరి దృష్టికి తెచ్చారు. మన స్వాతంత్ర పోరాట చరిత్రను పునరుజ్జీవింపజేయడం అమృత్ మహోత్సవ్లో కీలకమైన అంశాలలో ఒకటి అని ప్రధానమంత్రి అన్నారు.
‘‘స్వాతంత్య్ర పోరాటంలో మనం మరిచిన ఉజ్వల చారిత్రకఘట్టాల వైభవాన్ని దేశం ముందుకి తెస్తున్నాం. కలం నో కార్నివాల్’ వంటి ప్రదర్శనలు దేశంలో ఈ ప్రచారానికి ఊపునిస్తాయి”, అని ప్రధాన మంత్రి అన్నారు. స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన పుస్తకాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, అలాంటి రచయితలకు బలమైన వేదికను అందించాలని సూచించారు. ఈ దిశగా ఈ పుస్తక మహోత్సవ కార్యక్రమం సానుకూల చర్య అని ప్రధాన మంత్రి అన్నారు.
మన పురాణాలు, గ్రంథాలు, పుస్తకాలను ప్రతివారూ అధ్యయనం చేయాలని, పదే పదే వాటిని చదవడం వల్ల వాటిని మరింత ఉపయోగంలోకి పెట్టడానికి వీలు కలుగుతుందన్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్ సాయం
తీసుకుంటున్న రోజులలో ఈ గ్రంథాల అధ్యయనం ప్రాథాన్యత మరింత పెరిగిందన్నారు. సాంకేతికత గొప్ప వరం. సమాచారాన్ని అందిస్తుంది. అయితే ఇది ఎన్నటికీ పుస్తకాలకు, గ్రంథ అధ్యయనానికి ప్రత్యామ్నాయం కాదు. అని ప్రధానమంత్రి అన్నారు. మన మనసులో సమాచారం ఉంటే మెదడు దానిని ప్రాసెస్ చేస్తుందని, ఇది కొత్త కోణాలను ఆవిష్కరిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. ఇది కొత్త పరిశోధన, ఆవిష్కరణలకు దారితీస్తుందన్నారు. పుస్తకాలు మనకు అత్యంత ఆత్మీయ మిత్రులని ప్రధానమంత్రి చెప్పారు.
పుస్తక పఠనాన్ని ఒక అలవాటుగా చేసుకోవడం అవసరమని ప్రధానమంత్రి అన్నారు. ప్రత్యేకించి శరవేగంతో మరుతున్న సమాజంలో ఇది అవసరమని ఆయన చెప్పారు. పుస్తకాలు డిజిటల్ రూపంలో ఉన్నా, లేదా భౌతిక రూపంలో ఉన్నా సరే వాటిని చదవడం అలవరచుకోవాలని ప్రధానమంత్రి అన్నారు. ఇలాంటి పుస్తక ప్రదర్శనలు పుస్తకాల పట్ల యువతలో ఆసక్తి రేకెత్తించడానికి వారిని ఈ దిశగా ఆకర్షించడానికి ఎంతగానో ఉపకరిస్తాయని అలాగే పుస్తకాల ప్రాధాన్యతను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయని ప్రధానమంత్రి అన్నారు.
My message for the book fair being held in Ahmedabad. https://t.co/Z62T4oevO5
— Narendra Modi (@narendramodi) September 8, 2022
जब मैं गुजरात में आप सबके बीच था, तब गुजरात ने भी ‘वांचे गुजरात’ अभियान शुरू किया था।
आज ‘कलम नो कार्निवल’ जैसे अभियान गुजरात के उस संकल्प को आगे बढ़ा रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 8, 2022
पुस्तक और ग्रंथ, ये दोनों हमारी विद्या उपासना के मूल तत्व हैं।
गुजरात में पुस्तकालयों की तो बहुत पुरानी परंपरा रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 8, 2022
इस वर्ष ये पुस्तक मेला एक ऐसे समय में आयोजित हो रहा है जब देश अपनी आजादी का अमृत महोत्सव मना रहा है।
अमृत महोत्सव का एक आयाम ये भी है कि हम हमारी आजादी की लड़ाई के इतिहास को कैसे पुनर्जीवित करें: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 8, 2022
आज इंटरनेट के जमाने में ये सोच हावी होती जा रही है कि जब जरूरत होगी तो इंटरनेट की मदद ले लेंगे।
तकनीक हमारे लिए निःसन्देह जानकारी का एक महत्वपूर्ण जरिया है, लेकिन वो किताबों को, किताबों के अध्ययन को रिप्लेस करने का तरीका नहीं है: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 8, 2022
*****
DS/TS
My message for the book fair being held in Ahmedabad. https://t.co/Z62T4oevO5
— Narendra Modi (@narendramodi) September 8, 2022
जब मैं गुजरात में आप सबके बीच था, तब गुजरात ने भी ‘वांचे गुजरात’ अभियान शुरू किया था।
— PMO India (@PMOIndia) September 8, 2022
आज ‘कलम नो कार्निवल’ जैसे अभियान गुजरात के उस संकल्प को आगे बढ़ा रहे हैं: PM @narendramodi
पुस्तक और ग्रंथ, ये दोनों हमारी विद्या उपासना के मूल तत्व हैं।
— PMO India (@PMOIndia) September 8, 2022
गुजरात में पुस्तकालयों की तो बहुत पुरानी परंपरा रही है: PM @narendramodi
इस वर्ष ये पुस्तक मेला एक ऐसे समय में आयोजित हो रहा है जब देश अपनी आजादी का अमृत महोत्सव मना रहा है।
— PMO India (@PMOIndia) September 8, 2022
अमृत महोत्सव का एक आयाम ये भी है कि हम हमारी आजादी की लड़ाई के इतिहास को कैसे पुनर्जीवित करें: PM @narendramodi
आज इंटरनेट के जमाने में ये सोच हावी होती जा रही है कि जब जरूरत होगी तो इंटरनेट की मदद ले लेंगे।
— PMO India (@PMOIndia) September 8, 2022
तकनीक हमारे लिए निःसन्देह जानकारी का एक महत्वपूर्ण जरिया है, लेकिन वो किताबों को, किताबों के अध्ययन को रिप्लेस करने का तरीका नहीं है: PM @narendramodi