అమృత్ సర్ లో జరిగిన రైలు ప్రమాదం కారణం గా ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘అమృత్ సర్ లో జరిగిన రైలు ప్రమాదం అంతులేని దు:ఖాన్ని కలిగించింది. ఈ విషాద ఘటన అతి హృదయవిదారకమైనటువంటి ఘటన. ఈ దుర్ఘటన లో ప్రాణాలను కోల్పోయిన వారి యొక్క కుటుంబ సభ్యులకు ఇదే నా ప్రగాఢ సంతాపం. ఈ ఘటన లో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. నేను అధికారులతో మాట్లాడి, సత్వర సహాయ కార్యకలాపాలను చేపట్టవలసిందంటూ వారికి సూచించాను’’ అంటూ ప్రధాన మంత్రి తన మనోభావాలను ట్విటర్ ద్వారా వెల్లడించారు.
**
Extremely saddened by the train accident in Amritsar. The tragedy is heart-wrenching. My deepest condolences to the families of those who lost their loved ones and I pray that the injured recover quickly. Have asked officials to provide immediate assistance that is required.
— Narendra Modi (@narendramodi) October 19, 2018