Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అత్యధిక ఆదాయార్జనపై ‘హెచ్ఎఎల్’కు ప్రధానమంత్రి ప్రశంస


   హెచ్‌ఎఎల్‌ సంస్థ  2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.26,500 కోట్ల (పన్ను లెక్కించక ముందు) అత్యధిక ఆదాయం ఆర్జించడంపై ఆ సంస్థ సిబ్బంది మొత్తాన్నీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ.24,620 కోట్లు ఆర్జించగా, ఈ ఏడాది కార్యకలాపాల ద్వారా ఆదాయంలో 8 శాతం వృద్ధిని సాధించింది.

దీనిపై హెచ్‌ఎఎల్‌ సంస్థ ట్వీట్‌కు స్పందనగా పంపిన సందేశంలో:

“ఇది చాలా అరుదైన విజయం! ఈ మేరకు అద్భుతమైన నిబద్ధత, ఉత్సాహం ప్రదర్శించిన హెచ్‌ఎఎల్‌ బృందం మొత్తానికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.