Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశ ప్రజల ను ఉద్దేశించి 2020వ సంవత్సరం మే నెల 12వ తేదీ న ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ యొక్క ప్రసంగం


నా దేశవాసులకు ఆదరపూర్వకమైన నమస్కారాలు.  ప్రపంచ దేశాల లోని జన సముదాయంగత నాలుగు నెలల కు పైగా కరోనా వైరస్ తో పోరాడుతున్నది. ఈ కాలం లో ప్రపంచవ్యాప్తం గా 42 లక్షల మంది కి పైగా ప్రజలు కరోనా సంక్రమణ కు గురి అయ్యారు. 2.75 లక్షల మందికి పైగా ప్రజలు మరణించడం విషాదాన్ని మిగిల్చింది. భారతదేశం లో కూడా, ప్రజలు వారి ప్రియతముల ను మరియు సన్నిహితుల ను కోల్పోయారు. అందరి కి నేను నా యొక్క ప్రగాఢమైనటువంటి సంవేదన ను వ్యక్తం చేస్తున్నాను.

మిత్రులారా,

ఒక వైరస్ ప్రపంచాన్ని నాశనం చేసివేసింది. ప్రపంచం అంతటా కోట్ల మంది ప్రజలు ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. భూగోళం అంతటా, మనమందరమూ అమూల్యమైనటువంటి ప్రాణాల ను కాపాడుకోవడం కోసం ఒక సమరాన్ని సాగిస్తున్నాము. ఈ తరహా సంకటాన్ని మనం ఎన్నడూ కని విని ఎరుగము. ఈ గండం ఆలోచన కు అందనిదే కాక మానవాళి కి ఇటువంటి ఆపద ను ఇదివరకు ఎన్నడూ ఎదురయ్యిందేలేదు.

ఏమైనా కానీ, అలసిపోవడం, ఓడిపోవడం లేదా ముక్కలుముక్కలు గా అయి చెదరిపోవడం మనిషి కి అంగీకారయోగ్యం కాదు. ఇటువంటి ఒక యుద్ధం లో మనం జాగరూకత తో ఉంటూ, దీనిని అతి సమీపం నుండి పర్యవేక్షిస్తూ, నియమాల ను అనుసరిస్తూ మనలను మనం కాపాడుకొని ముందుకు సాగిపోవలసిందే. ప్రస్తుతం, ప్రపంచం సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు, మనం మన సంకల్పాన్ని బల పరచుకొని తీరాలి. మన మహా సంకల్పం ఈ సంకటం బారి నుండి బయటపడటానికి మనకు సహాయకారి కాగలదు.

మిత్రులారా,

మనం 21వ శతాబ్దం భారతదేశానిది అన్న మాటల ను గడచిన వంద సంవత్సరాలు గా వింటూ వస్తున్నాము. కరోనా కు పూర్వం ప్రపంచాన్ని మరియు ప్రపంచ వ్యవస్థల ను మనం సమగ్రం గా చూసినవాళ్లమే. కరోనా సంకటం విరుచుకుపడిన తరువాత సైతం మనం భూగోళం అంతటా చోటు చేసుకొంటున్న పరిస్థితి ని నిత్యం గమనిస్తూ వస్తున్నాము. మనం ఈ రెండు కాలాల ను భారతదేశం యొక్క దృష్టి కోణం లో నుండి గమనిస్తే, 21వ శతాబ్దం భారతదేశపు శతాబ్దియే అని అనిపిస్తుంది. ఇది మన స్వప్నం కాదు, అంతకంటే మన అందరికి ఒక బాధ్యత అని చెప్పాలి. అయితే మరి మన పయన దిశ ఏ విధం గా ఉండాలి? ప్రస్తుత ప్రపంచ స్థితి మనకు నేర్పుతున్న అంశం ఏమిటి అంటే, అది ఒక ‘‘స్వయంసమృద్ధ భారతదేశం’’ అనే ఒక్క దారి మాత్రమే మిగిలింది అనేది. మన ధర్మగ్రంథాల లో ప్రబోధించబడింది- ఐశ: పంథా: అని. ఈ మాటల కు, ఆత్మనిర్భరమైనటువంటి భారతదేశం అని భావం.

మిత్రులారా,

ఒక దేశం గా ప్రస్తుతం మనం ఒక కీలకమైనటువంటి సంకట స్థితి లో ఉన్నాము. అంతటి పెను విపత్తు భారతదేశానికి ఒక సంకేతం, అది ఒక సందేశాన్ని తీసుకు వచ్చింది; మరి ఒక అవకాశాన్ని కూడా వెంటబెట్టుకు తెచ్చింది. మీకు నా యొక్క దృష్టి కోణాన్ని ఒక ఉదాహరణ సాయం తో మీకు వివరిస్తాను. కరోనా సంక్షోభం తలఎత్తినప్పుడు, భారతదేశం లో ఒక్కటంటే ఒక్క పిపిఇ కిట్ కూడా తయారు గా లేదు. ఎన్-95 మాస్క్ లు భారతదేశం లో చాలా తక్కువ స్థాయి లో ఉత్పత్తి అయ్యాయి. ఇవాళ మనం ప్రతి రోజు 2 లక్షల పిపిఇ కిట్ లను, ఇంకా 2 లక్షల ఎన్-95 మాస్క్ లను ఉత్పత్తి చేయగల స్థితి లో ఉన్నాము. ఈ సంకట స్థితి ని ఒక అవకాశం గా భారతదేశం మలచుకొంది కాబట్టే మనం ఈ కార్యాన్ని నెరవేర్చగలిగాము. సంక్షోభాన్ని అవకాశం గా మార్చివేసుకొనే భారతదేశం యొక్క దార్శనికత స్వయంసమృద్ధ భారతదేశాన్ని ఆవిష్కరించాలన్న మన సంకల్పం విషయంలోనూ అంతే ప్రభావవంతం గా నిరూపణ కానున్నది.

మిత్రులారా,

ఇవాళ స్వయంసమృద్ధి అనే మాట కు అర్థం మారిపోయింది. మానవ కేంద్రిత ప్రపంచీకరణ కు, ఆర్థిక వ్యవస్థ కేంద్రిత ప్రపంచీకరణ కు మధ్య వాదోపవాదాలు మొదలయ్యాయి. భారతదేశం యొక్క ప్రాథమిక భావధార ప్రపంచం సమక్షం లో ఓ ఆశాకిరణం లా నిలచింది. భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు స్వావలంబన ను గురించి చెబుతాయి. మరి వసుధైవ కుటుంబకమ్ అనేది దీని యొక్క ఆత్మ గా ఉన్నది. స్వయంసమృద్ధి విషయానికి వస్తే భారతదేశం స్వీయకేంద్రిత ఏర్పాటుల ను సమర్థించదు.

భారతదేశం యొక్క స్వయంసమృద్ధత లో ప్రపంచం యొక్క సంతోషం, ప్రపంచం యొక్క సహకారం మరియు ప్రపంచం యొక్క శాంతి ఇమిడిపోయివుంది. ఇది ఎటువంటి సంస్కృతి అంటే, అది ప్రపంచం యొక్క సంక్షేమం పట్ల, సమస్త జీవరాశుల సంక్షేమం పట్ల నమ్మకాన్ని కలిగివున్న సంస్కృతి; మరి ఈ సంస్కృతి యావత్తు ప్రపంచాన్ని ఒక పరివారం గా భావన చేస్తుంది. మాతా భూమి: పుత్రో అహం పృథివ్య: అన ఒక పూర్వసిద్ధాంతం ఉన్నది. ధరణి ని మాత గా భావన చేసేటటువంటి సంస్కృతి ని ఈ ఆధారవాక్యం సూచిస్తున్నది. మరి ఎప్పుడయితే భరత భూమి స్వయంసమృద్ధం గా మారుతుందో, అది సమృద్ధ ప్రపంచం యొక్క సంభవనీయత కు పూచీ పడుతుంది.

భారతదేశం యొక్క ప్రగతి సదా ప్రపంచ ప్రగతి లో ఒక అంతర్భాగం గా ఉంటూ వచ్చింది.  భారతదేశం యొక్క లక్ష్యాలు మరియు కార్యాచరణ ప్రపంచ సంక్షేమాన్ని ప్రభావాన్వితం చేస్తాయి. ఎప్పుడయితే భారతదేశం సార్వజనిక స్థానాల లో మల మూత్రాదుల విసర్జన అభ్యాసం నుండి విముక్తం అయిందో, దాని తాలూకు ప్రభావం ప్రపంచం యొక్క ప్రతిరూపం పైన ప్రసరించింది. అది క్షయ వ్యాధి కావచ్చు, పౌష్టికాహార లేమి కావచ్చు, పోలియో కావచ్చు.. భారతదేశం యొక్క ప్రచార ఉద్యమాలు ప్రపంచం మీద ప్రభావాన్ని చూపెట్టాయి. ఇంటర్ నేశనల్ సోలర్ అలాయంస్ అనేది భూగోళ కవోష్ణత కు విరుద్ధం గా భారతదేశం అందించినటువంటి బహుమానం. అంతర్జాతీయ యోగ దినం అనే కార్యక్రమం ఒత్తిడి నండి ఉపశమనం పొందడం కోసం భారతదేశం ఇచ్చిన ఒక బహుమతి. భారతదేశ ఔషధాలు ప్రపంచం లో వేరు వేరు ప్రాంతాల ప్రజల కు ఒక సరిక్రొత్త జీవనాన్ని ప్రసాదించాయి. ఈ చర్య లు భారతదేశాని కి ప్రశంసల ను కొనితెచ్చాయి, ఈ సంగతి భారతదేశం లో ప్రతి ఒక్కరు గర్వపడేటట్టు చేస్తుంది మరి. భారతదేశం చాలా చక్క గా మనగలుగుతుంది అని, మానవాళి యొక్క సంక్షేమాని కి చాలా మంచి తోడ్పాటు ను అందించగలుగుతుంది అని ప్రపంచం నమ్మడం ఆరంభించింది. ప్రశ్నల్లా- ఎలా? అన్నదే. ఈ ప్రశ్నకు సమాధానం- ఒక స్వయంసమృద్ధమైనటువంటి భారతదేశాన్ని నిర్మించడం కోసం దేశం లోని 130 కోట్ల మంది పౌరులు సమష్టి గా తీర్మానించుకోవడం- అన్నదే.

మిత్రులారా,

మనది శతాబ్దాల తరబడి ఒక గర్వకారణమైనటువంటి చరిత్ర కు వారసులము గా ఉన్నాము. భారతదేశం వర్ధిల్లిన కాలం లో, దాని ని బంగారు బాతు అన్నారు; అది వృద్ధి అయిన దేశం గా ఉండింది; మరి అప్పట్లో అది ఎల్లవేళల ప్రపంచ సంక్షేమం కోసం పాటుపడేది. అంతలోనే కాలాలు మారాయి. దేశం దాస్య శృంఖలాల లో మగ్గిపోయింది. మనం అభివృద్ధి కోసం అర్రులు చాచాము. ఇప్పుడు భారతదేశం ప్రగతి బాట లో వడివడి గా అడుగులు వేస్తున్న తరుణం లో కూడాను, అది ఇంకా ప్రపంచ సంక్షేమ లక్ష్యాని కి కట్టుబడే ఉంది. ఈ శతాబ్దం మొదట్లో వచ్చిన వై2కె సంక్షోభాన్ని గురించి మీకు గుర్తు ఉండే ఉంటుంది. అప్పడు భారతదేశాని కి చెందిన సాంకేతిక విజ్ఞాన నిపుణులే ప్రపంచాన్ని ఈ సంక్షోభం నుండి బయట పడవేశారు. ఈ రోజు న మనకు వనరులు ఉన్నాయి; శక్తి ఉంది; ప్రపంచం లోకెల్లా అత్యుత్తమ ప్రతిభావంతులు మన దగ్గర ఉన్నారు. మనం మంచి ఉత్పత్తుల ను తయారు చేయగలం, మనం వాటి నాణ్యత ను మరింత పెంచగలం; సరఫరా సంబంధిత గొలుసుకట్టు ను మరింత ఆధునీకరించగలము. మనం ఈ కార్యాన్ని నెరవేర్చగలం. మరి మనం ఈ పని ని చేసి తీరుతాము.

మిత్రులారా,

నేను స్వయం గా గుజరాత్ లోని కచ్ఛ్ ప్రాంతం లో వచ్చిన భూకంపాన్ని చూశాను. ఎక్కడ చూసినా శిథిలాలే. అంతా నాశనం అయిపోయింది. కచ్ఛ్ ప్రాంతం అంతా చావు దుప్పటి ని కప్పుకొని నిదురిస్తోందా అనిపించింది. అటువంటి స్థితి లో పరిస్థితి ఎప్పటికైనా మారుతుందా అనే భావన ఊహల లోకి అయినా రాదు. అయితే కచ్ఛ్ లేచింది. కచ్ఛ్ కదలడం మొదలుపెట్టింది. కచ్ఛ్ కదిలింది. అదే.. మన భారతీయుల యొక్క ధైర్యమూ, దృఢ సంకల్పమూ ను. మనం కృత నిశ్చయం తో ముందడుగు వేస్తే మన లక్ష్యాల ను చేరుకోగలుగుతాము. ఏ దూరాలు మనకు భారం కాబోవు. ఈ రోజు న మనసుంటే మార్గం ఉంటుంది. అదే స్వయంసమృద్ధియుత భారతదేశాన్ని నిర్మించడం. మన అందరి తీర్మానం ఎంత బలమైనదంటే భారతదేశం తన అవసరాల ను స్వయం గా తాను తీర్చుకోగలిగినటువంటి దేశం గా తయారు కాగలుగుతుందన్న మాట.

మిత్రులారా, ఇంతటి మహత్తర స్వయం సమృద్ధియుత భారతదేశమనేటటువంటి ఒక వైభవోపేతమైన భవనం ఐదు స్తంభాల పైన నిలుస్తుంది.

ఒకటో స్తంభం గా ఆర్ధిక వ్యవస్థ ఉంది. ప్రతి ఏటా కొద్ది కొద్ది గా పెరిగే ఆర్ధిక వ్యవస్థ కాకుండా జాంబవంతుని అంగల తో కూడిన అటువంటి అభివృద్ధి ని సాధించేది.

రెండో స్తంభం గా మౌలిక సదుపాయాల కల్పన ఉంది. నవ భారతాని కి మౌలిక సదుపాయాలు గుర్తింపు గా నిలచాయి.

మూడో స్తంభం మన వ్యవస్థ. సాంకేతిక విజ్ఞానం తో నడిచే వ్యవస్థల పై ఆధారపడిన వ్యవస్థ లు. అది 21వ శతాబ్దపు కలల ను పండించడానికి తోడ్పడాలి గాని క్రితం శతాబ్దపు విధానాల ను అమలు చేయరాదు.

నాలుగో స్తంభం మన జనాభా. ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం గా ఉన్న మనకు చైతన్యవంతమైన జన సంపద మన బలం; స్వయంసమృద్ధ భారతావనికి శక్తివనరు గా ఉంది.

అయిదో స్తంభం డిమాండు.. మన దేశం లో సరఫరా మరియు గిరాకీ తాలూకు శృంఖలమే మన ఆర్ధిక వ్యవస్థ కు ఉన్నటువంటి బలం. దాని ని పూర్తి సామర్ధ్యం మేరకు ఉపయోగించుకోవాలి. దేశం లో డిమాండు ను పెంచడానికి, ఆ డిమాండు ను తీర్చడానికి సరఫరా శృంఖల కు చెందిన ప్రతి భాగస్వామి కని సాధికారిత ను కల్పించాలి. మన సరఫరా సంబంధిత గొలుసుకట్టు ను బలోపేతం చేద్దాము. మన సరఫరా వ్యవస్థ మన మట్టి పరిమళంతో ను, శ్రామికుల స్వేదం తోను నిర్మితమైంది.
మిత్రులారా,

ఈ కరోనా సంక్షోభం నడుమ న ఒక కొత్త సంకల్పం తో ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ని నేను ప్రకటిస్తున్నాను. ఈ ఇకనామిక్ ప్యాకేజ్ ‘‘ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్’’ (స్వయంసమృద్ధియుత భారతదేశ ప్రచార ఉద్యమం)లో ఒక ముఖ్యమైన సంధానకారి గా తన సేవల ను అందజేస్తుంది.

మిత్రులారా,

ఇటీవలి కాలం లో ప్రభుత్వం వెలువరించిన ఆర్ధిక ప్రకటన లు కరోనా సంక్షోభాని కి సంబంధించినవి. అవి రిజర్వు బ్యాంకు నిర్ణయాలు. ఈ రోజు న ప్రకటిస్తున్నటువంటి ఆర్ధిక ప్యాకేజీ ని, జోడించిన పక్షం లో, మొత్తం దాదాపు గా 20 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. ఈ ప్యాకేజీ భారతదేశం యొక్క జిడిపి లో సుమారు గా 10 శాతం గా లెక్క తేలుతుంది. దీని తో దేశం లోని వివిధ వర్గాల కు మరియు ఆర్థిక వ్యవస్థ తో ముడిపడివున్నటువంటి వారి కి 20 లక్షల కోట్ల రూపాయల మేరకు మద్దతు మరియు బలం ప్రాప్తిస్తాయి. 2020వ సంవత్సరం లో దేశం సాగిస్తున్న అభివృద్ధి యాత్ర కు ఈ కలిసికట్టు ఏర్పాటు ఒక కొత్త ఉత్తేజాన్ని అందించడం తో పాటు ఒక స్వయంసమృద్ధ భారతదేశం అనే ప్రచార ఉద్యమాని కి ఓ నూతన దిశ ను కూడా చూపుతుంది. స్వయంసమృద్ధ భారతదేశం అనే సంకల్పాని కి నిరూపణ గా భూమి, శ్రామికులు, ద్రవ్యలభ్యత మరియు శాసనాల కు ఈ ప్యాకేజీ లో నొక్కి చెప్పడం జరిగింది.

లక్షల మంది కి జీవనాధారాన్ని కల్పిస్తున్న మన కుటీర పరిశ్రమలు, గృహ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, మన ఎమ్ఎస్ఎమ్ఇ ల కోసం ఈ ఆర్థిక ప్యాకేజీ ని ఉద్దేశించడమైంది. అదే స్వయంసమృద్ధ భారతానికి పునాది. ప్రతి పరిస్థితి లో, ప్రతి ఋతువు లో దేశవాసుల కోసం రేయింబవళ్ళు శ్రమిస్తున్న రైతుల కోసం, శ్రామికుల కోసం ఈ ఆర్ధిక ప్యాకేజీ ని తీసుకురావడం జరుగుతున్నది. నిజాయితీ గా పన్నులు చెల్లించి దేశాభివృద్ధి కోసం పాటుపడే మధ్యతరగతి వారి కోసం ఈ ఆర్ధిక ప్యాకేజీ ని తీసుకురావడం జరుగుతున్నది. దేశ ఆర్ధిక సామర్ధ్యాన్ని పెంచడానికి కృతనిశ్చయం తో పాటుపడుతున్న భారతీయ పరిశ్రమల కోసం ఈ ఆర్ధిక ప్యాకేజీ ని తీసుకురావడం జరుగుతున్నది. రేపటి నుండి మొదలుపెట్టి వచ్చే కొద్దీ రోజుల లో, ఆర్ధిక మంత్రి మీకు ‘స్వయంసమృద్ధ భారత్ ప్రచార ఉద్యమం’ స్పూర్తి తో కూడుకొన్న ప్యాకేజీ ని గురించిన సమగ్ర సమాచారాన్ని వెల్లడి చేస్తారు.

మిత్రులారా,

స్వయంసమృద్ధి ని సాధించే భార‌త‌దేశాన్ని త‌యారు చేయ‌డానికి గాను, సాహ‌సోపేత సంస్క‌ర‌ణ‌ల ను చేప‌ట్టాల‌నే నిబ‌ద్ద‌త‌ తో ముందుకు పోవడం ప్రస్తుతం తప్పనిసరి అయింది. గ‌త 6 సంవ‌త్స‌రాలు గా దేశం లో చేప‌డుతున్న సంస్క‌ర‌ణ‌ ల కార‌ణం గానే ఈ సంక్షోభ కాలం లో భార‌త‌దేశ వ్య‌వ‌స్థ‌ లు స‌మ‌ర్థ‌వంతం గా పని చేస్తున్నాయనే విష‌యం మీకు అనుభ‌వం లోకి వ‌చ్చి ఉంటుంది. లేకపోతే, ఎవరు అనుకొని ఉంటారు.. భారత ప్రభుత్వం పంపిన డబ్బు పేద రైతు యొక్క జేబు లోకి నేరుగా వెళ్తుంది అని!. కానీ ఇది జరిగింది. అది కూడాను, అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు అన్నీ మూసి వేసి ఉండగా జ‌రిగింది; ర‌వాణా సాధనాల ను మూసివుంచినప్పటికీ అది జ‌రిగింది. ఇది జ‌న్ ధ‌న్- ఆధార్- మొబైల్ (జెఎఎం) యొక్క త్రిశ‌క్తి కి సంబంధించిన‌ సంస్క‌ర‌ణ. దీని యొక్క ప్ర‌భావాన్ని మ‌నం చూశాము. ఇప్పుడు సంస్క‌ర‌ణ‌ ల కు ఒక నూతన శిఖర స్థాయి ని కల్పిస్తూ వీటి యొక్క ప‌రిధి ని మ‌రింత విస్త‌రించవలసివుంది. ఈ సంస్క‌ర‌ణ‌ లు వ్య‌వసాయాని కి సంబంధించిన మొత్తం స‌ర‌ఫ‌రా వ్య‌వస్థ‌ లో చోటు చేసుకోనున్నాయి. త‌ద్ద్వారా రైతు కూడా సాధికారిత ను పొందుతాడు. అంతే కాదు, భ‌విష్య‌త్తు లో క‌రోనా వంటి మరే ఇతర సంక్షోభం త‌లెత్తిన‌ప్పుడు రైతు పై దాని తాలూకు ప్రభావం అతి త‌క్కువ స్థాయి లో ఉంటుంది. ఈ సంస్కరణల ను స‌హేతుక‌మైన ప‌న్నుల వ్య‌వ‌స్థ‌ కోసం, సరళమైనటువంటి మరియు స్ప‌ష్ట‌మైనటువంటి చ‌ట్ట నియమాలు, మంచి మౌలిక స‌దుపాయాల కల్పన, స‌మ‌ర్థ‌వంత‌మైననటువంటి మరియు స్పర్ధాత్మకం గా ఉండేటటువంటి మాన‌వ‌ వ‌న‌రులు, ఇంకా బ‌ల‌మైన ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ ను నిర్మించుకోవ‌డం కోసం ఉద్దేశించినవై ఉంటాయి. ఈ సంస్క‌ర‌ణ‌ లు వ్యాపార‌ రంగాన్ని ప్రోత్స‌హిస్తాయి; పెట్టుబ‌డి ని ఆక‌ర్షిస్తాయి; మేక్ ఇన్ ఇండియా తాలూకు మ‌న సంకల్పాన్ని బ‌లోపేతం చేస్తాయి.

మిత్రులారా,

స్వ‌యంస‌మృద్ధి అనేది అంత‌ర్గ‌త బ‌లం, ఆత్మ‌విశ్వాసం ద్వారానే సాధ్య‌మ‌వుతుంది. స్వ‌యంస‌మృద్ధి అనేది దేశాన్ని అంత‌ర్జాతీయ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌లో గ‌ల గ‌ట్టి పోటీ ని త‌ట్టుకోవ‌డానికి అనుగుణం గా త‌యారు చేస్తుంది. అంత‌ర్జాతీయ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ లో ప్ర‌ధాన‌మైన భూమిక ను పోషించవలసిన తరుణం భార‌త‌దేశాని కి ఆస‌న్న‌ం అయింది. దీని ని దృష్టి లో పెట్టుకొని ఆర్ధిక ప్యాకేజీ లో అనేక చ‌ర్య‌ల ను తీసుకోవ‌డం జ‌రిగింది. ఇది మన రంగాలన్నిటి సామర్థ్యాన్ని పెంచగలుగుతుంది. అంతే కాదు, నాణ్య‌త కు కూడా పూచీ పడుతుంది.

మిత్రులారా,

ప్ర‌స్తుతం మ‌నం ఎదుర్కొంటున్న సంక్షోభం చాలా పెద్ద‌ది. పెద్ద పెద్ద వ్య‌వ‌స్థ‌లే క‌దిలిపోతున్నాయి. అయిన‌ప్ప‌టికీ, ఇటువంటి ప‌రిస్థితుల లో దేశం లోని పేద సోద‌రీమ‌ణులు మరియు సోదరులు ఎంతో సంయ‌మ‌నం తో వ్య‌వ‌హ‌రించారు. ముఖ్యం గా తోపుడు బళ్ల లో వీధి వీధికీ తిరిగి వ‌స్తువులను విక్రయించే వారు, కార్మికులు, ప‌నిమ‌నుషులు.. ఇటువంటి వారంతా అనేక క‌ష్టాలు పడుతూ ఈ స‌మ‌యం లో ఎంతో త్యాగం చేశారు. వారి సేవ‌ లు లోపించాయన్న విషయాన్ని గ్రహించిన వారంటూ ఎవరైనా ఉండివుంటారా? వారి ని బ‌లోపేతం చేయ‌డం ఇప్పుడు మ‌న యొక్క కర్తవ్యం గా ఉంది. వారి యొక్క ఆర్థిక అవ‌స‌రాల‌ ను తీర్చ‌డానికి గాను కొన్ని పెద్ద పెద్ద నిర్ణ‌యాల ను తీసుకోవలసి ఉంది. దీని ని దృష్టి లో పెట్టుకొని, పేదల కోసం, కార్మికుల‌ కోసం, వ‌లస కార్మికుల కోసం, పశు పోష‌ణ‌దారుల‌ కోసం, మ‌త్స్య‌కారుల‌ కోసం- వారు సంఘటిత రంగానికి చెందిన‌ వారు కావ‌చ్చు, లేదా అసంఘటిత రంగానికి చెందిన వారు కావ‌చ్చు- అటువంటి వారంద‌రి కోసం ఇకనామిక్ ప్యాకేజ్ లో కొన్ని ముఖ్య‌మైన నిర్ణ‌యాల ను ప్రకటించడం జరుగుతుంది.

మిత్రులారా,

క‌రోనా సంక్షోభం కార‌ణం గా స్థానిక త‌యారీ రంగం ప్రాధాన్య‌ం తెలిసి వ‌చ్చింది. స్థానిక బజారు లు, స్థానిక స‌ర‌ఫరా వ్య‌వ‌స్థ ల‌ ప్రాధాన్య‌ాన్ని క‌రోనా సంక్షోభం తెలియ‌జేస్తోంది. ఈ సంక్షోభ కాలం లో స్థానిక వ్య‌వ‌స్థ‌లే మ‌న అవ‌స‌రాల‌ ను తీరుస్తున్నాయి. ఇవే మ‌న‌ల్ని కాపాడుతున్నాయి. స్థానిక వ్య‌వ‌స్థ‌లు అనేవి అవ‌స‌రం మాత్ర‌మే కాదు, అవి మ‌న బాధ్య‌త‌ లు కూడాను. స్థానిక వ్య‌వ‌స్థ‌ల‌ ను మ‌న జీవితం లో అత్యంత ముఖ్య‌మైన‌వి గా చేసుకోవాల‌నే విష‌యాన్ని కాలం మ‌న‌కు నేర్పింది. మీరు ఇప్పుడు గ్లోబ‌ల్ బ్రాండులు అని భావిస్తున్న‌వి ఒక‌ప్పుడు ఆయా ప్రాంతాల లో స్థానికంగా ఉన్న‌వే. అయితే ప్ర‌జ‌లు వాటికి ప్రాధాన్య‌ాన్ని ఇవ్వ‌డమ‌నేది పెర‌గ‌డం తో, బాగా ప్రోత్స‌హించ‌డం తో, వాటి ని గురించి గ‌ర్వంగా చెప్ప‌డంతో అవి రాను రాను గ్లోబ‌ల్ రూపాన్ని సంత‌రించుకున్నాయి. కాబ‌ట్టి ఈ రోజు నుండి ప్ర‌తి భార‌తీయుడు వారి స్థానిక ఉత్ప‌త్తుల ను గురించి గ‌ట్టి గా మాట్లాడాలి. వాటి ని కొనుగోలు చేయడ‌మే కాకుండా, వాటి ని గురించి ఎంతో గ‌ర్వం గా ప్ర‌చారం చేయాలి. ఈ ప‌ని ని నా దేశం చేస్తుంద‌నే విష‌యం పై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్ర‌తి సారీ మీరు చేస్తున్న కృషి మీ ప‌ట్ల నాలో ఆరాధ‌నా భావాన్ని పెంచుతోంది. గ‌ర్వం‌ తో ఒక విష‌యాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేయవలసిందని, చేనేత కార్మికుల‌ కు అండ‌ గా నిల‌వాల‌ని గ‌తం లో నేను మిమ్మల్ని అభ్యర్థించాను. నా న‌మ్మ‌కం నిజ‌మైంది. ఈ రోజు న ఖాదీ వ‌స్త్రాలకు మరియు చేనేత వ‌స్త్రాల కు గిరాకీ రికార్డు స్థాయి లో పెరిగింది. అంతేకాదు, మీరు ఖాదీ వ‌స్త్రాన్ని ఒక గొప్ప బ్రాండు గా తయారు చేశారు. నేను చేసిన కృషి చిన్న‌దే, కానీ ఫ‌లితం మాత్రం చాలా గొప్ప‌ గా ఉంది.

మిత్రులారా,

క‌రోనా అనేది చాలా కాలం పాటు మ‌న జీవితాల లో భాగంగా ఉండ‌బోతున్న‌ది అని నిపుణులు, శాస్త్ర‌వేత్త‌ లు అంటున్నారు. అయితే అదే స‌మ‌యం లో ఈ క‌రోనా కార‌ణం గా మ‌న జీవితాల‌ ను దీని చుట్టూరా ప‌రిమితం చేయ‌ కూడ‌దు. మాస్కుల ను ధ‌రిస్తూ, రెండు గ‌జాల భౌతిక దూరాన్ని పాటిస్తూ మ‌న ల‌క్ష్యాల‌ను చేరుకోవలసివుంటుంది. కాబ‌ట్టి లాక్ డౌన్ నాలుగో ద‌శ ను పూర్తి గా రీ డిజైన్ చేయ‌డం జ‌రుగుతోంది. నూత‌న నియ‌మాల‌ ను పెట్ట‌బోతున్నాము. రాష్ట్రాల‌ నుండి మాకు అందుతున్న సూచ‌న‌ లు, స‌ల‌హా ల ఆధారం గా లాక్ డౌన్ 4 కు సంబంధించిన సమాచారాన్ని- మే నెల 18 తేదీ కంటే ముందు- మీకు తెలియజేయడం జరుగుతుంది. నియ‌మ నిబంధ‌న‌ల ప్ర‌కారం న‌డుచుకోవడం ద్వారా మనం క‌రోనా తో పోరాటం చేస్తూ మరి ముందుకు సాగుతామ‌నే న‌మ్మ‌కం నాకు వుంది.

మిత్రులారా,

మ‌న సంస్కృతి లో ‘సర్వం ఆత్మవశం సుఖం’ అని పేర్కొనడమైంది. ఈ మాటల కు- ఏది మన అదుపు లో ఉందో, అదే సంతోషం అని- భావం. స్వయంసమృద్ధి అనేది సంతోషాని కి, సంతృప్తి కి, సాధికారిత‌ కు బాట ను పరుస్తుంది. 21వ వ శ‌తాబ్దాన్ని భార‌త‌దేశం యొక్క శ‌తాబ్దం గా మార్చాల‌నే మ‌న బాధ్య‌త. స్వయంసమృద్ధి ని సాధించిన భార‌త‌దేశాన్ని సాధించ‌డం ద్వారా నెర‌వేరుతుంది. భార‌త‌దేశం లోని 130 కోట్ల మంది భార‌తీయుల ద్వారా మాత్రమే ఈ బాధ్య‌త ను నెర‌వేర్చడానికి అవసరమయ్యే శ‌క్తి ప్రాప్తిస్తుంది.
స్వయంసమృద్ధియుతమైనటువంటి భార‌త‌దేశ శకావిష్కరణ అనేది భారతదేశం లో ప్ర‌తి ఒక్కరి శపథం కావాలి. అంతే కాదు ఇది ఒక నూత‌న ప‌ర్వ‌దినం కావాలి. మ‌నం ఇప్పుడు స‌రికొత్త ఆకాంక్ష‌ తో, దృఢ‌మైన నిర్ణ‌యం తో ముందుకు సాగాలి. బాధ్య‌త‌ తో కూడిన నీతి నియ‌మాల‌ తో, జాగ్రత్త‌ గాను నేర్పు గాను కృషి చేస్తే, నైపుణ్యాల‌నే పెట్టుబ‌డులు గా పెట్టి ప‌ని చేస్తే స్వయంసమృద్ధి ని సాధించ‌కుండా దేశాన్ని ఆప‌డం ఎవ‌రి త‌రం? మ‌నమంతా క‌లసి భారతదేశాన్ని స్వ‌యం స‌మృద్ధమైన దేశం గా తీర్చిదిద్ద‌గ‌లుగుతాము. మ‌నం భార‌త‌దేశాన్ని స్వయంసమృద్ధియుతమైనటువంటి దేశం గా తయారు చేద్దాము. ఈ నిశ్చయం తో, ఈ న‌మ్మ‌కం తో, మీకంద‌రికీ నేను నా యొక్క శుభాభినంద‌న‌ల ను వ్యక్తం చేస్తున్నాను.

**