Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ, దామన్ దివేలోని సిల్వస్సాలో రూ.2580 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ, దామన్ దివేలోని సిల్వస్సాలో రూ.2580 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీదామన్ దివేలోని సిల్వస్సాలో రూ.2580 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారుఅంతకుముందు సిల్వస్సాలో నమో ఆస్పత్రిని కూడా ఆయన ప్రారంభించారుఈసందర్భంగా మాట్లాడుతూదాద్రా నగర్ హవేలీదామన్ దివే కేంద్రపాలిత ప్రాంతంతో అనుసంధానం కావడానికిసన్నిహితంగా పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు అక్కడి అంకితభావం కలిగిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారుఅక్కడి ప్రజలతో తనకు ఉన్న సాన్నిహిత్యందీర్ఘకాలిక సంబంధాన్ని గుర్తుచేసుకుంటూఈ ప్రాంతంతో తన అనుబంధం దశాబ్దాల నాటిదని తెలిపారు. 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ ప్రాంతం సాధించిన పురోగతిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారుదాద్రా నగర్ హవేలీదామన్ దివే సామర్థ్యాన్ని ఆధునికతపురోగతి దిశగా మార్చిన విధానాన్ని ఆయన వివరించారు.

సిల్వస్సా సహజ అందాలుఅలాగే దాద్రా నగర్ హవేలీదామన్ దివే ప్రజల ప్రేమ – మీతో నా సంబంధం ఎంతకాలంగా ఉందో మీ అందరికీ తెలుసుదశాబ్దాల నాటి ఈ బంధంనేను ఇక్కడికి వచ్చినప్పుడు కలిగే ఆనందాన్ని మీరునేను మాత్రమే అర్థం చేసుకుంటాం” అని శ్రీ మోదీ పేర్కొన్నారుమొదటిసారి తాను ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు చాలా భిన్నంగా ఉండేదనిఒక చిన్న తీర ప్రాంతం ఏమి సాధించగలదనే ప్రశ్న ప్రజల్లో ఉండేదని ప్రధానమంత్రి పేర్కొన్నారుఅయితేఈ ప్రాంత ప్రజలపైవారి సామర్థ్యాలపై తనకు ఎప్పుడూ పూర్తి విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారుతమ ప్రభుత్వ నాయకత్వంలోఈ విశ్వాసం పురోగతిగా రూపాంతరం చెందిందనిసిల్వస్సాను కాస్మోపాలిటన్ నగరంగా మార్చిందనితన నివాసితులందరికీ కొత్త అవకాశాలు కల్పిస్తూ అభివృద్ధి చెందుతోందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

తొలినాళ్లలో చిన్న మత్స్యకార గ్రామంగా ఉన్న సింగపూర్ కు సంబంధించిన ఒక ఉదాహరణను కూడా శ్రీ మోదీ పంచుకున్నారుసింగపూర్ ప్రజల దృఢ సంకల్పబలం వల్లే ఇప్పటి మార్పు సాధ్యమైందని ఆయన ఉద్ఘాటించారుఈ కేంద్రపాలిత ప్రాంత ప్రజలు కూడా అభివృద్ధి కోసం ఇదే విధమైన సంకల్పాన్ని తీసుకోవాలని ప్రధాని పిలుపు ఇచ్చారువారికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారుఅయితే ముందుకు సాగడానికి వారు కూడా చొరవ తీసుకోవాలన్నారు.

దాద్రా నగర్ హవేలీదామన్ దివే కేవలం కేంద్ర పాలిత ప్రాంతం మాత్రమే కాదుఅది గర్వకారణమే గాకవారసత్వ సంపద కూడాఅందుకే ఈ ప్రాంతాన్ని సమగ్రాభివృద్ధికి పేరొందిన ఆదర్శ రాష్ట్రంగా మారుస్తున్నాం” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారుఅత్యాధునిక మౌలిక సదుపాయాలుఅధునాతన ఆరోగ్య సంరక్షణ సేవలుప్రపంచశ్రేణి విద్యాసంస్థలు, , పర్యాటకంనీలి ఆర్థిక వ్యవస్థపారిశ్రామిక ప్రగతి యువతకు కొత్త అవకాశాలుఅభివృద్ధిలో మహిళల భాగస్వామ్యానికి ఈ ప్రాంతం గుర్తింపు పొందాలని తాను ఆశిస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు.

శ్రీ ప్రఫుల్ పటేల్ నాయకత్వంలోకేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఈ ప్రాంతం ఈ లక్ష్యాల దిశగా వేగంగా పురోగమిస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారుగత పదేళ్లలో అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించామని అన్నారుఈ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి పరంగా ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ జాతీయ పటం పై ఉద్భవిస్తోందివన్ నేషన్ – వన్ రేషన్ కార్డ్జల్ జీవన్ మిషన్భారత్‌నెట్ప్రధానమంత్రి జనధన్ యోజనప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమాప్రధానమంత్రి సురక్షా బీమా వంటి వివిధ ప్రభుత్వ పథకాలు ప్రజలకుముఖ్యంగా బడుగుబలహీనగిరిజన సముదాయాలకు గణనీయమైన ప్రయోజనాలను అందించాయని ప్రధానమంత్రి తెలిపారు.

స్మార్ట్ సిటీస్ మిషన్సమగ్ర శిక్షపీఎం ముద్ర యోజన వంటి కార్యక్రమాల్లో 100 శాతం లక్ష్యాన్ని సాధించడమే తదుపరి లక్ష్యమని ప్రధానమంత్రి ప్రకటించారుతొలిసారిగా ఈ సంక్షేమ పథకాలతో ప్రభుత్వం నేరుగా ప్రజలకు చేరువవుతోందనిప్రభుత్వ పథకాల ద్వారా ప్రతి పౌరుడు లబ్ధి పొందేలా చూస్తున్నామని తెలిపారు.

మౌలిక సదుపాయాలువిద్యఉపాధిపారిశ్రామికాభివృద్ధిలో దాద్రా నగర్ హవేలీదామన్ దివేల మార్పును ప్రధాన మంత్రి ప్రస్తావించారుగతంలో ఈ ప్రాంతానికి చెందిన యువత ఉన్నత విద్య కోసం బయటకు వెళ్లాల్సి వచ్చేదనికానీ నేడు ఈ ప్రాంతంలో ఆరు జాతీయ స్థాయి సంస్థలు ఏర్పడ్డాయని గుర్తు చేశారువీటిలో నమో మెడికల్ కాలేజ్గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీఐఐఐటీ డయ్యూనేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీడామన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయిఈ సంస్థలు సిల్వస్సానుఈ ప్రాంతాన్ని కొత్త విద్యాకేంద్రంగా మార్చాయి. “యువతకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు ఈ సంస్థల్లో వారికి సీట్లు కేటాయించారుఇది హిందీఇంగ్లిష్గుజరాతీమరాఠీ అనే నాలుగు మాధ్యమాల్లో విద్యను అందించే ప్రాంతం అని ఇంతకు ముందు నేను సంతోషించానుఇప్పుడుఇక్కడ ప్రాథమికజూనియర్ పాఠశాలల్లోని పిల్లలు స్మార్ట్ తరగతి గదుల్లో చదువుతున్నారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను” అని శ్రీ మోదీ అన్నారు.

ఇటీవలి సంవత్సరాల్లోఆధునిక ఆరోగ్య సంరక్షణ సేవలు ఈ ప్రాంతంలో గణనీయంగా విస్తరించాయని శ్రీ మోదీ అన్నారు. ‘2023లో నమో మెడికల్ కాలేజీని ప్రారంభించే అవకాశం నాకు లభించిందివీటితో పాటు 450 పడకల సామర్థ్యంతో కొత్త ఆసుపత్రిని కూడా నేను నేడు ప్రారంభించానుసిల్వస్సాలోని ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఈ ప్రాంతంలోని గిరిజన సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి” అని శ్రీ మోదీ చెప్పారు.

జన ఔషధి దివస్ ను పురస్కరించుకుని నేడు ప్రారంభించిన ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారుజన్ ఔషధి తక్కువ ఖర్చుతో చౌకైన చికిత్సను అందిస్తుందని ఆయన చెప్పారుఈ కార్యక్రమం కింద ప్రభుత్వం నాణ్యమైన ఆస్పత్రులుఆయుష్మాన్ భారత్ కింద ఉచిత చికిత్సజన ఔషధి కేంద్రాల ద్వారా చౌకగా మందులు అందిస్తోందిదేశవ్యాప్తంగా 15,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 80% వరకు తక్కువ ధరలకు మందులను అందిస్తున్నాయిదాదాపు 40 జన ఔషధి కేంద్రాలు దాద్రా నగర్ హవేలీదామన్ దివే ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయిభవిష్యత్తులో దేశవ్యాప్తంగా 25,000 జన ఔషధి కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందిఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుండిదాదాపు రూ.6,500 కోట్ల విలువైన తక్కువ ధర మందులను అవసరమైన వారికి అందించామనిపేదమధ్యతరగతికి రూ.30,000 కోట్లకు పైగా ఆదా చేశామని చెప్పారు. “ఈ చొరవ అనేక క్లిష్టమైన వ్యాధుల చికిత్సను మరింత చౌకగా చేసిందిఇది సాధారణ పౌరుల అవసరాల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రదర్శిస్తుంది” అని శ్రీ మోదీ చెప్పారు.

ఆరోగ్యానికి పెనుముప్పుగా పరిణమించిన జీవనశైలి వ్యాధులుముఖ్యంగా ఊబకాయంపై పెరుగుతున్న ఆందోళనను ప్రధానమంత్రి ప్రస్తావించారు. 2050 నాటికి 44 కోట్ల మంది భారతీయులు ఊబకాయంతో బాధపడతారని ఒక తాజా నివేదిక అంచనా వేసిన విషయాన్ని ఆయన ఉటంకించారు. “ఈ ఆందోళన కలిగించే గణాంకాలు చూస్తేప్రతి ముగ్గురు వ్యక్తుల్లో ఒకరికి ఊబకాయం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందిఇది ప్రాణాంతక పరిస్థితిగా మారే అవకాశం కూడా ఉంది,” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

దీన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ స్థూలకాయాన్ని తగ్గించే ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రధాని కోరారువంట నూనె వినియోగాన్ని ప్రతి నెలా 10% తగ్గించాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారుప్రజలు తమ రోజువారీ వంటలలో 10% తక్కువ నూనెను ఉపయోగించడానికి కట్టుబడి ఉండాలని కోరారుఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికిఊబకాయాన్ని నివారించడానికి ప్రతిరోజూ కొన్ని కిలోమీటర్లు నడవడం వంటి క్రమం తప్పని శారీరక వ్యాయామాలను చేర్చాలని ఆయన ఉద్బోధించారు. “అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యసాధనకు దేశం కట్టుబడి ఉందిఆరోగ్యవంతమైన దేశం మాత్రమే అటువంటి లక్ష్యాన్ని చేరుకోగలదు” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

గత దశాబ్ద కాలంలో దాద్రా నగర్ హవేలీదామన్ దివేలో చోటు చేసుకున్న వేగవంతమైన పారిశ్రామిక వృద్ధిని శ్రీ మోదీ ప్రస్తావించారుఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన మిషన్ మానుఫ్యాక్చరింగ్ పథకం ద్వారా ఈ ప్రాంతానికి భారీగా లాభాలు చేకూరనున్నాయని తెలిపారు. “ఇప్పటికే వందలాది కొత్త పరిశ్రమలు ప్రారంభమయ్యాయిఇంకా అనేక ప్రస్తుత పరిశ్రమలు విస్తరించాయితద్వారా వేలాది కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి” అని ఆయన వివరించారుఈ పరిశ్రమలు ముఖ్యంగా గిరిజన సమాజానికిమహిళలకుఅట్టడుగు వర్గాలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను అందిస్తున్నాయి. “ ఎస్సీఎస్టీఓబీసీమహిళల సాధికారత కోసం గిర్ ఆదర్శ్ జీవిక యోజనను అమలు చేశామనిచిన్న డెయిరీ ఫామ్ ల ఏర్పాటుతో కొత్త స్వయం ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని” శ్రీ మోదీ తెలిపారు.

పర్యాటక రంగం కూడా ప్రధాన ఉపాధి వనరుగా అవతరించిందని ప్రధానమంత్రి చెప్పారుఈ ప్రాంతంలోని బీచ్ లుగొప్ప వారసత్వ ప్రదేశాలు దేశవిదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయిరామసేతునమో పథ్డామన్ లోని టెంట్ సిటీపాపులర్ నైట్ మార్కెట్ వంటి కొత్త మార్పులు ఈ ప్రాంతం ఆకర్షణను పెంచుతున్నాయిఒక పెద్ద పక్షుల అభయారణ్యం ఏర్పాటు చేశామనిదుధానిలో ఎకో రిసార్ట్ కోసం ప్రణాళికలు జరుగుతున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారుడయ్యూలో తీరప్రాంత విహారయాత్రబీచ్ అభివృద్ధి పనులు చేపడుతున్నారని చెప్పారు. “2024 లో జరిగిన డయ్యూ బీచ్ గేమ్స్ బీచ్ క్రీడలపై ఆసక్తిని పెంచాయిబ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తో డయ్యూలోని ఘోగ్లా బీచ్ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారిందిడయ్యూలో ఒక కేబుల్ కార్ ప్రాజెక్ట్ ను కూడా అభివృద్ధి చేస్తున్నారుఇది అరేబియా సముద్ర అద్భుతమైన దృశ్యాలను అందిస్తుందిఇది ఈ ప్రాంతాన్ని భారతదేశ అగ్ర పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా చేస్తుంది” అని శ్రీ మోదీ అన్నారు.

దాద్రా నగర్ హవేలీదామన్ దివేలో కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడిన అంశాన్ని ప్రస్తావిస్తూదాద్రా సమీపంలో బుల్లెట్ రైలు స్టేషన్ ను నిర్మిస్తున్నారనిముంబయిఢిల్లీ ఎక్స్ ప్రెస్ వే సిల్వస్సా మీదుగానే వెళుతుందని ప్రధానమంత్రి తెలిపారుగత కొన్నేళ్లుగా అనేక కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మించారనిప్రస్తుతం వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో 500 కిలోమీటర్లకు పైగా రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారుఉడాన్ పథకం ద్వారా ఈ ప్రాంతం కూడా లబ్ది ప్రయోజనం పొందుతోందికనెక్టివిటీని పెంచడానికి స్థానిక విమానాశ్రయాన్ని అప్ గ్రేడ్ చేస్తున్నారుఈ ప్రాంతంలో సమగ్ర అభివృద్ధిమౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

దాద్రా నగర్ హవేలీదామన్ దివే అభివృద్ధికిసుపరిపాలనకుజీవన సౌలభ్యానికి నమూనాలుగా నిలుస్తున్నాయని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారుగతంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పదేపదే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేవారనికానీ ఇప్పుడు మొబైల్ ఫోన్లలో ఒక్క క్లిక్ తో చాలా వరకు ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తి చేయగలుగుతున్నారన్నారుదశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన గిరిజన ప్రాంతాలకు ఈ కొత్త విధానం ఎంతో మేలు చేసిందిగ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు విని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారుఇందుకుగాను శ్రీ ప్రఫుల్ పటేల్ నుఆయన బృందాన్ని ప్రధానమంత్రి అభినందించారుఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని ప్రజలకు హామీ ఇచ్చారు. “ఈరోజు ప్రారంభించిన విజయవంతమైన అభివృద్ధి ప్రాజెక్టులకు గాను దాద్రా నగర్ హవేలీదామన్ దివే ప్రజలకు నా అభినందనలుకేంద్ర పాలిత ప్రాంత ప్రజలు చూపిన ఆత్మీయ స్వాగతంఆప్యాయతగౌరవానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని ప్రధానమంత్రి ముగించారు.

నేపథ్యం

దేశంలోని అన్ని మూలల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను పెంపొందించడంపై ప్రధానమంత్రి ప్రధానంగా దృష్టి సారించారుదీనికి అనుగుణంగా సిల్వస్సాలో నమో హాస్పిటల్ (ఫేజ్ 1)ను ఆయన ప్రారంభించారురూ.460 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ 450 పడకల ఆసుపత్రి కేంద్ర పాలిత ప్రాంతంలో ఆరోగ్య సేవలను గణనీయంగా బలోపేతం చేస్తుందిఇది ఈ ప్రాంత ప్రజలకుముఖ్యంగా గిరిజన వర్గాలకు అత్యాధునిక వైద్య సేవలను అందిస్తుంది.

సిల్వస్సాలో రూ.2580 కోట్లకు పైగా విలువైన కేంద్రపాలిత ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలుశంకుస్థాపనలు చేశారువీటిలో వివిధ గ్రామ రహదారులుఇతర రహదారుల మౌలిక సదుపాయాలుపాఠశాలలుఆరోగ్యవెల్నెస్ సెంటర్లుపంచాయతీపరిపాలనా భవనాలుఅంగన్వాడీ కేంద్రాలునీటి సరఫరామురుగునీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయికనెక్టివిటీని మెరుగుపరచడంపారిశ్రామిక వృద్ధిని పర్యాటకాన్ని ప్రోత్సహించడంఉపాధి అవకాశాలను సృష్టించడంఈ ప్రాంతంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పెంచడం ఈ ప్రాజెక్టుల లక్ష్యం.

షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ), మైనారిటీలుదివ్యాంగులకు చెందిన మహిళలకు చిన్న పాల కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా వారి జీవితాల్లో సామాజికఆర్థిక మార్పులతో ఆర్థిక సాధికారతను పెంపొందించడం గిర్ ఆదర్శ్ ఆజీవిక యోజన లక్ష్యంగా పెట్టుకుందిమహిళా వీధి వ్యాపారులను ప్రోత్సహించే సిల్వన్ దిదీ పథకం కింద వారి వ్యాపారాలకు సౌకర్యవంతమైన బండ్లు అందిస్తారు.. ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా ఈ పథకానికి నిధులు అందిస్తారు.