Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐసీసీ అండర్- 19 మహిళా టి-20 ప్రపంచ కప్ 2025ను గెలిచిన భారత్.. జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు


‘ఐసీసీ అండర్- 19 మహిళా టి-20 ప్రపంచ కప్ 2025’ను గెలిచిన భారత్ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ –

 

‘‘మన నారీ శక్తిని చూస్తే చాలా గర్వంగా ఉంది. ‘ఐసీసీ అండర్- 19 మహిళా టి-20 ప్రపంచ కప్ 2025’లో విజయాన్ని సాధించినందుకు భారతీయ జట్టుకు అభినందనలు.  ఈ గెలుపునకు ఉత్తమ టీంవర్క్‌, ద‌ృఢ సంకల్పంలతోపాటు ధైర్యం కూడా  తోడ్పడింది.ఈ గెలుపు అనేక మంది వర్ధమాన క్రీడాకారిణులకు, క్రీడాకారులకు ప్రేరణనిస్తుంది. ఈ జట్టు భావి ప్రయత్నాల్లో కూడా రాణించాలని నేను ఆశిస్తూ, జట్టు సభ్యులకు నా శుభాకాంక్షలను అందిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.