ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్ తో ఈ రోజు టెలిఫోనులో మాట్లాడారు.
ఈ ఫోన్ కాల్ సందర్భంగా, ప్రధాన మంత్రి ప్రజాస్వామ్య, స్థిర, శాంతియుత, ప్రగతిశీల బంగ్లాదేశ్ కు భారతదేశం మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా బంగ్లాదేశ్ ప్రజలకు సహాయాన్ని కొనసాగించే విషయంలో భారతదేశం కట్టుబడి ఉందన్న విషయాన్ని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు, ఇతర మైనారిటీ వర్గాల భద్రత కల్పించడం ముఖ్యమని ప్రధాన మంత్రి గుర్తుచేశారు.
ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ ప్రతిస్పందిస్తూ తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్ లోని హిందువులతో పాటు మైనారిటీ ప్రజల భద్రతకు ప్రాధాన్యాన్ని ఇస్తుందంటూ హామీని ఇచ్చారు.
రెండు దేశాల ప్రాధాన్యాలకు అనుగుణంగా ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఉన్న అవకాశాలపై ఇద్దరు నేతలు చర్చించారు.
***
Received a telephone call from Professor Muhammad Yunus, @ChiefAdviserGoB. Exchanged views on the prevailing situation. Reiterated India's support for a democratic, stable, peaceful and progressive Bangladesh. He assured protection, safety and security of Hindus and all…
— Narendra Modi (@narendramodi) August 16, 2024